కొన్ని సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర పరిస్థితులు కలిసొచ్చి యావరేజ్ కంటెంట్తోనే ఇరగాడేస్తుంటాయి. రివ్యూలు, టాక్ అంతంతమాత్రంగా ఉన్నా సరే.. సినిమాకు భారీ వసూళ్లు వస్తుంటాయి. జనం ఎగబడి ఆ సినిమాను థియేటర్లలో చూసేస్తుంటారు. అలాగే కొన్ని సినిమాలకు టాక్ బాగున్నా సరే.. జనానికి రీచ్ కాకపోవడం వల్ల, బాక్సాఫీస్ దగ్గర ప్రతికూల పరిస్థితుల వల్ల అవి బాగా ఆడవు. ఐతే ఓటీటీలో రిలీజైనపుడు ఈ రెండు రకాల సినిమాలకూ స్పందన భిన్నంగా ఉంటుంది. అనుకోకుండా బాగా ఆడిన సినిమాను తెగనాడుతుంటారు.
అలాగే పరిస్థితులు కలిసి రాక సరిగా ఆడని సినిమాలు చూసి జాలి పడుతుంటారు. సూర్య సినిమా ‘కరుప్పు’ (తెలుగులో వీరభద్రుడు) మొదటి కోవకే చెందుతుంది. గత నెలలో విడుదలైన ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో విజయవంతమైంది. తెలుగులో అయినా ఒక మోస్తరుగా ఆడింది కానీ.. తమిళంలో అయితే బ్లాక్ బస్టర్ అయింది. ఏకంగా రూ.330 కోట్ల వసూళ్లతో ఈ ఏడాదికి తమిళంలో అతి పెద్ద హిట్గా నిలవడమే కాదు.. సూర్య కెరీర్లోనూ హైయెస్ట్ గ్రాసర్ అయింది.
ఐతే ఇటీవలే ‘కరుప్పు’ను ఓటీటీలోకి తీసుకొచ్చారు. తెలుగు వెర్షన్ ‘వీరభద్రుడు’ సైతం అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా చూసిన తెలుగు ప్రేక్షకులు.. తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇదేం సినిమా.. ఇది ఎలా హిట్టయింది.. థియేటర్లలో బాగా ఆడింది కదా అని చూస్తే రెండున్నర గంటలు వేస్ట్ అయ్యాయి అంటూ ఈ సినిమా మేకర్స్ మీద మండిపడుతున్నారు. నిజానికి తమిళంలో అంత పెద్ద హిట్టయినా సరే.. అక్కడి ప్రేక్షకులు కూడా డిజిటల్గా ఈ సినిమాను చూసి పెదవి విరుస్తున్నారు.
ఈ చిత్రానికి విడుదల ముంగిట తీవ్ర ఇబ్బందులు తలెత్తి ఒక రోజు ఆలస్యంగా సినిమా రిలీజైన సంగతి తెలిసిందే. ఆ సింపతీ సినిమాకు కలిసొచ్చిందని.. ఫ్యాన్ మూమెంట్స్, మాస్ అంశాలు, యాక్షన్ ఘట్టాలతో సినిమా గట్టెక్కేసిందని.. ప్రమాణాలు పడిపోయిన తమిళ సినిమాల్లో ఈ మాత్రం చిత్రం కూడా గగనం అయిపోయి ఈ సినిమా ఆడేసి ఉండొచ్చు తప్ప అంత పెద్ద హిట్టవ్వాల్సిన సినిమా కాదంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.
This post was last modified on June 15, 2026 1:56 pm
వైసీపీకి డేంజర్ బెల్స్ మోగుతున్నాయా.. ఉత్తరాంధ్రలో తాజాగా చోటు చేసుకున్న చిన్న శ్రీను వ్యవహారంతో పాటు.. పార్టీలో మరింత మంది…
జాంబీ సినిమాలో వైరస్ లాగా ఏఐ వాడకం క్రమంగా టెకీస్ నుంచి సామాన్యుల చేతుల్లోకి వెళ్ళిపోతోంది. ఒకరేమో వారణాసిలో మహేష్…
లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…
ఎన్నికల సమయంలో ఉచిత పథకాలు ప్రకటించే దేశం ఏది అని అడిగితే.. ఠక్కున చెప్పే పేరు భారత్. రాష్ట్రాల అసెంబ్లీల…
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…
మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…