ఇటీవలే విడుదలైన హాలీవుడ్ మూవీ అబ్సెషన్ ఇండియాలో ఎంత భారీ వసూళ్లు రాబడుతోందో చూస్తున్నాం, విజువల్ ఎఫెక్ట్స్ లేకుండా కథలో అధిక భాగం ఒక్క చిన్న గదిలో జరిగినా సరే ప్రేక్షకులు ఎగబడి చూశారు. ఒక్క ఇండియాలోనే వంద కోట్ల దాకా వసూళ్లు రావొచ్చని ఒక అంచనా. థియేటర్ రిలీజ్ జరిగి మూడు వారాలు దాటుతున్నా హైదరాబాద్, ముంబై లాంటి నగరాల్లో హౌస్ ఫుల్స్ తో ఆడుతోంది. అయితే ఇలాంటి సంచలనం ఇంకో సినిమా చేసిందంటే ఆశ్చర్యం కలిగించే విషయమే.
అమెరికన్ యూట్యూబర్ మార్కిప్లైయర్ కు చాలా పేరు ఉంది. మూడున్నర కోట్లకు పైగా ఫాలోయర్లు ఉన్నారు. ఇతను ‘ఐరన్ లంగ్’ అనే సినిమా తీశారు. బడ్జెట్ కేవలం 4 మిలియన్ డాలర్లు. అంటే మన లెక్కలో సుమారుగా 34 కోట్లన్న మాట. ఎలాంటి స్టూడియోల సపోర్ట్ లేకుండా, ఏ నిర్మాతను కలవకుండా మార్కిప్లైయర్ స్వంతంగా ఈ మూవీ తీశాడు. మార్కెటింగ్ కూడా పెద్దగా చేసుకోలేదు. దీంతో ఫాలోయర్లే సపోర్ట్ గా నిలిచారు. ఐరన్ లంగ్ ప్రచార బాధ్యతలు నిర్వహించారు.
కట్ చేస్తే జనవరిలో రిలీజైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. సుమారుగా 350 కోట్లకు పైగా వసూలు చేసి ఔరా అనిపించుకుంది. అబ్సెషన్ లాగే ఇందులో కూడా షాకింగ్ స్టోరీ ఉంటుంది. భవిష్యత్తులో ప్రపంచం మొత్తం నాశనం అయిపోయాక కేవలం కొన్ని గ్రహాలు మాత్రమే ఉంటాయి. ఒక రక్తపు సముద్రంలో నిక్షిపమైన రహస్యాలను తెలుసుకునేందుకు బ్రతికి ఉన్న అతి కొద్ది మనుషులు ఒక పాత సబ్ మెరైన్ లో హీరోని ఒంటరిగా పంపిస్తారు. ఆ తర్వాత జరిగేదే అసలు స్టోరీ.
కేవలం 2 గంటల 7 నిమిషాల నిడివితో రూపొందిన ఐరన్ లంగ్ యూఎస్ లో ఘనవిజయం సాధించింది. దీన్ని మన దేశంలోనూ విస్తృతంగా రిలీజ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎలాంటి స్టార్ స్టేటస్ లేని ఒక యూట్యూబర్ ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇవ్వడం మూవీ మేకర్స్ ని ఆశ్చర్యపరుస్తోంది. సూపర్ హీరోస్ కథలకు దూరంగా అతి తక్కువ బడ్జెట్ లో రూపొందుతున్న ఇలాంటి అద్భుతాలను చూసి ప్యాన్ ఇండియా పేరుతో సమయాన్ని వృథా చేస్తున్న వాళ్ళు ఎంతో నేర్చుకోవాలి.
This post was last modified on June 18, 2026 12:14 pm
బారత ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ... వరుసబెట్టి మూడు పర్యాయాలు దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా దేశానికి అత్యధిక…
కొత్త నెల వచ్చేసింది. సంక్రాంతి అయిపోయాక ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా జనాలు రాక థియేటర్లు అలో లక్ష్మణా అంటున్న…
జంతర్ మంతర్ ఆందోళనలో విద్యార్థులు తనను దుషించారని ప్రధాని మోదీ శుక్రవారం రాత్రి విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో…
నేటి తరం రాజకీయ నాయకులలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కుమార్ స్టైలే వేరు. నిబద్దత కలిగిన నాయకుడిగా ఎదిగినప్పటికి…
గత రెండు మూడు రోజులుగా మహేష్ బాబు గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. జయకృష్ణ తొలి సినిమ…
గత కొన్ని వారాలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పెద్ది తెలుగు రాష్ట్రాల్లో బాగా ఆడితే…