ఈ ఏడాది ‘దురంధర్-2’ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ బాగానే కళకళలాడినప్పటికీ.. ఓవరాల్ సక్సెస్ రేట్ ఏమీ అంత గొప్పగా లేదు. చాలా సినిమాలు నిరాశపరిచాయి. వేసవిలో అక్షయ్ కుమార్ సినిమా ‘భూత్ బంగ్లా’ ఓ మాదిరిగా ఆడింది. దాని తర్వాత ట్రేడ్ ఎక్కువ ఆశలు పెట్టుకున్న సినిమా ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’. వరుణ్ ధావన్ హీరోగా నటించిన ఈ చిత్రంలో అతడికి జోడీగా మృణాల్ ఠాకూర్, పూజా హెగ్డే లాంటి అందాల భామలు నటించారు.
ఒకేసారి తన ఇద్దరు అమ్మాయిలతో రొమాన్స్ చేసి, ఆ ఇద్దరూ ప్రెగ్నెంట్ అయితే ఆ మగాడి పరిస్థితి ఏంటన్న కథాంశంతో వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించాడు సీనియర్ దర్శకుడు డేవిడ్ ధావన్. ఐతే కామెడీ, రొమాంటిక్ ట్రాక్స్ కొంతమేర వర్కవుట్ అయినప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా క్లిక్ కాలేదు.
యావరేజ్ రివ్యూలు, కలెక్షన్లతో ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ బాలీవుడ్ను నిరాశకు గురి చేసింది. దీంతో పాటే మరో హిందీ మూవీ ‘బందర్’ కూడా రిలీజ్ కాగా.. అది బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది. ఒకప్పుడు బాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసి, ఆ తర్వాత ఫామ్ కోల్పోయిన కల్ట్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఈ చిత్రంతో మళ్లీ తన సత్తా చాటాలనుకున్నాడు.
కానీ గత చిత్రాలతో పోలిస్తే మెరుగైన సినిమానే తీసినప్పటికీ.. ఈ చిత్రాన్ని చూడడానికి జనం థియేటర్లకు రాలేదు. బాబీ డియోల్ లాంటి క్రేజీ నటుడు లీడ్ రోల్ చేసిన ఈ సినిమాకు వసూళ్లు దారుణంగా ఉన్నాయి. టాక్ బాగున్నా జనం ఈ సినిమాను చూడట్లేదు. ఐతే పేరున్న రెండు హిందీ చిత్రాలు నిరాశపరిచిన నేపథ్యంలో ‘పెద్ది’కి నార్త్ ఇండియాలో కలిసొస్తుందేమో అనుకుంటే అదీ జరగలేదు.
ఈ చిత్రం ఇప్పటిదాకా నార్త్ మార్కెట్లో రూ.18 కోట్ల మేర నెట్ వసూళ్లు రాబట్టినట్లు అంచనా. ‘పెద్ది’కి రిలీజ్ ముంగిట నార్త్లో ఉన్న క్రేజ్ చూసి అద్భుతాలు చేస్తుందనుకుంటే.. వారం రోజుల్లో మరీ ఇంత తక్కువ వసూళ్లతో సరిపెట్టుకుంటుందని ఎవ్వరూ అనుకుని ఉండరు. ఇకపై ఏమైనా సినిమా పుంజుకుని వసూళ్లు పెంచుకుంటుందేమో చూడాలి.
తమరిది అన్నదమ్ముల అనుబంధం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ పలుమార్లు వ్యాఖ్యానించారు.…
రాష్ట్రంలో బౌలర్స్(ప్రత్యర్థులు) మారినా బ్యాట్స్మెన్ మాత్రం చంద్రబాబు నాయుడేనని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. తిరుపతిలో జరిగిన ప్రభుత్వ వియోజత్సవ…
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ తో పాటు గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కొడాలి శ్రీవేంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నాని… చాలా రోజుల తర్వాత తన సొంతూరు…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తున్నారని చెప్పాలి. ఇదివరకే…
తాము ఏపీ కోసం.. ఏపీ ప్రజల కోసం త్యాగం చేశామని.. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.…