ఇంకో మూడు రోజుల్లో జూన్ 10 బాలకృష్ణ పుట్టినరోజు రానుంది. ఈసారి గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకునేందుకు అభిమానులు రెడీ అవుతున్నారు. ఈసారి వాళ్లకు ప్రత్యేక కానుకలు సిద్ధమవుతున్నాయి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్బికె 111 టైటిల్ రివీల్ తో పాటు ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయబోతున్నారు. వీరసింహారెడ్డి కాంబినేషన్ కావడంతో అంచనాలు విపరీతంగా ఉన్నాయి. చాలా గ్యాప్ తర్వాత బాలయ్య ఫుల్ లెన్త్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తారని టాక్.
కొరటాల శివ దర్శకత్వంలో రూపొందబోయే యాక్షన్ ఎంటర్ టైనర్ తాలూకు అప్డేట్ కూడా అదే రోజు ఇవ్వబోతున్నారని సమాచారం. సంగీత దర్శకుడు ఎవరనేది రివీల్ చేస్తారని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇవి కాకుండా మరో సర్ప్రైజ్ కాంబో అనౌన్స్ మెంట్ ఉంటుందని అంటున్నారు కానీ అదేంటో కన్ఫర్మ్ అయితే చెప్పలేం. వీటినలా ఉంచితే బాలయ్య మూడు బ్లాక్ బస్టర్లను ఒకే రోజు రీ రిలీజ్ చేయడం అభిమానులను అయోమయంలో పడేస్తోంది.
వాటిలో మొదటిది భైరవ ద్వీపం. 1994లో వచ్చిన ఈ జానపద ఫాంటసీ అప్పట్లో సంచలన విజయం నమోదు చేసింది. జూన్ 11 విడుదల కాబోతున్న సింగ్ గీతం దర్శకులు సింగీతం శ్రీనివాసరావుగారే ఆ ఎపిక్ మూవీకి డైరెక్టర్ కావడం గమనించాల్సిన విషయం. మరొకటి సమరసింహారెడ్డి. 1999లో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టిన ఈ ఆల్ టైం హిట్ ని మరోసారి తీసుకొస్తున్నారు. గతంలో ఒకసారి చేసినప్పటికీ సరైన ప్లానింగ్ లేక ఆడియన్స్ కి చేరలేదు.
చివరిది నరసింహనాయుడు. ఇది కూడా ఆషామాషీ హిట్టు బొమ్మ కాదు. బాలయ్యలో ఊర మాస్ సీమ హీరోయిజంని బయటికి తెచ్చిన రెండు సినిమాలు ఈ సందర్భంగా రావడం విశేషం. ఇన్నేసి గిఫ్టులు ఉన్నాయంటే ఫ్యాన్స్ ఆనందం మాములుగా ఉంటుందా. ఇదంతా బాగానే ఉంది కానీ పనిలో పని ఆదిత్య 999 మ్యాక్స్ మొదలుపెట్టాలని మూవీ లవర్స్ డిమాండ్ చేస్తున్నారు. క్రిష్ కు ఆ బాధ్యతలు ఇస్తారనే ప్రచారం జరిగింది కానీ ఇంకా ఫైనల్ అయితే కాలేదట.
పెద్ది వీకెండ్ ఘనంగా పూర్తి చేసుకుంది. టాక్స్, రివ్యూస్, కాంట్రావర్సీ సంగతి ఎలా ఉన్నా జనం థియేటర్లకు పోటెత్తిన మాట…
అందరూ సవాళ్లు రువ్వుతున్నారు.. తాను మాత్రం తక్కువ తిన్నానా.. అని అనుకున్నారో ఏమో.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్రావు.. ఆసక్తికర…
బాహుబలి సినిమాను అప్పట్లో టాలీవుడ్ను మించి బాలీవుడ్యే ఎక్కువగా మోసింది. అందుక్కారణం అగ్ర నిర్మాత కరణ్ జోహార్ ఆ చిత్రాన్ని…
టాలీవుడ్లో కొన్నేళ్లుగా సినిమాల మేకింగ్ బాగా ఆలస్యం అవుతోంది. ఒకసారి రిలీజ్ డేట్ అనౌన్స్ చేయక, దాన్ని మార్చకుండా చెప్పిన…
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని క్షేత్రస్థాయి నుంచి పునర్నిర్మించాలని భావిస్తున్న…
టాలీవుడ్ అగ్ర నిర్మాత సి అశ్వినీదత్ ఇవాళ ఎమోషనల్ అయ్యారు. సింగ్ గీతం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ…