లోక నాయకుడు కమల్ హాసన్ చాలా సందర్భాల్లో ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. భవిషత్తుని కూడా చక్కగా అంచనా వేస్తారు. విశ్వరూపం సినిమా వివాదంలో చిక్కుకుని థియేటర్ రిలీజ్ కాక ప్రభుత్వం అడ్డుపడినప్పుడు డిటిహెచ్ ద్వారా నేరుగా ఇంటికే వచ్చేలా చేస్తానని చెప్పడం అప్పట్లో దుమారం రేపింది. డిస్ట్రిబ్యూటర్లు దుమ్మెత్తి పోశారు. కట్ చేస్తే కరోనా నుంచి ఇప్పటిదాకా ఎన్ని సినిమాలు డైరెక్ట్ ఓటిటి రిలీజ్ జరుపుకున్నాయో లెక్క చెప్పడం కష్టం. అలాంటి విజన్ కమల్ స్వంతం.
ఇవాళ సింగ్ గీతం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. కమల్ హాసన్ అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పుడు సినిమాలు తీయడం కేవలం బిజినెస్ గా మారిపోయిందని, ప్యాషన్ పక్కనపెట్టేసి వంద, రెండు వందల కోట్లు, మూడు వందల కోట్లు అని లెక్కేలేసుకుంటూ తీసే దర్శక నిర్మాతలు పెరిగిపోయారని చురక వేశారు. పుష్పక విమానం కేవలం పదిహేను లక్షలతో తీస్తే ఇప్పటి లెక్కల్లో అది రెండు వందల కోట్లతో సమానమయ్యే కంటెంట్ గా నిలిచిందని గుర్తు చేశారు.
ఆయన అన్నది అక్షరాలా నిజం. ఎలివేషన్ల మత్తులో, ప్యాన్ ఇండియా ఉచ్చులో పడిపోయి బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా అందరూ ఇదే బాట పట్టారు. పాతిక కోట్ల మార్కెట్ లేని హీరో కూడా నాకు వరల్డ్ బిల్డింగ్ కథ కావాలని డిమాండ్ చేస్తున్నాడు. దర్శకులు సైతం పోటీ పడి మరీ అలాంటివే రాస్తున్నారు. దాంతో తక్కువ బడ్జెట్ లో క్వాలిటీ కంటెంట్లు స్టార్ హీరోల నుంచి రావడం లేదు. ఇదే కమల్ స్వాతిముత్యంకు అయిన ఖర్చు ఎంత. వచ్చిన ఆదాయంతో కేవలం పది శాతం ఉంటుంది.
కమల్ చెప్పినంత మాత్రాన ఇప్పటికిప్పుడు ఏదో మార్పులు వచ్చేస్తాయని కాదు కానీ ఆలోచించడం అయితే అవసరమే. సింగ్ గీతం జూన్ 11 విడుదల కానుంది. తనకు పుష్పక విమానం, విచిత్ర సోదరులు, మైఖేల్ మదన కామరాజు లాంటి ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ ఇచ్చిన సింగీతం శ్రీనివాసరావు గారి మీద అభిమానంతో కమల్ ఈ వేడుకకు హాజరయ్యారు . 94 వయసులోనూ సింగీతం గారు చలాకీగా కనిపించడమే కాదు ఎందరికో స్ఫూర్తినిచ్చేలా సింగ్ గీతం తీశారు.
హఠాత్తుగా ఇరుముడి విడుదల తేదీ ప్రకటించేశారు. ఆగస్ట్ 21 థియేటర్లలో అడుగు పెట్టబోతున్నట్టు మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్ గా…
సోషల్ మీడియా టాక్స్, యూట్యూబ్ రివ్యూల హడావిడి ఎలా ఉన్నా పెద్ది బలంగా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న వైనం స్పష్టం.…
ఉమ్మడి కృష్ణాజిల్లాలోని కీలకమైన నియోజకవర్గం గుడివాడ రాజకీయాలు వేడెక్కాయి. గత రెండేళ్ల పాల నలో తాను చేసిన అభివృద్ధిని చూపించేందుకు..…
ఏపీ రాజధాని అమరావతికి అంత భూమి ఎందుకు? ఇంత భూమి ఎందుకు? ఏం చేసుకుంటారు.? 500 ఎకరాలు చాలవా? వెయ్యి…
ఫాం హౌస్లో కేడీ- ఢిల్లీలో మోడీ.. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా.. తెలంగాణలో అభివృద్ధిని ఆపలేరు అని సీఎం రేవంత్…
ఈ నెల 25 నుంచి టీడీపీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇంటింటికీ.. పేరుతో ఓ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు…