కథానాయికగా పరిచయం అయింది తమిళంలోనే అయినా.. తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసి గుర్తింపు సంపాదించింది నివేథా పెతురాజ్. మెంటల్ మదిలో, చిత్రలహరి, అల వైకుంఠపురములో, రెడ్, విరాటపర్వం, దాస్ కా ధమ్కీ.. ఇవీ ఆమె తెలుగులో నటించిన సినిమాలు. వీటిలో చాలా వరకు నివేథాకు మంచి గుర్తింపునే తెచ్చాయి.
ఐతే కెరీర్ బాగా సాగుతున్న టైంలోనే 2023లో రజిత్ అనే దుబాయ్ బేస్డ్ బిజినెస్మ్యాన్తో ఎంగేజ్మెంట్ చేసుకుని వ్యక్తిగత జీవితంలో స్థిరపడాలనుకుంది. ఈ సమయంలో సినిమాలకు కూడా తాను గుడ్బై చెప్పేస్తున్నట్లు కూడా ప్రకటించింది. ఐతే ఎంగేజ్ అయితే అయ్యారు కానీ.. వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోలేదు.
గత ఏడాది అనూహ్యంగా తన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంటున్నట్లు నివేథా ప్రకటించింది. ఆ తర్వాత మళ్లీ నెమ్మదిగా సినిమాల్లో బిజీ అవుతోందామె. టాలీవుడ్ లేటెస్ట్ రిలీజ్ ‘సింగ్ గీతం’లో ఆమె ఒక కీలక పాత్ర చేసింది. దానికి మంచి స్పందన వస్తోంది.
‘సింగ్ గీతం’ సక్సెస్ మీట్లో నివేథా పెతురాజ్ మాట్లాడుతూ.. వ్యక్తిగత జీవితంలో జరిగిన కొన్ని పరిణామాల వల్ల తాను హిమాలయాలకు వెళ్లిపోవాలన్న ఆలోచన చేసినట్లు వెల్లడించడం విశేషం. జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపు తీసుకుంటుందో తెలియదంటూ 2023లో సినిమాల నుంచి వీడ్కోలు తీసుకోవాలనుకున్న తాను.. సింగీతం శ్రీనివాసరావు లాంటి లెజెండ్ రూపొందించిన సినిమాలో భాగం కావడం ఊహించని విషయమని ఆమె చెప్పింది.
కొన్నిసార్లు జీవితంలో మనం చేసే తప్పులను కరెక్ట్ చేసుకునే అవకాశం లభిస్తుందని.. హిమాలయాలకు వెళ్లిపోవాలనుకున్న తాను ‘సింగ్ గీతం’ చిత్రంలో నటించాను అంటే.. అది కేవలం నాగ్ అశ్విన్ వల్లే అని ఆమె వ్యాఖ్యానించింది. తన ఆలోచన విధానాన్ని మార్చి, ఇలాంటి గొప్ప సినిమాలో భాగం అయ్యేలా చేసిన ఘనత తనదే అంటూ ఆమె కొనియాడింది.
సూటిగా విషయం చెప్పకపోయినా.. సినిమాలకు గుడ్ బై చెప్పి పెళ్లి చేసుకోవాలన్న తన నిర్ణయం తప్పని ఆమె చెప్పకనే చెప్పింది. సెకండ్ ఇన్నింగ్స్లో నివేథా ఒక్కసారిగా బిజీ అయిపోయే సంకేతాలు కనిపిస్తున్నాయి. వెంకీ మూవీ ‘ఆదర్శ కుటుంబం’తో పాటు చిరు-బాబీ సినిమాలోనూ ఆమె నటిస్తుండడం విశేషం.
This post was last modified on June 15, 2026 1:29 pm
తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఎప్పటికప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. గ్రాండ్ ఓల్డ్ పార్టీలో ఈ తరహా పరిస్థితులు కొత్తేమీ…
అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ హీరోగా స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి రూపొందించిన ‘ఏజెంట్’ టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద…
ఒక సినిమా రిలీజైన రెండు మూడేళ్ల తర్వాత కూడా దాని కలెక్షన్ల గురించి విపరీతమైన చర్చ జరగడం అరుదు. ‘దేవర’ విషయంలో ఇదే…
కేంద్ర విద్యా శాఖకు నూతన మంత్రిగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్న ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు.…
బాక్సాఫీస్ దగ్గర పోటీ ఉన్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతాయి. ఇది అలాంటిదే. కేవలం ఒక్క రోజు గ్యాప్ తో…
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న స్పైడర్ మ్యాన్ సిరీస్ లోని కొత్త సినిమా బ్రాండ్ న్యూ డే జూలై…