మొన్నటిదాకా టాప్ ప్రొడక్షన్ హౌస్ గా వెలిగిపోయిన యువి క్రియేషన్స్ ఇప్పుడు బయటికి చెప్పుకోలేని ఇబ్బందులతో సతమతమవుతోందట. చిన్న బడ్జెట్ తో తీసిన ‘కపుల్ ఫ్రెండ్లీ’కు ప్రశంసలు కాసిన్ని డబ్బులు వచ్చాయి కానీ మరీ బ్లాక్ బస్టర్ అంత రేంజ్ కాలేకపోయింది. గత ఏడాది అనుష్క ‘ఘాటీ’ డిజాస్టర్ కావడం పెద్ద దెబ్బ. శర్వానంద్ ‘బైకర్’కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ అది బాక్సాఫీస్ వద్ద క్యాష్ కాలేకపోయింది. పేరు గొప్పనే సంతృప్తి మాత్రమే మిగిలింది.
ఇదిలా ఉండగా యువి నుంచి ఇప్పుడు రెండు సినిమాలు రెడీగా ఉన్నాయి. మొదటిది విశ్వంభర. నాన్నా పులి కథలో చెప్పినట్టు విఎఫ్ఎక్స్ గురించే వాయిదాలు వేస్తున్నామని చెబుతున్నారు కానీ ఎప్పటికి అవుతుందో, ఎప్పుడు రిలీజ్ చేస్తారో క్లారిటీ ఇవ్వడం లేదు. ఓటిటి డీల్ ఆశించిన స్థాయిలో జరగకపోవడం వల్లే లేట్ అయ్యిందని ఇన్ సైడ్ టాక్ ఉండగా మన శంకరవరప్రసాద్ గారు సక్సెస్ ని వాడుకునే ఛాన్స్ ఇలా వృథాగా పోవడం మెగా ఫ్యాన్స్ ని బాధిస్తోంది.
మరొకటి కొరియన్ కనకరాజు. ఆల్రెడీ ఒక టీజర్, పాట వచ్చేశాయి. తర్వాత అంతా సైలెంట్. దీనికీ డిజిటల్ చిక్కుముడి థియేటర్ విడుదలకు అడ్డం పడిందని సమాచారం. గత డిజాస్టర్ల ప్రభావం వరుణ్ తేజ్ మార్కెట్ మీద బాగా ప్రభావం చూపిస్తోంది. మట్కా, ఆపరేషన్ వాలెంటైన్, గని కనీస స్థాయిలో పెర్ఫార్మ్ చేయకపోవడం ఈ పరిస్థితికి కారణం. దర్శకుడు మేర్లపాక గాంధీ ట్రెండింగ్ లో లేని డైరెక్టర్ కావడం బిజినెస్ పరంగా మరో అడ్డంకి,.
ఇవి బయటికి వచ్చి హిట్ అయితే యువికి పెద్ద స్వాంతన చేకూరుతుంది. ప్రభాస్ అండదండలు ఉన్నప్పటికీ అవి అందిపుచ్చుకోవడంలో దురదృష్టం వెంటాడుతోంది. సాహో, రాధే శ్యామ్ ని అంత పెద్ద బడ్జెట్ తో నిర్మిస్తే రిజల్ట్స్ నిరాశ పరిచాయి. సో ఇప్పుడు ఆదుకునే సినిమా ఒకటి పడాలి. వీటి వల్లే అఖిల్ తో ప్లాన్ చేసుకున్న ప్యాన్ ఇండియా మూవీని పక్కన పెట్టిన యూవీకి కోరుకున్న బ్రేక్ ఏ మెగా హీరో ఎప్పుడు ఇస్తారో రిలీజయ్యే వరకు వెయిట్ చేయాలి.
This post was last modified on May 31, 2026 11:58 pm
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
బారత ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ... వరుసబెట్టి మూడు పర్యాయాలు దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా దేశానికి అత్యధిక…
కొత్త నెల వచ్చేసింది. సంక్రాంతి అయిపోయాక ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా జనాలు రాక థియేటర్లు అలో లక్ష్మణా అంటున్న…
జంతర్ మంతర్ ఆందోళనలో విద్యార్థులు తనను దుషించారని ప్రధాని మోదీ శుక్రవారం రాత్రి విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో…