మొన్నటిదాకా టాప్ ప్రొడక్షన్ హౌస్ గా వెలిగిపోయిన యువి క్రియేషన్స్ ఇప్పుడు బయటికి చెప్పుకోలేని ఇబ్బందులతో సతమతమవుతోందట. చిన్న బడ్జెట్ తో తీసిన ‘కపుల్ ఫ్రెండ్లీ’కు ప్రశంసలు కాసిన్ని డబ్బులు వచ్చాయి కానీ మరీ బ్లాక్ బస్టర్ అంత రేంజ్ కాలేకపోయింది. గత ఏడాది అనుష్క ‘ఘాటీ’ డిజాస్టర్ కావడం పెద్ద దెబ్బ. శర్వానంద్ ‘బైకర్’కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ అది బాక్సాఫీస్ వద్ద క్యాష్ కాలేకపోయింది. పేరు గొప్పనే సంతృప్తి మాత్రమే మిగిలింది.
ఇదిలా ఉండగా యువి నుంచి ఇప్పుడు రెండు సినిమాలు రెడీగా ఉన్నాయి. మొదటిది విశ్వంభర. నాన్నా పులి కథలో చెప్పినట్టు విఎఫ్ఎక్స్ గురించే వాయిదాలు వేస్తున్నామని చెబుతున్నారు కానీ ఎప్పటికి అవుతుందో, ఎప్పుడు రిలీజ్ చేస్తారో క్లారిటీ ఇవ్వడం లేదు. ఓటిటి డీల్ ఆశించిన స్థాయిలో జరగకపోవడం వల్లే లేట్ అయ్యిందని ఇన్ సైడ్ టాక్ ఉండగా మన శంకరవరప్రసాద్ గారు సక్సెస్ ని వాడుకునే ఛాన్స్ ఇలా వృథాగా పోవడం మెగా ఫ్యాన్స్ ని బాధిస్తోంది.
మరొకటి కొరియన్ కనకరాజు. ఆల్రెడీ ఒక టీజర్, పాట వచ్చేశాయి. తర్వాత అంతా సైలెంట్. దీనికీ డిజిటల్ చిక్కుముడి థియేటర్ విడుదలకు అడ్డం పడిందని సమాచారం. గత డిజాస్టర్ల ప్రభావం వరుణ్ తేజ్ మార్కెట్ మీద బాగా ప్రభావం చూపిస్తోంది. మట్కా, ఆపరేషన్ వాలెంటైన్, గని కనీస స్థాయిలో పెర్ఫార్మ్ చేయకపోవడం ఈ పరిస్థితికి కారణం. దర్శకుడు మేర్లపాక గాంధీ ట్రెండింగ్ లో లేని డైరెక్టర్ కావడం బిజినెస్ పరంగా మరో అడ్డంకి,.
ఇవి బయటికి వచ్చి హిట్ అయితే యువికి పెద్ద స్వాంతన చేకూరుతుంది. ప్రభాస్ అండదండలు ఉన్నప్పటికీ అవి అందిపుచ్చుకోవడంలో దురదృష్టం వెంటాడుతోంది. సాహో, రాధే శ్యామ్ ని అంత పెద్ద బడ్జెట్ తో నిర్మిస్తే రిజల్ట్స్ నిరాశ పరిచాయి. సో ఇప్పుడు ఆదుకునే సినిమా ఒకటి పడాలి. వీటి వల్లే అఖిల్ తో ప్లాన్ చేసుకున్న ప్యాన్ ఇండియా మూవీని పక్కన పెట్టిన యూవీకి కోరుకున్న బ్రేక్ ఏ మెగా హీరో ఎప్పుడు ఇస్తారో రిలీజయ్యే వరకు వెయిట్ చేయాలి.
టాలీవుడ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా మొత్తానికి ముహూర్త వేడుకను ముగించింది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్…
టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు…
పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…