లోక నాయకుడు కమల్ హాసన్ చాలా సందర్భాల్లో ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. భవిషత్తుని కూడా చక్కగా అంచనా వేస్తారు. విశ్వరూపం సినిమా వివాదంలో చిక్కుకుని థియేటర్ రిలీజ్ కాక ప్రభుత్వం అడ్డుపడినప్పుడు డిటిహెచ్ ద్వారా నేరుగా ఇంటికే వచ్చేలా చేస్తానని చెప్పడం అప్పట్లో దుమారం రేపింది. డిస్ట్రిబ్యూటర్లు దుమ్మెత్తి పోశారు. కట్ చేస్తే కరోనా నుంచి ఇప్పటిదాకా ఎన్ని సినిమాలు డైరెక్ట్ ఓటిటి రిలీజ్ జరుపుకున్నాయో లెక్క చెప్పడం కష్టం. అలాంటి విజన్ కమల్ స్వంతం.
ఇవాళ సింగ్ గీతం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. కమల్ హాసన్ అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పుడు సినిమాలు తీయడం కేవలం బిజినెస్ గా మారిపోయిందని, ప్యాషన్ పక్కనపెట్టేసి వంద, రెండు వందల కోట్లు, మూడు వందల కోట్లు అని లెక్కేలేసుకుంటూ తీసే దర్శక నిర్మాతలు పెరిగిపోయారని చురక వేశారు. పుష్పక విమానం కేవలం పదిహేను లక్షలతో తీస్తే ఇప్పటి లెక్కల్లో అది రెండు వందల కోట్లతో సమానమయ్యే కంటెంట్ గా నిలిచిందని గుర్తు చేశారు.
ఆయన అన్నది అక్షరాలా నిజం. ఎలివేషన్ల మత్తులో, ప్యాన్ ఇండియా ఉచ్చులో పడిపోయి బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా అందరూ ఇదే బాట పట్టారు. పాతిక కోట్ల మార్కెట్ లేని హీరో కూడా నాకు వరల్డ్ బిల్డింగ్ కథ కావాలని డిమాండ్ చేస్తున్నాడు. దర్శకులు సైతం పోటీ పడి మరీ అలాంటివే రాస్తున్నారు. దాంతో తక్కువ బడ్జెట్ లో క్వాలిటీ కంటెంట్లు స్టార్ హీరోల నుంచి రావడం లేదు. ఇదే కమల్ స్వాతిముత్యంకు అయిన ఖర్చు ఎంత. వచ్చిన ఆదాయంతో కేవలం పది శాతం ఉంటుంది.
కమల్ చెప్పినంత మాత్రాన ఇప్పటికిప్పుడు ఏదో మార్పులు వచ్చేస్తాయని కాదు కానీ ఆలోచించడం అయితే అవసరమే. సింగ్ గీతం జూన్ 11 విడుదల కానుంది. తనకు పుష్పక విమానం, విచిత్ర సోదరులు, మైఖేల్ మదన కామరాజు లాంటి ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ ఇచ్చిన సింగీతం శ్రీనివాసరావు గారి మీద అభిమానంతో కమల్ ఈ వేడుకకు హాజరయ్యారు . 94 వయసులోనూ సింగీతం గారు చలాకీగా కనిపించడమే కాదు ఎందరికో స్ఫూర్తినిచ్చేలా సింగ్ గీతం తీశారు.
This post was last modified on June 7, 2026 1:51 pm
సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…
తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…
సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…
వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…
భారతదేశంలోనే వివాహం చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1…
వేణుంబాక విజయసాయిరెడ్డి… వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ అధినేత జగన్ కు నమ్మినబంటు. పార్టీలో జగన్ తర్వాత నంబర్…