దర్శకుడు నాగ్ అశ్విన్ ఎంత సెలెక్టివ్ గా ఉంటారో తెలిసిందే. కథలు, క్యాస్టింగ్, టీమ్, కంటెంట్ ఏదైనా సరే రాజీ లేకుండా తాను కోరుకున్నది చేసేంత వరకు రాజీ పడని మనస్తత్వం తనది. అలాంటి దర్శకుడికి సెంటిమెంటో అంతకు మించిన స్నేహమో ఏమో కానీ విజయ్ దేవరకొండని వదలకుండా తన ప్రతి వర్క్ లో కనిపించేలా చేయడం మూవీ లవర్స్ ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. నిన్న విడుదలైన ‘సింగ్ గీతం’లో కూడా రౌడీ బాయ్ చిన్న క్యామియో చేయడం విశేషం.
దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడం వెనుక కారణం ఉంది. నాగ్ అశ్విన్ దర్శకుడిగా తీసిన మొదటి సినిమా ‘ఎవడే సుబ్రహ్మణ్యం’లో విజయ్ దేవరకొండకి ఎంత ప్రాధాన్యత దక్కిందో తెలిసిందే. ఒకరకంగా చెప్పాలంటే నానినే ఓవర్ షాడో చేసే రేంజ్ లో ఆ పాత్ర పండింది. ఆ తర్వాత ‘మహానటి’లో జర్నలిస్టుగా కనిపించేది కేవలం కొన్ని నిమిషాలే అయినా నో అనకుండా చేశారు. ఇక ‘కల్కి 2898 ఏడి’లో ఇచ్చిన సర్ప్రైజ్ చిన్నదేం కాదు. చాలా ఇంపాక్ట్ ఇచ్చింది.
నాగ్ అశ్విన్ నిర్మాణ వ్యవహారాలు చూసుకున్న ‘జాతిరత్నాలు’లో విజయ్ దేవరకొండ ఉన్నాడు. ఇదంతా గమనిస్తే వీళ్ళ బాండింగ్ చాలా స్పెషల్ అనిపిస్తోంది. సింగ్ గీతం క్లైమాక్స్ ని తనతోనే ముగించిన తీరు చూస్తుంటే సింగీతం శ్రీనివాసరావుగారి దర్శకత్వంలో ఒక్క సీన్ లో అయినా నటించాననే సంతృప్తి రౌడీ హీరోకి మిగిలింది. దీని వల్ల కమర్షియల్ స్కేల్ పెరిగినా పెరగకపోయినా మొదటి రోజు ఇది తెలియకుండా వెళ్లిన ఆడియన్స్ కి చివరిలో సర్ప్రైజ్ ఇచ్చారని చెప్పొచ్చు.
కల్కి 2లో కూడా ఈ కాంబో ఉంటుందని వేరే చెప్పనక్కర్లేదు. ఎక్కువ నిడివి ఉంటుందని నాగ్ అశ్విన్ గతంలోనే హింట్ ఇచ్చారు. అంటే ప్రభాస్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ ని ఫుల్ లెన్త్ లో చూసే ఛాన్స్ దొరికితే అంతకన్నా ఫ్యాన్స్ కోరుకునేది ఏముంటుంది. కాకపోతే కథ పరంగా అది సాద్యమవుతుందో లేదో చూడాలి. ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇలా షేరింగ్ తరహాలో కాకుండా విజయ్ సోలో హీరోగా నాగ్ అశ్విన్ ఒక పూర్తి నిడివి సినిమా చేయాలని ఫ్యాన్స్ కోరిక. ఎప్పటికి తీరేనో.
This post was last modified on June 13, 2026 12:37 pm
నిన్న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా వచ్చిన నేషనల్ హాలిడే బాక్సాఫీస్ కు సూపర్ గా కలిసి వచ్చింది. మాములుగానే వీకెండ్…
నాగచైతన్య నటిస్తున్న మిథికల్ అడ్వెంచర్ 'వృషకర్మ' రిలీజ్ డేట్ మీద గత కొద్ది రోజులుగా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ…
'ఫౌజీ' సినిమా నుంచి ఇప్పటిదాకా వచ్చిన పోస్టర్లు చూస్తుంటే మేకర్స్ ఇంటెన్షన్ క్లియర్ గా అర్థమవుతోంది. ప్రభాస్ ను సాఫ్ట్…
ఎన్నికల్లో నోట్లు పంపిణీ చేస్తేనే ఓట్లు వేయడం మామూలైపోయింది. గత కొన్నేళ్లుగా ఈ దుస్సాంప్రదాయం పెరిగిపోయింది. దీంతో నిజంగా ప్రజలకు…
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి వచ్చిన ఒక వీడియో ఇప్పుడు వివాదానికి కేంద్రంగా మారింది.…
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) అధినేత అభిజిత్ దీప్కే ఇటీవల ప్రకటించిన `పాఠశాలల అభివృద్ధి` కార్యక్రమానికి 80వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలే…