కొన్ని సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర పరిస్థితులు కలిసొచ్చి యావరేజ్ కంటెంట్తోనే ఇరగాడేస్తుంటాయి. రివ్యూలు, టాక్ అంతంతమాత్రంగా ఉన్నా సరే.. సినిమాకు భారీ వసూళ్లు వస్తుంటాయి. జనం ఎగబడి ఆ సినిమాను థియేటర్లలో చూసేస్తుంటారు. అలాగే కొన్ని సినిమాలకు టాక్ బాగున్నా సరే.. జనానికి రీచ్ కాకపోవడం వల్ల, బాక్సాఫీస్ దగ్గర ప్రతికూల పరిస్థితుల వల్ల అవి బాగా ఆడవు. ఐతే ఓటీటీలో రిలీజైనపుడు ఈ రెండు రకాల సినిమాలకూ స్పందన భిన్నంగా ఉంటుంది. అనుకోకుండా బాగా ఆడిన సినిమాను తెగనాడుతుంటారు.
అలాగే పరిస్థితులు కలిసి రాక సరిగా ఆడని సినిమాలు చూసి జాలి పడుతుంటారు. సూర్య సినిమా ‘కరుప్పు’ (తెలుగులో వీరభద్రుడు) మొదటి కోవకే చెందుతుంది. గత నెలలో విడుదలైన ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో విజయవంతమైంది. తెలుగులో అయినా ఒక మోస్తరుగా ఆడింది కానీ.. తమిళంలో అయితే బ్లాక్ బస్టర్ అయింది. ఏకంగా రూ.330 కోట్ల వసూళ్లతో ఈ ఏడాదికి తమిళంలో అతి పెద్ద హిట్గా నిలవడమే కాదు.. సూర్య కెరీర్లోనూ హైయెస్ట్ గ్రాసర్ అయింది.
ఐతే ఇటీవలే ‘కరుప్పు’ను ఓటీటీలోకి తీసుకొచ్చారు. తెలుగు వెర్షన్ ‘వీరభద్రుడు’ సైతం అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా చూసిన తెలుగు ప్రేక్షకులు.. తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇదేం సినిమా.. ఇది ఎలా హిట్టయింది.. థియేటర్లలో బాగా ఆడింది కదా అని చూస్తే రెండున్నర గంటలు వేస్ట్ అయ్యాయి అంటూ ఈ సినిమా మేకర్స్ మీద మండిపడుతున్నారు. నిజానికి తమిళంలో అంత పెద్ద హిట్టయినా సరే.. అక్కడి ప్రేక్షకులు కూడా డిజిటల్గా ఈ సినిమాను చూసి పెదవి విరుస్తున్నారు.
ఈ చిత్రానికి విడుదల ముంగిట తీవ్ర ఇబ్బందులు తలెత్తి ఒక రోజు ఆలస్యంగా సినిమా రిలీజైన సంగతి తెలిసిందే. ఆ సింపతీ సినిమాకు కలిసొచ్చిందని.. ఫ్యాన్ మూమెంట్స్, మాస్ అంశాలు, యాక్షన్ ఘట్టాలతో సినిమా గట్టెక్కేసిందని.. ప్రమాణాలు పడిపోయిన తమిళ సినిమాల్లో ఈ మాత్రం చిత్రం కూడా గగనం అయిపోయి ఈ సినిమా ఆడేసి ఉండొచ్చు తప్ప అంత పెద్ద హిట్టవ్వాల్సిన సినిమా కాదంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.
జూన్ 19 విడుదల కాబోతున్న మా ఇంటి బంగారం కౌంట్ డౌన్ మొదలైపోయింది. కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమే…
కథానాయికగా పరిచయం అయింది తమిళంలోనే అయినా.. తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసి గుర్తింపు సంపాదించింది నివేథా పెతురాజ్. మెంటల్ మదిలో,…
ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడు హోదాలో ఉన్న వ్యక్తి నోటి నుంచి ఒక మాట వస్తే.. అదో నిజమన్నట్లుగా ఉండేది. అలాంటి…
ఢిల్లీలో 'జాతీయ సమగ్రత కోసం సేన ప్రస్థానం' పేరుతో 3 రోజుల పాటు సభలను నిర్వహించాలని జనసేన నిర్ణయించిన సంగతి…
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)గా ఏర్పడి ఉద్యమాలు చేస్తున్న ఈ పార్టీ.. దేశవ్యాప్తంగా విస్తరించే ప్రణాళికలు అమలు చేస్తోంది. కొన్ని రోజుల…
అభివృద్ధి కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం అరుదైన గౌరవం కల్పించింది. విమానాశ్రయం ప్రారంభోత్సవం…