తమిళ విలక్షణ దర్శకుడు సెల్వ రాఘవన్ తీసింది తక్కువ సినిమాలే కానీ.. వాటిలో చాలా వరకు ఆణిముత్యాలే. అతడి సినిమాలు కొన్ని ప్రేక్షకులపై అలాంటిలాంటి ఇంపాక్ట్ చూపించ లేదు. అలా బలంగా ప్రభావం చూపించిన సినిమాల్లో ‘ఆయిరత్తిల్ ఒరువన్’ (యుగానికి ఒక్కడు) ఒకటి. కార్తి హీరోగా నటించిన ఈ చిత్రం అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. పెద్దగా అంచనాల్లేకుండా థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులు స్టన్ అయిపోయేలా ఈ సినిమా సాగింది. కొంత మిశ్రమ అనుభూతి కలిగించినప్పటికీ.. ఆ సినిమా కథాంశం, కొన్ని ఎపిసోడ్లు ఎంతో థ్రిల్లింగ్గా అనిపిస్తాయి. ఈ చిత్రానికి సీక్వెల్ తీస్తానని సెల్వ ఎప్పట్నుంచో చెబుతున్నాడు. కానీ అది కార్యరూపం దాల్చట్లేదు. ఐతే ఎట్టకేలకు ఈ ప్రాజెక్టు గురించి ఇప్పుడు ప్రకటన వచ్చింది. ప్రస్తుతం ‘ఆయిరత్తిల్ ఒరువన్-2’ సన్నాహాల్లో ఉన్న సెల్వ రాఘవన్.. 2024లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు ప్రకటించాడు.
ఆసక్తికర విషయం ఏంటంటే.. సీక్వెల్లో నటించిన కార్తి ఇందులో కథానాయుడిగా నటించట్లేదు. అతడి స్థానంలోకి సెల్వ రాఘవన్ తమ్ముడే అయిన స్టార్ హీరో ధనుష్ వచ్చాడు. ఇంతకుముందు సెల్వ, ధనుష్ కలిసి చేసిన తుల్లువదో ఎలమై, కాదల్ కొండేన్, పుదు పేట్టై, మయక్కం ఎన్నా క్లాసిక్స్గా నిలిచిపోయాయి. వీళ్ల కలయికలో కొత్త సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొన్నేళ్లుగా చర్చల్లో ఉన్న ఈ కాంబినేషన్ ఎట్టకేలకు ఓకే అయింది. ‘యుగానికి ఒక్కడు’ సీక్వెల్ అనగానే కార్తి కాకుండా మరొకరిని ఊహించుకోలేం. కానీ ధనుష్ ఎలాంటి పెర్ఫామరో తెలిసిందే కాబట్టి అతను హీరోగా అయినా ఈ సీక్వెల్ ఎగ్జైట్ చేస్తుందనడంలో సందేహం లేదు. ఐతే ఈ సినిమా పట్టాలెక్కడానికి ఇంకొంత సమయం పట్టేలా ఉంది. అయినా సరే.. ఏకంగా 2024లో విడుదల అనడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీన్ని బట్టి ఈ చిత్రాన్ని ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీతో ఓ ‘బాహుబలి’లా తీర్చిదిద్దడానికి సన్నాహాలు చేస్తున్నారేమో.
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…