తమిళ విలక్షణ దర్శకుడు సెల్వ రాఘవన్ తీసింది తక్కువ సినిమాలే కానీ.. వాటిలో చాలా వరకు ఆణిముత్యాలే. అతడి సినిమాలు కొన్ని ప్రేక్షకులపై అలాంటిలాంటి ఇంపాక్ట్ చూపించ లేదు. అలా బలంగా ప్రభావం చూపించిన సినిమాల్లో ‘ఆయిరత్తిల్ ఒరువన్’ (యుగానికి ఒక్కడు) ఒకటి. కార్తి హీరోగా నటించిన ఈ చిత్రం అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. పెద్దగా అంచనాల్లేకుండా థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులు స్టన్ అయిపోయేలా ఈ సినిమా సాగింది. కొంత మిశ్రమ అనుభూతి కలిగించినప్పటికీ.. ఆ సినిమా కథాంశం, కొన్ని ఎపిసోడ్లు ఎంతో థ్రిల్లింగ్గా అనిపిస్తాయి. ఈ చిత్రానికి సీక్వెల్ తీస్తానని సెల్వ ఎప్పట్నుంచో చెబుతున్నాడు. కానీ అది కార్యరూపం దాల్చట్లేదు. ఐతే ఎట్టకేలకు ఈ ప్రాజెక్టు గురించి ఇప్పుడు ప్రకటన వచ్చింది. ప్రస్తుతం ‘ఆయిరత్తిల్ ఒరువన్-2’ సన్నాహాల్లో ఉన్న సెల్వ రాఘవన్.. 2024లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు ప్రకటించాడు.
ఆసక్తికర విషయం ఏంటంటే.. సీక్వెల్లో నటించిన కార్తి ఇందులో కథానాయుడిగా నటించట్లేదు. అతడి స్థానంలోకి సెల్వ రాఘవన్ తమ్ముడే అయిన స్టార్ హీరో ధనుష్ వచ్చాడు. ఇంతకుముందు సెల్వ, ధనుష్ కలిసి చేసిన తుల్లువదో ఎలమై, కాదల్ కొండేన్, పుదు పేట్టై, మయక్కం ఎన్నా క్లాసిక్స్గా నిలిచిపోయాయి. వీళ్ల కలయికలో కొత్త సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొన్నేళ్లుగా చర్చల్లో ఉన్న ఈ కాంబినేషన్ ఎట్టకేలకు ఓకే అయింది. ‘యుగానికి ఒక్కడు’ సీక్వెల్ అనగానే కార్తి కాకుండా మరొకరిని ఊహించుకోలేం. కానీ ధనుష్ ఎలాంటి పెర్ఫామరో తెలిసిందే కాబట్టి అతను హీరోగా అయినా ఈ సీక్వెల్ ఎగ్జైట్ చేస్తుందనడంలో సందేహం లేదు. ఐతే ఈ సినిమా పట్టాలెక్కడానికి ఇంకొంత సమయం పట్టేలా ఉంది. అయినా సరే.. ఏకంగా 2024లో విడుదల అనడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీన్ని బట్టి ఈ చిత్రాన్ని ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీతో ఓ ‘బాహుబలి’లా తీర్చిదిద్దడానికి సన్నాహాలు చేస్తున్నారేమో.
This post was last modified on January 2, 2021 8:31 pm
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ కీలక కేసు విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వ్యక్తి చనిపోయిన తర్వాత.. కేసును…
టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…