లోక నాయకుడు కమల్ హాసన్ చాలా సందర్భాల్లో ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. భవిషత్తుని కూడా చక్కగా అంచనా వేస్తారు. విశ్వరూపం సినిమా వివాదంలో చిక్కుకుని థియేటర్ రిలీజ్ కాక ప్రభుత్వం అడ్డుపడినప్పుడు డిటిహెచ్ ద్వారా నేరుగా ఇంటికే వచ్చేలా చేస్తానని చెప్పడం అప్పట్లో దుమారం రేపింది. డిస్ట్రిబ్యూటర్లు దుమ్మెత్తి పోశారు. కట్ చేస్తే కరోనా నుంచి ఇప్పటిదాకా ఎన్ని సినిమాలు డైరెక్ట్ ఓటిటి రిలీజ్ జరుపుకున్నాయో లెక్క చెప్పడం కష్టం. అలాంటి విజన్ కమల్ స్వంతం.
ఇవాళ సింగ్ గీతం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. కమల్ హాసన్ అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పుడు సినిమాలు తీయడం కేవలం బిజినెస్ గా మారిపోయిందని, ప్యాషన్ పక్కనపెట్టేసి వంద, రెండు వందల కోట్లు, మూడు వందల కోట్లు అని లెక్కేలేసుకుంటూ తీసే దర్శక నిర్మాతలు పెరిగిపోయారని చురక వేశారు. పుష్పక విమానం కేవలం పదిహేను లక్షలతో తీస్తే ఇప్పటి లెక్కల్లో అది రెండు వందల కోట్లతో సమానమయ్యే కంటెంట్ గా నిలిచిందని గుర్తు చేశారు.
ఆయన అన్నది అక్షరాలా నిజం. ఎలివేషన్ల మత్తులో, ప్యాన్ ఇండియా ఉచ్చులో పడిపోయి బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా అందరూ ఇదే బాట పట్టారు. పాతిక కోట్ల మార్కెట్ లేని హీరో కూడా నాకు వరల్డ్ బిల్డింగ్ కథ కావాలని డిమాండ్ చేస్తున్నాడు. దర్శకులు సైతం పోటీ పడి మరీ అలాంటివే రాస్తున్నారు. దాంతో తక్కువ బడ్జెట్ లో క్వాలిటీ కంటెంట్లు స్టార్ హీరోల నుంచి రావడం లేదు. ఇదే కమల్ స్వాతిముత్యంకు అయిన ఖర్చు ఎంత. వచ్చిన ఆదాయంతో కేవలం పది శాతం ఉంటుంది.
కమల్ చెప్పినంత మాత్రాన ఇప్పటికిప్పుడు ఏదో మార్పులు వచ్చేస్తాయని కాదు కానీ ఆలోచించడం అయితే అవసరమే. సింగ్ గీతం జూన్ 11 విడుదల కానుంది. తనకు పుష్పక విమానం, విచిత్ర సోదరులు, మైఖేల్ మదన కామరాజు లాంటి ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ ఇచ్చిన సింగీతం శ్రీనివాసరావు గారి మీద అభిమానంతో కమల్ ఈ వేడుకకు హాజరయ్యారు . 94 వయసులోనూ సింగీతం గారు చలాకీగా కనిపించడమే కాదు ఎందరికో స్ఫూర్తినిచ్చేలా సింగ్ గీతం తీశారు.
This post was last modified on June 7, 2026 1:51 pm
జగన్ ఇటీవల కాలంలో సహనం కోల్పోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన పార్టీ వారిపై కేసులు పెట్టినా.. తమ…
అంజి ఇప్పుడు గుర్తు రావడం ఏమిటనుకుంటున్నారా.. విషయం ఉంది. కొన్ని వింటే సిల్లీగా తోస్తాయి కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే…
బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…
ఒక గంట నిలబడేందుకే ఇబ్బంది పడతాం. అలాంటిది ఏకంగా ఏడున్నరగంటల పాటు ఏకబిగిన నిలబడడం అంటే మాటలా? ఊహించేందుకే కష్టమైన…
కనకవర్షం కురిపించుకోవడమంటే బాక్సాఫీస్ దగ్గర అదో పెద్ద యుద్ధం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఏది ఎలా ఎప్పుడు ఆడుతుందో ఎవరూ…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్మను…ఆ…ని..చూసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి…