జనవరిలో జన నాయగన్ కు సెన్సార్ అడ్డంకులు తలెత్తినప్పుడు విజయ్ కేవలం ఒక స్టార్ హీరో. రాజకీయంగా ఇంకా తొలి అడుగుల్లోనే ఉన్నాడు. అందుకే ఏమి చేయలేని పరిస్థితి. అయిదు నెలల తర్వాత సీన్ మారిపోయింది. విజయ్ ముఖ్యమంత్రి అయ్యాడు. మొదటి విడతలోనే పదవి చేపట్టిన అరుదైన ఘనత అందుకున్నాడు. సింగల్ గా పోటీ చేసి ఎవరితో ముందస్తు పొత్తు లేకుండా విజయం సాధించడం చరిత్ర అంత సులభంగా మర్చిపోదు. ఇక్కడిదాకా బాగానే ఉంది.
జన నాయకుడుని గతంలో నియమించిన రివైజింగ్ కమిటీ చూసి రిపోర్ట్ ఇవ్వాలి. అది కోర్టు పరిశీలనకు వచ్చిన తర్వాత సెన్సార్ అధికారులు చర్యలు తీసుకుని సర్టిఫికెట్ ఇస్తారు. కానీ ఆ దిశగా ఎలాంటి మూమెంట్ లేకపోవడం విజయ్ అభిమానులను కలవరపెడుతోంది. ఎందుకంటే జూన్ 19 ఈ సినిమా రిలీజ్ అవుతుందనే ప్రచారం తమిళనాడు బయ్యర్ వర్గాల్లో బలంగా ఉంది. కానీ ఇప్పటిదాకా అప్డేట్ లేకపోవడం వాళ్ళను కలవరపెడుతోంది.
ఇటీవలే జరిగిన ఒక ఈవెంట్ లో దర్శకుడు హెచ్ వినోత్ మాట్లాడుతూ ఈ సినిమా వెనుక ఏం జరిగిందో చెప్పే ధైర్యం తనకు లేదని, ఒకవేళ చెప్పినా దాన్ని టెలికాస్ట్ చేసే ధైర్యం మీకు లేదని ఛానల్ ని ఉద్దేశించి చెప్పడం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. పవర్ లో ఉన్న హీరోని పెట్టుకుని కూడా అతను ఓపెన్ గా ఏదీ బయట పెట్టలేకపోవడం చూస్తే ఏదో పెద్ద రహస్యమే ఉందని సినీ రాజకీయ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.
ఇదో కొత్త చర్చకు దారి తీస్తోంది. వీలైనంత త్వరగా ఇష్యూస్ క్లియర్ చేయమని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. విజయ్ చివరి సినిమాగా దీన్ని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకోవడానికి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ యాక్షన్ డ్రామాలో మమిత బైజు మరో ముఖ్యపాత్రలో కనిపించనుంది. భగవంత్ కేసరి రీమేక్ గా రూపొందిన జన నాయగన్ కు అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చారు. జూన్ రిలీజ్ మిస్ అయితే ఇంకో నెల అదనంగా ఎదురు చూడాల్సి రావొచ్చు.
This post was last modified on May 31, 2026 2:05 pm
నాలుగు రోజులు సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన చెన్నై లవ్ స్టోరీ తాలూకు కబుర్లు, ట్వీట్లే కనిపించాయి. మొదటి రోజు…
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు.. పట్టుమని ఒక్కగంట కూడా ప్రశాంతంగా జరగడం లేదు. సభ ప్రారంభం కాగానే అధికార, ప్రతిపక్ష సభ్యుల…
ఇప్పటి వరకు పుణ్యం వస్తుందని గుండు చేయించుకున్న వాళ్ళను చూసాం కానీ ఇప్పుడు పుణ్యం 15 వేల రూపాయల గిఫ్ట్…
సెల్ఫ్ గోల్స్ వేసుకోవడంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మించిన వాళ్లు లేరని…
భాషతో సంబంధం లేకుండా ఇండియా వైడ్ క్రేజ్ ఉన్న ప్యాన్ ఇండియా సినిమాల్లో అల్లు అర్జున్ 'రాకా' టాప్ 3లో…
ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర రాజధాని పై తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతి శాశ్వతంగా ఉంటుందని పేర్కొన్నారు.…