ఇంకో మూడు రోజుల్లో జూన్ 10 బాలకృష్ణ పుట్టినరోజు రానుంది. ఈసారి గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకునేందుకు అభిమానులు రెడీ అవుతున్నారు. ఈసారి వాళ్లకు ప్రత్యేక కానుకలు సిద్ధమవుతున్నాయి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్బికె 111 టైటిల్ రివీల్ తో పాటు ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయబోతున్నారు. వీరసింహారెడ్డి కాంబినేషన్ కావడంతో అంచనాలు విపరీతంగా ఉన్నాయి. చాలా గ్యాప్ తర్వాత బాలయ్య ఫుల్ లెన్త్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తారని టాక్.
కొరటాల శివ దర్శకత్వంలో రూపొందబోయే యాక్షన్ ఎంటర్ టైనర్ తాలూకు అప్డేట్ కూడా అదే రోజు ఇవ్వబోతున్నారని సమాచారం. సంగీత దర్శకుడు ఎవరనేది రివీల్ చేస్తారని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇవి కాకుండా మరో సర్ప్రైజ్ కాంబో అనౌన్స్ మెంట్ ఉంటుందని అంటున్నారు కానీ అదేంటో కన్ఫర్మ్ అయితే చెప్పలేం. వీటినలా ఉంచితే బాలయ్య మూడు బ్లాక్ బస్టర్లను ఒకే రోజు రీ రిలీజ్ చేయడం అభిమానులను అయోమయంలో పడేస్తోంది.
వాటిలో మొదటిది భైరవ ద్వీపం. 1994లో వచ్చిన ఈ జానపద ఫాంటసీ అప్పట్లో సంచలన విజయం నమోదు చేసింది. జూన్ 11 విడుదల కాబోతున్న సింగ్ గీతం దర్శకులు సింగీతం శ్రీనివాసరావుగారే ఆ ఎపిక్ మూవీకి డైరెక్టర్ కావడం గమనించాల్సిన విషయం. మరొకటి సమరసింహారెడ్డి. 1999లో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టిన ఈ ఆల్ టైం హిట్ ని మరోసారి తీసుకొస్తున్నారు. గతంలో ఒకసారి చేసినప్పటికీ సరైన ప్లానింగ్ లేక ఆడియన్స్ కి చేరలేదు.
చివరిది నరసింహనాయుడు. ఇది కూడా ఆషామాషీ హిట్టు బొమ్మ కాదు. బాలయ్యలో ఊర మాస్ సీమ హీరోయిజంని బయటికి తెచ్చిన రెండు సినిమాలు ఈ సందర్భంగా రావడం విశేషం. ఇన్నేసి గిఫ్టులు ఉన్నాయంటే ఫ్యాన్స్ ఆనందం మాములుగా ఉంటుందా. ఇదంతా బాగానే ఉంది కానీ పనిలో పని ఆదిత్య 999 మ్యాక్స్ మొదలుపెట్టాలని మూవీ లవర్స్ డిమాండ్ చేస్తున్నారు. క్రిష్ కు ఆ బాధ్యతలు ఇస్తారనే ప్రచారం జరిగింది కానీ ఇంకా ఫైనల్ అయితే కాలేదట.
This post was last modified on June 7, 2026 10:15 pm
సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…
తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…
సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…
వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…
భారతదేశంలోనే వివాహం చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1…
వేణుంబాక విజయసాయిరెడ్డి… వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ అధినేత జగన్ కు నమ్మినబంటు. పార్టీలో జగన్ తర్వాత నంబర్…