‘గుంటూరు కారం’ తర్వాత స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తీయాలనుకున్న చిత్రం.. గాడ్ ఆఫ్ వార్. తన కెరీర్లో తొలిసారిగా ఆయన చేయాలనుకున్న పాన్ ఇండియా, ఈవెంట్ ఫిలిం ఇది. కానీ కొన్ని కారణాలతో ఆ సినిమా వెనక్కి వెళ్లింది. ఐతే ఈలోపు తన స్టయిల్లో చకచకా ఒక ఫ్యామిలీ మూవీ తీద్దామనుకున్నారు. అందుకోసం విక్టరీ వెంకటేష్ను హీరోగా ఎంచుకున్నారు.
చకచకా స్క్రిప్టు రెడీ చేసుకుని షూటింగ్కు వెళ్లిపోయారు. అదే.. ఆదర్శకుటుంబం-ఏకే 47. ఐతే ఈ సినిమా అనౌన్స్ చేసినపుడు ఎక్కువ అంచనాలేమీ లేవు. త్రివిక్రమ్ నుంచి ‘గాడ్ ఆఫ్ వార్’ కోసం ఎక్కువమంది ఎదురు చూస్తుండడమే అందుక్కారణం.
త్రివిక్రమ్ ఏదో కాలక్షేపానికి ఈ సినిమా తీస్తున్నాడనే అనుకున్నారు. కానీ క్రమంగా ఈ చిత్రానికి బజ్ పెరుగుతోంది. షూటింగ్, కాస్ట్ అండ్ క్రూ అప్డేట్స్ చూస్తుంటే సినిమా రేంజ్ పెరుగుతున్నట్లే కనిపిస్తోంది. దివ్యేందు, నివేథా పెతురాజ్ ఈ సినిమాలో భాగం అయ్యారు. హర్షవర్ధన్ రామేశ్వర్ స్థానంలోకి తమన్ వచ్చాడు. షూట్ కోసం కూడా త్రివిక్రమ్ ఎక్కువ టైమే తీసుకుంటున్నాడు. మరోవైపేమో దసరా లాంటి క్రేజీ సీజన్లో ‘ఆదర్శ కుటుంబం’ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
పండుగ సెలవుల్లో సరైన ఫ్యామిలీ మూవీ పడితే బాక్సాఫీస్ ఎలా మోత మోగిపోతుందో.. సంక్రాంతికి వస్తున్నాం, మన శంకర వరప్రసాద్ గారు లాంటి చిత్రాలు రుజువు చేశాయి. త్రివిక్రమ్ ఫ్యామిలీ మూవీ అంటే వీటికి మించిన ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇక వెంకీ అంటే కుటుంబ వినోదానికి కేరాఫ్ అడ్రస్. కాబట్టి ఇది డెడ్లీ కాంబినేషన్ అని చెప్పొచ్చు.
త్రివిక్రమ్ రచయితగా వెంకీ నటించిన నువ్వునాకు నచ్చావ్, మల్లీశ్వరి చిత్రాలు ఎంతగా ఎంటర్టైన్ చేశాయో తెలిసిందే. ఇప్పుడు దర్శకుడిగా వాటికి దీటైన సినిమానే త్రివిక్రమ్ అందిస్తాడనే అంచనాలు ప్రేక్షకుల్లో ఉన్నాయి. కాబట్టి అన్నీ సరిగ్గా కుదిరితే ఇది ‘మన శంకర వరప్రసాద్ గారు’ను కూడా మించి రీజనల్ ఇండస్ట్రీ హిట్ అయ్యే అవకాశాలను కొట్టిపారేయలేం.
This post was last modified on June 8, 2026 2:09 pm
తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…
సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…
వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…
భారతదేశంలోనే వివాహం చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1…
వేణుంబాక విజయసాయిరెడ్డి… వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ అధినేత జగన్ కు నమ్మినబంటు. పార్టీలో జగన్ తర్వాత నంబర్…
ఇరుముడి సినిమాలో లీడ్ రోల్ చేసింది టాలీవుడ్ మిడ్ రేంజ్ స్టార్లలో ఒకడైన రవితేజ. ఆయన నుంచి వచ్చిన చివరి…