బాలీవుడ్లో డ్రగ్ రాకెట్ గురించి కొన్ని నెలలుగా ఎంత చర్చ జరిగిందో తెలిసిందే. కాగా ఇప్పుడు ఆ సిటీలో మరోసారి మాదక ద్రవ్యాల గురించి చర్చ తెరపైకి వచ్చింది. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు ముంబయిలోని మీరా రోడ్డులో ఉన్న ఓ హోటల్పై దాడులు నిర్వహించి అక్కడ డ్రగ్ రాకెట్ ముఠా గుట్టు రట్టు చేశారు. పక్కా సమాచారంతో అక్కడికి చేరుకున్న అధికారులు.. పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఒక టాలీవుడ్ నటి డ్రగ్స్తో పోలీసులకు పట్టుబడినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. ఆమెతో పాటు చాంద్ అనే వ్యక్తిని అధికారులు అరెస్ట్ చేశారు.
సదరు నటి నుంచి 400గ్రాముల మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వీరికి డ్రగ్స్ సరఫరా చేసిన సాయిద్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు. పట్టుబడ్డ డ్రగ్స్ విలువ రూ.10లక్షలు ఉంటుందని తెలుస్తోంది. గత ఏడాది నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణానంతరం బాలీవుడ్లో డ్రగ్ రాకెట్ మీద ఎన్సీబీ అధికారులు దృష్టిసారించారు.
సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి, ఆమె సోదరులతో పాటు దీపికా పదుకొనే, సారా అలీఖాన్, రకుల్ ప్రీత్సింగ్ తదితరులను అధికారులు విచారించిన విషయం తెలిసిందే. కొంత విరామం తర్వాత ఈ మధ్య మళ్లీ కొందరు బాలీవుడ్ నటులను విచారణకు పిలిచారు. ఇలాంటి సమయంలో ముంబయి డ్రగ్స్తో ఓ టాలీవుడ్ నటి పట్టుబడటం చర్చనీయాంశమవుతోంది. ఆ నటి ఎవరన్న వివరాలు బయటికి రాలేదు.
This post was last modified on January 4, 2021 7:00 am
ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…
సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…
అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పుడు కేవలం భూమి, ఆకాశానికే పరిమితం కాకుండా సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థపై కూడా నీలినీడలు…
రోటీన్ కు తగ్గట్లు వ్యవహరిస్తే కిక్ ఏముంటుంది? వినూత్న ఆలోచనలకు వేదికగా హైదరాబాద్ మహానగరం సాగుతోంది. ఇందులో భాగంగా సరికొత్త…
వసూళ్ల లెక్కల్లోనే కాదు చాలా విషయాల్లో దురంధర్ ది రివెంజ్ ఎవరికీ అందని రికార్డులు సొంతం చేసుకుంటోంది. భారతీయ సినీ…
నిన్న జరిగిన బ్యాండ్ మేళం సక్సెస్ మీట్ లో ఎక్కువ శాతం నటీనటులు, దర్శకుడు ఒక పాయింట్ మీద ఫిర్యాదు…