మెగా ఫ్యాన్స్, ఐకాన్ స్టార్ అభిమానుల మధ్య బయటికి కనిపించని కోల్డ్ వార్ జరుగుతూనే ఉంటుంది. హీరోలు వాళ్ళు వాళ్ళు ఎంత బాగున్నా సోషల్ మీడియాలో వ్యవహారాలు మాత్రం వేరుగా ఉంటాయి. చెప్పను బ్రదర్ వివాదం వీటికి పునాది వేస్తే తర్వాత జరిగిన రకరకాల పరిణామాలు, ఎన్నికల టైంలో బన్నీ అనుసరించిన వ్యవహార శైలి మరింత ఆజ్యం పోశాయి. ఇది చల్లారే పరిస్థితి ఉన్నట్టు కనిపించినా తర్వాత కథ మళ్లీ మొదటికే వచ్చేది. ఇప్పుడు పెద్ది వంతు వచ్చింది.
గత శుక్రవారం విడుదలైన పెద్దిని అల్లు అర్జున్ చూశాడు. అంతేకాదు ప్రత్యేకంగా రామ్ చరణ్ ని పొగడ్తలతో ముంచెత్తుతూ పెద్ద ట్వీట్ పెట్టాడు. దర్శకుడు బుచ్చిబాబు, ఇతర టీమ్ సభ్యులను విష్ చేసినప్పటికీ బావ మీద స్పెషల్ గా కాంప్లిమెంట్స్ కురిపించాడు. మా హీరో బర్త్ డేకి మీవాడు విష్ చేయలేదు, మీ హీరో పుట్టినరోజుకి మేమూ చెప్పలేదు అంటూ సిల్లీగా గొడవలు పడే అభిమానులకు ఇలాంటివి ఆలోచింపజేసేలా ఉంటాయి. వెంటనే కాకపోయినా కొంత మార్పు వస్తుంది.
కాసేపు బన్నీ స్పందన పక్కనపెడితే పెద్ది పట్ల సినీ ప్రముఖుల మౌనం మెగా ఫ్యాన్స్ ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రీమియర్ చూసిన రాజమౌళి, సంజీవ్ రెడ్డి వంగా లాంటి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ల నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. అంతెందుకు ఈ సినిమాలో నిర్మాణ భాగస్వామిగా ఉన్న దర్శకుడి గురువు సుకుమార్ ఇంకా నేరుగా రెస్పాండ్ అవ్వలేదు. ఒకరిద్దరు హీరోలు మినహాయించి పెద్ది గురించి ఎక్స్, ఇన్స్టా లో మాట్లాడిన సెలబ్రిటీలు తక్కువగానే ఉన్నారు.
ఎందుకంటే కారణం సింపుల్. బయట మిక్స్డ్ టాక్ నడుస్తోంది. అక్కడ చూస్తేనేమో కలెక్షన్లు బాగున్నాయి. కంటెంట్ లో హెచ్చుతగ్గులు ఉన్న మాట వాస్తవమే. అలాని పాజిటివ్ గా మాట్లాడితే ఒక తంటా సైలెంట్ గా ఉంటే మరో తంటాలా అయిపోయింది కొందరి పరిస్థితి. పెద్ది యునానిమస్ అనిపించుకుందా లేదా అనేది పక్కన పెడితే రామ్ చరణ్ కష్టం స్క్రీన్ మీద స్పష్టంగా కనిపించింది. దాని గురించి అందరూ కాకపోయినా కనీసం కొందరైనా ఓ రెండు మాటలు పంచుకోవాల్సిందని మెగా ఫ్యాన్స్ కోరిక.
This post was last modified on June 9, 2026 7:53 pm
సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…
తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…
సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…
వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…
భారతదేశంలోనే వివాహం చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1…
వేణుంబాక విజయసాయిరెడ్డి… వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ అధినేత జగన్ కు నమ్మినబంటు. పార్టీలో జగన్ తర్వాత నంబర్…