2021లో ఉప్పెన సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన బుచ్చిబాబు సన మొదటి అడుగులోనే వంద కోట్ల మార్క్ అందుకున్నాడు. డెబ్యూ డైరెక్టర్ కు అంతటి భారీ సక్సెస్ వస్తే వెంటనే నాలుగైదు సినిమాలు లైన్లో పెట్టేస్తుంటారు. కానీ బుచ్చిబాబు రూటే సెపరేట్ అని ఆయన తీసుకున్న గ్యాప్ చూస్తేనే అర్థమవుతోంది. రెండో సినిమా పెద్ది ఆడియన్స్ ముందుకు రావడానికి ఏకంగా ఐదేళ్ల సమయం పట్టింది. ఇప్పుడు ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా రిలీజ్ కు రెడీ అవుతున్న వేళ ఇండస్ట్రీలో ఆయన మూడో ప్రాజెక్ట్ పై అప్పుడే ఆసక్తికరమైన చర్చ మొదలైంది.
పెద్ది సినిమా రిజల్ట్ బుచ్చిబాబు కెరీర్ కు అత్యంత కీలకం కాబోతోంది. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కనక అనుకున్న స్థాయిలో హిట్ అయితే డైరెక్టర్ లీగ్ పూర్తిగా మారిపోతుంది. ఒకవేళ పెద్ది కనక పాన్ ఇండియా రేంజ్ లో రికార్డులు కొడితే మూడో సినిమాను కూడా అదే స్థాయిలో ప్లాన్ చేయాలనే ఆలోచన రావడం సహజం. మళ్ళీ బడా హీరోతోనే ప్రాజెక్ట్ సెట్ చేయాలని ఆయన తపన పడతాడు.
అయితే ఇక్కడే ఒక పెద్ద చిక్కు వచ్చి పడింది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న టాప్ స్టార్స్ ఎవరూ ఖాళీగా లేరు. ప్రతి ఒక్కరి డైరీ రాబోయే రెండేళ్ల వరకు ఫుల్ గా ప్యాక్ అయి ఉంది. రాజమౌళి, సందీప్ రెడ్డి వంగా, ప్రశాంత్ నీల్ లాంటి డైరెక్టర్లతో స్టార్స్ అంతా బిజీగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బుచ్చిబాబు ముందున్న ఆప్షన్స్ రెండే. బడా హీరో డేట్స్ దొరికే వరకు మరో రెండేళ్లు సైలెంట్ గా వెయిట్ చేయడం ఒక ఆప్షన్.
అయితే ఒక దర్శకుడు కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు ఐదేళ్లకు ఒక సినిమా తీయడం అనేది కమర్షియల్ గా పెద్ద మైనస్ అవుతుంది. ఈ జనరేషన్ లో ఆడియన్స్ టేస్ట్ లు చాలా వేగంగా మారిపోతున్నాయి. అలాగని చిన్న హీరోతో సినిమా చేసి తన మార్కెట్ ను తగ్గించుకోలేడు. టాలీవుడ్ లో డేట్స్ దొరకకపోతే బుచ్చిబాబు కోలీవుడ్ వైపు చూసే ఛాన్స్ కూడా లేకపోలేదు. ఈమధ్య కాలంలో మన డైరెక్టర్లు తమిళ స్టార్స్ తో సినిమాలు చేయడం బాగా ట్రెండ్ అవుతోంది.
పెద్ది హిట్ అయితే కోలీవుడ్ లోని టాప్ హీరోలు బుచ్చిబాబుతో పని చేయడానికి కచ్చితంగా ఆసక్తి చూపిస్తారు. సూర్య, కార్తి, లేదా శివకార్తికేయన్ లాంటి హీరోలకు ఒక పక్కా విలేజ్ మాస్ స్టోరీ చెబితే ప్రాజెక్ట్ చాలా ఈజీగా సెట్ అయిపోతుంది. పైగా పాన్ సౌత్ అప్పీల్ ఉన్న హీరో దొరికితే మార్కెట్ పరంగా కూడా ఎలాంటి ఢోకా ఉండదు. ఏదేమైనా ఇప్పుడు ఇండస్ట్రీ కళ్లన్నీ పెద్ది రిజల్ట్ మీదే ఉన్నాయి. ఆ సినిమా బాక్సాఫీస్ ఫలితం ఆధారంగానే ఆయన నెక్స్ట్ స్టెప్ డిసైడ్ అవుతుంది.
తమ భాషను, తమ సంస్కృతిని, తమ సామిత్యాన్ని గౌరవించుకోవడంలో మిగతా వాళ్లతో పోలిస్తే తెలుగు వాళ్లది ఎప్పుడూ వెనుకబాటే అన్న…
ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబుకు కేంద్రంలోని పెద్దలు బిగ్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్డీయే కూటమిని మరింత బలోపేతం…
తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్.. ఇటీవల వరుసగా వివాదాల్లో చిక్కుకుంటోంది. వరలక్ష్మి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘సరస్వతి’ సినిమాకు…
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తన వ్యూహాన్ని దాదాపు తేల్చేశారు. రాజకీయంగా తనకు ఉన్న లక్ష్యాన్ని కూడా వివరించారు. దేశాన్ని…
ఇప్పుడంతా అప్ డేటెడ్ వెర్షన్లే వినిపిస్తున్నాయి. వ్యవహారికంతో పాటుగా పాలిటిక్స్ లోనూ నయా తరం వచ్చేసింది. ఆ ఫలితమే జన్…
మెగా డీఎస్సీ పరీక్షలు జరిగి దాదాపు ఏడాది అవుతోంది. సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరి ఆరు నెలలు దాటిపోయింది.…