త్రివిక్రమ్ కెరీర్లో అత్యంత క్యూరియాసిటీ రేకెత్తిస్తున్న చిత్రం.. గాడ్ ఆఫ్ వార్. ఇండియన్ మైథాలజీలో పెద్దగా టచ్ చేయని సుబ్రహ్మణ్యస్వామి కథను తెరపైకి తేవాలన్నది త్రివిక్రమ్ ప్రయత్నం. ఎప్పుడో ఈ చిత్రానికి స్క్రిప్టు రెడీ చేశాడు. కానీ కొన్ని కారణాలతో అది ఆలస్యం అవుతోంది. ఆదర్శ కుటుంబం తర్వాత త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని పట్టాలెక్కిస్తాడనే అంచనాలున్నాయి.
జూనియర్ ఎన్టీఆర్ను ఇందులో లీడ్ రోల్లో చూడబోతున్నామని ఆశిస్తున్నారు అభిమానులు. కానీ దీని గురించి ఎప్పుడు అధికారిక ప్రకటన వస్తుందో తెలియట్లేదు. కానీ త్రివిక్రమ్కు చాలా సన్నిహితుడైన సంగీత దర్శకుడు తమన్ మాత్రం ఎప్పటికప్పుడు ఈ సినిమా గురించి ఊరిస్తూనే ఉన్నాడు.
తాజాగా ఒక ఈవెంట్లో ఓ విలేకరి నుంచి తమన్కు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఇప్పటిదాకా మైథాలజీ సినిమాకు పని చేయలేదు, భవిష్యత్తులో అలాంటి సినిమాలో భాగం అవుతారా అని అడిగితే.. అతి త్వరలో అది సాధ్య పడుతుందన్నాడు. అది గాడ్ ఆఫ్ వార్ మూవీయేనా అని అడిగితే.. గాడ్ బ్లెస్ యు బ్రదర్ అంటూ నవ్వేశాడు తమన్. దీన్ని బట్టి త్రివిక్రమ్ తర్వాత తీయబోయేది గాడ్ ఆఫ్ వార్ మూవీయే అని, అందులో తమన్ భాగం అవుతున్నాడని అర్థః చేసుకోవచ్చు.
మరోవైపు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ యల్లమ్మ మూవీతో హీరో అవుతున్నాడు, మరి మీ సంగతేంటి అని అడిగితే.. తమన్ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్లిపోయాడు. తాను ఎప్పుడో కెరీర్ ఆరంభంలోనే బాయ్స్ సినిమాలో వన్ ఆఫ్ ద హీరోస్గా నటించిన విషయాన్ని గుర్తు చేశాడు తమన్. హీరోగా నటించడం అంత సులువైన విషయం కాదని ఈ సందర్భంగా తమన్ వ్యాఖ్యానించాడు. ఎండలో కష్టపడి వడదెబ్బలు తగిలించుకోవడం ఎందుకు, హాయిగా ఏసీలో కూర్చుని ట్యూన్లు చేసుకోవచ్చు కదా అంటూ నవ్వేశాడు తమన్.
ఇక దేవి నటిస్తున్న యల్లమ్మ గురించి తమన్ స్పందిస్తూ.. ఆ సినిమా కథ తాను కూడా విన్నానని, అది కచ్చితంగా బ్లాక్ బస్టర్ అయ్యే సినిమా అని చెబుతూ.. దేవికి ఆల్ ద బెస్ట్ చెప్పాడు. ఈ మధ్య వచ్చిన పాటల్లో ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన చికిరి చికిరి తన ఫేవరెట్ అని.. ఎయిర్ పోర్టుకి వెళ్తూ తాను ఆ పాటే వింటానని తమన్ వెల్లడించాడు. ఈ వయసులో కూడా ఇళయరాజా ఒక స్టూడియో కట్టడం ఎంత గొప్ప విషయం అంటూ మాస్ట్రోను కొనియాడాడు తమన్.
This post was last modified on June 8, 2026 11:12 pm
సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…
తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…
సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…
వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…
భారతదేశంలోనే వివాహం చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1…
వేణుంబాక విజయసాయిరెడ్డి… వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ అధినేత జగన్ కు నమ్మినబంటు. పార్టీలో జగన్ తర్వాత నంబర్…