మాములుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ల సమయంలో నిర్వాహకులు హీరోలతో పాటు దర్శక నిర్మాతల కటవుట్లు పెట్టడం కొత్త కాదు. అందరూ చేసేదే. అయితే అభిమానులు స్వంతంగా తయారు చేయించేవి మాత్రం కేవలం హీరోకు మాత్రమే పరిమితమవుతాయి. అలాంటిది బుచ్చిబాబు మీద ఫ్యాన్స్ ఏ స్థాయిలో నమ్మకం పెట్టుకున్నారంటే కుస్తీ పైల్వాన్ గెటప్ కి ప్రత్యేకంగా తన తలను అతికించి వేదిక దగ్గర హల్చల్ చేసేస్తున్నారు. ఈ మినీ కటవుట్ బాగా వైరల్ అవుతోంది.
ఇలా ఎందుకు చేశారంటే కేవలం బుచ్చిబాబు మీద ఉన్న నమ్మకంతోనే. రామ్ చరణ్ పెద్ది కోసం చాలా అంటే చాలా కష్టపడ్డాడు. శరీరాన్ని గాయపరిచి చేతులు కాళ్ళు విరగ్గొట్టుకున్నాడు. రిలీజ్ కోసం సర్జరీ వాయిదా వేసుకున్నాడు. రెండేళ్లు ఈ ప్రాజెక్టు మీదే ఉన్నాడు. చాలా రిస్కులు తీసుకున్నాడు. డూపులు వద్దని ఫైట్లు చేయడమే కాదు ప్రమాదకరమైన లొకేషన్లలో పాటల చిత్రీకరణలో పాల్గొన్నాడు. ఇదంతా అప్డేట్స్ రూపంలో ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ చూస్తూనే వచ్చారు.
బుచ్చిబాబు వినయం, గ్రౌండెడ్ గా అనిపించే ప్రవర్తన జనాలకు బాగా రీచ్ అయిపోయింది. ఫిల్టర్స్ లేకుండా, అతిశయోక్తి అనిపించకుండా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడ్డం చాలా మందిని ఆకట్టుకుంది. అందులోనూ చరణ్ మీద చూపించిన విపరీతమైన ప్రేమ మెగాభిమానులను టచ్ చేసింది. అందుకే పెద్ది విషయంలో అంత ధీమాగా ఉన్నారు. విజయవాడ ఈవెంట్ లో బుచ్చిబాబు ఏం ఎమాట్లాడతాడనే ఎగ్జైట్ మెంట్ వాళ్ళలో ఎక్కువగా ఉంది.
ఇప్పుడీ సినిమా కనక బ్లాక్ బస్టర్ చేసి చూపిస్తే బుచ్చిబాబు నేరుగా టాప్ లీగ్ లోకి వెళ్ళిపోతాడు. ఎవరితో చేయాలనుకున్నా డేట్లు దొరుకుతాయి. పైగా తన కోసం స్టార్లు ఎదురు చూసే పరిస్థితి రావొచ్చు. ఉప్పెన తర్వాత ఇంత గ్యాప్ వచ్చినప్పటికి బుచ్చిబాబు ఓపికగా ఉన్నది పెద్దితో పెద్ద విజయం అందుకుని గురువు సుకుమార్ స్థాయిలో ముద్ర వేయాలనే. మరి ఈ కసి, తపన ఎంత మేరకు ఫలితం ఇస్తాయో తెలియాలంటే జస్ట్ నాలుగు రోజులు ఆగితే చాలు.
అనుకున్నట్లే ఐపీఎల్ 2026 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మళ్ళీ కొట్టేసింది. ఆ జట్టుకు పోటీగా ఈ సీజన్…
మొన్నటిదాకా టాప్ ప్రొడక్షన్ హౌస్ గా వెలిగిపోయిన యువి క్రియేషన్స్ ఇప్పుడు బయటికి చెప్పుకోలేని ఇబ్బందులతో సతమతమవుతోందట. చిన్న బడ్జెట్…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ అధికారంలో ఉన్నప్పుడు.. రాష్ట్రంలో జరిగిన అనేక అక్రమాలపై ప్రస్తుత ప్రభుత్వం విచారణ చేస్తున్న…
వేసవిలో కీలకమైన నెలగా చెప్పుకునే మే అయిపోయింది. స్కూళ్ళు, కాలేజీలకు సెలవులు ఉండే ఈ ముఖ్యమైన సీజన్ టాలీవుడ్ వృథా…
ఉద్యోగ వ్యవస్థకు సంబంధించి పంజాబ్ లోని ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజా పాలనలో ఇకపై…
ఏపీలోని నంద్యాల జిల్లా కేంద్రం నంద్యాలలో సెలవు దినం ఆదివారం రాజకీయ రచ్చ చోటుచేసుకుంది. పట్టణంలోని శ్రీనివాస సెంటర్ లో…