తమ సినిమాల ప్రమోషన్ కోసం తెలుగు రాష్ట్రాలకు వచ్చినపుడు.. తెలుగులో సినిమా చేయాలనుందని, త్వరలోనే చేస్తానని తమిళ హీరోలు చెప్పడం ఎన్నో ఏళ్ల నుంచి జరుగుతున్నదే. కానీ ఒకప్పుడు కమల్ హాసన్ తెలుగులో నిలకడగా సినిమాలు చేశాడు కానీ.. ఆయన తర్వాత కొత్త తరం హీరోలు తెలుగు వైపు చూడలేదు. కానీ చాాలా ఏళ్ల తర్వాత ఈ ట్రెండును పున:ప్రారంభించిన ఘనత యువ కథానాయకుడు కార్తిదే.
‘ఆవారా’, ‘నా పేరు శివ’ లాంటి చిత్రాలతో తెలుగులో మంచి ఫాలోయింగ్ సంపాదించిన అతను.. తన కంటే ముందు తెలుగులో మార్కెట్ సంపాదించిన అన్న సూర్య కంటే ముందు ఇక్కడి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేశాడు. 2016లో అక్కినేని నాగార్జునతో కలిసి ‘ఊపిరి’ లాంటి మంచి సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలిచాడు. ఆ చిత్రంలో కార్తి పెర్ఫామెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఐతే ఇక్కడ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ తర్వాత మళ్లీ ఇంకో తెలుగు సినిమా చేయలేదు కార్తి.
ఐతే పదేళ్ల తర్వాత ఇప్పుడు అతను తెలుగులో సినిమాను మొదలుపెట్టడం విశేషం. ‘మ్యాడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించిన యంగ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్తో చేతులు కలిపాడు కార్తి. వీరి కలయికలో సినిమా రాబోతున్న సంగతి ఇంతకుముందే వెల్లడైంది. ఈ చిత్రంలో కార్తి సరసన మీనాక్షి చౌదరి నటిస్తోంది.
ఇప్పటికే కార్తి అన్న సూర్యతో ‘విశ్వనాథం అండ్ సన్స్’, అంతకంటే ముందు మరో తమిళ హీరో ధనుష్తో ‘సార్’ సినిమాలను నిర్మించిన సూర్యదేవర నాగవంశీ.. ఓ తమిళ హీరోతో ముచ్చటగా మూడో సినిమా ప్రొడ్యూస్ చేయబోతున్నాడు.
నిజానికి కార్తి ఈ చిత్రం కంటే ముందు ‘హిట్-4’ చేస్తాడని భావించారు. నాని సినిమా ‘హిట్-3’లో అతను చివర్లో క్యామియో రోల్ చేసిన సంగతి తెలిసిందే. అది ‘హిట్-4’కు లీడ్ సీన్. ఐతే ఆ సినిమా సెట్స్ మీదికి వెళ్లడానికి ఇంకా సమయం పట్టేలా ఉంది. ఈలోపే కళ్యాణ్ శంకర్, నాగవంశీ కాంబినేషన్లో సినిమాను మొదలుపెట్టాడు.
This post was last modified on May 25, 2026 2:54 pm
ఒక సినిమా రిలీజైన రెండు మూడేళ్ల తర్వాత కూడా దాని కలెక్షన్ల గురించి విపరీతమైన చర్చ జరగడం అరుదు. ‘దేవర’ విషయంలో ఇదే…
అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ హీరోగా స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి రూపొందించిన ‘ఏజెంట్’ టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద…
కేంద్ర విద్యా శాఖకు నూతన మంత్రిగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్న ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు.…
బాక్సాఫీస్ దగ్గర పోటీ ఉన్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతాయి. ఇది అలాంటిదే. కేవలం ఒక్క రోజు గ్యాప్ తో…
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న స్పైడర్ మ్యాన్ సిరీస్ లోని కొత్త సినిమా బ్రాండ్ న్యూ డే జూలై…
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ కొత్త లాజిక్ మాట్లాడుతున్నారు. నైతిక బాధ్యత వహిస్తూ…