Movie News

దాసరి స్మృతి వనం… కదిలిపోయిన మనోజ్

తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత గొప్ప దర్శకుల్లో ఒకరు దాసరి నారాయణరావు. అగ్ర దర్శకుడిగా ఉంటూ 150 సినిమాలు తీయడం అంటే చిన్న విషయం కాదు. అందులో మెజారిటీ సినిమాలు విజయవంతం అయ్యాయి. ప్రేమాభిషేకం సహా ఎన్నో ఇండస్ట్రీ హిట్లు ఆయన సొంతం.

ఐతే దాసరి గొప్పదనం కేవలం దర్శకత్వానికే పరిమితం కాదు. ఎన్నో ఏళ్ల పాటు ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉంటూ ఎందరో జీవితాల్లో వెలుగులు నింపిన, ఎన్నో సమస్యలు పరిష్కరించిన ఘనత ఆయన సొంతం. అందుకే ఇండస్ట్రీలో ఎంతోమంది ఇప్పటికీ దాసరిని దేవుడిలా చూస్తారు. అలాంటి వ్యక్తి స్మృతి వనం నిరాదరణకు గురి కావడం ఆయన అభిమానులను తీవ్రంగా కలచి వేసింది.

హైదరాబాద్‌లో దాసరి సమాధి ఉన్న ప్రాంతం చెట్లు పెరిగి, చుట్టూ చెత్త పేరుకుపోయి అధ్వాన్న స్థితికి చేరుకున్న వైనం గురించి మీడియాలో, సోషల్ మీడియాలో ఈ రోజు వీడియోలు వైరల్ అయ్యాయి.

ఈ విషయంలో వెలుగులోకి రాగానే మంచు మనోజ్ అప్రమత్తం అయ్యాడు. తన అనుచరులతో కలిసి దాసరి స్మృతి వనానికి హుటాహుటిన చేరుకున్నాడు. తన బృందంతో కలిసి ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయడం మొదలుపెట్టాడు మనోజ్. ఈ వీడియో కొన్ని గంటల్లోనే వైరల్ కావడంతో మరికొందరు సినీ జనాలు దాసరి స్మృతి వనం దగ్గరికి చేరుకున్నారు.

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, మనోజ్ సోదరుడు మంచు విష్ణు సైతం ఈ విషయం మీద స్పందించాడు. దాసరి స్మృతి వనాన్ని సినిమా వాళ్లు పట్టించుకోకుండా వదిలేశారంటూ సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టుల మీద విష్ణు స్పందిస్తూ.. దీనిపై తగు చర్యలు చేపడుతున్నామని, ఇక దీన్ని ఇంతకుమించి వివాదం చేయొద్దని కోరారు.

ఇటీవలే దాసరి జయంతి వేడుకలను ఘనంగా చేశారు. ఆయన జయంతిని డైరెక్టర్స్ డేగా సినీ పరిశ్రమ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. జయంతి వేడుకలను అంత ఘనంగా చేసి, ఆయన సమాధిని మాత్రం ఇలా వదిలేయడమే ఆశ్చర్యం కలిగిస్తోంది.

Kumar

Recent Posts

శ్రీలీలని టార్గెట్ చేయడం సబబేనా

లెనిన్ విడుదలై మంచి స్పందన దక్కించుకున్నాక సోషల్ మీడియాలో శ్రీలీల డిస్కషన్ జరుగుతోంది. ఎందుకంటే లెనిన్ షూటింగ్ మొదలుపెట్టినప్పుడు హీరోయిన్…

59 minutes ago

కొత్త ‘ఈవిల్ డెడ్’ అంత భయపెట్టిందా

హాలీవుడ్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా హారర్ జానర్ పరిచయం చేసిన కల్ట్ సిరీస్ గా 'ఈవిల్ డెడ్' సినిమాకున్న ఆదరణ…

2 hours ago

తండ్రి కొడుకులకు కలిసొచ్చిన పల్లెటూరు

కొన్ని కాకతాళీయంగా జరిగినట్టు అనిపించినా దాని వెనుక తెలుసుకోవాల్సిన బాక్సాఫీస్ సత్యాలు చాలా ఉంటాయి. అలాంటిదే ఇది. ఇండస్ట్రీకి వచ్చి…

3 hours ago

ఎన్టీఆర్ అభిమానులకు ఆందోళన అక్కర్లేదు

నిన్న ధనుష్ తమిళ్ మురుగన్ టీజర్ వచ్చాక మొదట ఆందోళన చెందింది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. ఎందుకంటే త్రివిక్రమ్ సినిమాలోనూ…

3 hours ago

పల్లి పల్లి మంత్రి లోకేష్

పల్లి పల్లి లోకేశ్... ఇదేం పేరండి బాబూ అని జుట్టు పీక్కుంటున్నారా? అంత అవసరం ఏమీ లేదు. ఇదేమీ రాజకీయ ప్రత్యర్థులో,…

3 hours ago

ఫోక్సో కేసు పెట్టారని ఆరుగురిని చంపి.. ఆపై ఏం చేశాడంటే..

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో ఆదివారం తెల్లవారుజామున దారుణ ఘటన చోటుచేసుకుంది. తనపై నమోదైన పోక్సో కేసుకు ప్రతీకారంగా…

4 hours ago