జనవరిలో జన నాయగన్ కు సెన్సార్ అడ్డంకులు తలెత్తినప్పుడు విజయ్ కేవలం ఒక స్టార్ హీరో. రాజకీయంగా ఇంకా తొలి అడుగుల్లోనే ఉన్నాడు. అందుకే ఏమి చేయలేని పరిస్థితి. అయిదు నెలల తర్వాత సీన్ మారిపోయింది. విజయ్ ముఖ్యమంత్రి అయ్యాడు. మొదటి విడతలోనే పదవి చేపట్టిన అరుదైన ఘనత అందుకున్నాడు. సింగల్ గా పోటీ చేసి ఎవరితో ముందస్తు పొత్తు లేకుండా విజయం సాధించడం చరిత్ర అంత సులభంగా మర్చిపోదు. ఇక్కడిదాకా బాగానే ఉంది.
జన నాయకుడుని గతంలో నియమించిన రివైజింగ్ కమిటీ చూసి రిపోర్ట్ ఇవ్వాలి. అది కోర్టు పరిశీలనకు వచ్చిన తర్వాత సెన్సార్ అధికారులు చర్యలు తీసుకుని సర్టిఫికెట్ ఇస్తారు. కానీ ఆ దిశగా ఎలాంటి మూమెంట్ లేకపోవడం విజయ్ అభిమానులను కలవరపెడుతోంది. ఎందుకంటే జూన్ 19 ఈ సినిమా రిలీజ్ అవుతుందనే ప్రచారం తమిళనాడు బయ్యర్ వర్గాల్లో బలంగా ఉంది. కానీ ఇప్పటిదాకా అప్డేట్ లేకపోవడం వాళ్ళను కలవరపెడుతోంది.
ఇటీవలే జరిగిన ఒక ఈవెంట్ లో దర్శకుడు హెచ్ వినోత్ మాట్లాడుతూ ఈ సినిమా వెనుక ఏం జరిగిందో చెప్పే ధైర్యం తనకు లేదని, ఒకవేళ చెప్పినా దాన్ని టెలికాస్ట్ చేసే ధైర్యం మీకు లేదని ఛానల్ ని ఉద్దేశించి చెప్పడం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. పవర్ లో ఉన్న హీరోని పెట్టుకుని కూడా అతను ఓపెన్ గా ఏదీ బయట పెట్టలేకపోవడం చూస్తే ఏదో పెద్ద రహస్యమే ఉందని సినీ రాజకీయ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.
ఇదో కొత్త చర్చకు దారి తీస్తోంది. వీలైనంత త్వరగా ఇష్యూస్ క్లియర్ చేయమని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. విజయ్ చివరి సినిమాగా దీన్ని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకోవడానికి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ యాక్షన్ డ్రామాలో మమిత బైజు మరో ముఖ్యపాత్రలో కనిపించనుంది. భగవంత్ కేసరి రీమేక్ గా రూపొందిన జన నాయగన్ కు అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చారు. జూన్ రిలీజ్ మిస్ అయితే ఇంకో నెల అదనంగా ఎదురు చూడాల్సి రావొచ్చు.
ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. పశ్చిమబెంగాల్లో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం-కిసాన్ నిధులను…
ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో గొడ్డలి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం..…
ఏపీలో అంతకంతకూ పెరిగిపోతున్న కుల భావనపైనా, విపక్షాలు నిత్యం ఆరోపణలు గుప్పిస్తున్న శాంతి భద్రతల మీద జనసేన అధినేత, డిప్యూటీ…
వందల కోట్లతో తీసినా, తక్కువ బడ్జెట్ లో పూర్తి చేసినా ఏదైనా సినిమానే. వేసేది ప్రొజెక్టర్ వాడే తెరపైనే. చిన్నాపెద్దా…
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే రాశీ సింగ్ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫోటోలు భలే ఆకట్టుకుంటున్నాయి.…