టాలీవుడ్ సినీ సర్కిల్స్లో ఏషియన్ మూవీస్ అధినేత సునీల్ నారంగ్ పేరు ఇటీవల ఎలా మార్మోగిందో తెలిసిందే. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్గా, ఎగ్జిబిటర్కు బహుముఖ పాత్రలు పోషిస్తున్న ఆయనకు ఎక్కువ పట్టు, పేరు ఉన్నది ఎగ్జిబిటర్గానే. తెలంగాణలో ఆయన ఆధ్వర్యంలో అనేక మల్టీప్లెక్సులతో పాటు సింగిల్ స్క్రీన్లు కూడా నడుస్తున్నాయి. ఆయన ఇటీవల ప్రెస్ మీట్ పెట్టి ఎగ్జిబిటర్ల కోసమే గళం విప్పారు. ఐతే నాగవంశీ, మైత్రీ రవిశంకర్ తదితరులు సునీల్ను టార్గెట్ చేయడం చర్చనీయాంశం అయింది.
ఆ తర్వాత ఆయన ఒక టీవీ ఛానెల్తో మాట్లాడుతూ నాగవంశీ మీద వ్యక్తిగత విమర్శలు చేయడమే కాక.. తనపై చేసిన విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. తర్వాత జరిగిన ఫిలిం ఛాంబర్ మీటింగ్ సందర్భంగా తనపై విమర్శలు చేసిన వాళ్లతో ఎడమొహం పెడమొహంగా ఉన్న సునీల్ నారంగ్.. ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్లోనూ అందరితో కలిసి ఫొటో దిగడానికి నిరాకరించడం తెలిసిందే.
ఐతే తాజాగా సునీల్ నారంగ్ తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఛాంబర్ ప్రతినిధులకు నిన్న లేట్ నైట్ ఆయన రాజీనామా లేఖను పంపించారు. పెద్ది సినిమాకు లైన్ క్లియర్ అని, సింగిల్ స్క్రీన్లలో పర్సంటేజీపై అందరూ ఒక అవగాహనకు వచ్చారని ఒక ప్రెస్ నోట్ సోషల్ మీడియాలో వైరల్ కాగా.. అందులో అంశాలు ఫైనల్ కాదంటూ సీనియర్ నిర్మాత సురేష్ బాబు ఒక నోట్ రిలీజ్ చేశారు.
ఆ తర్వాత కాసేపటికే సునీల్ నారంగ్ తన పదవికి రాజీనామా చేయడం గమనార్హం. కొందరు ఆఫీస్ బేరర్లను మెప్పించేలా నిర్ణయాలు తీసుకోవాలని తనపై ఒత్తిడి తెస్తున్నారని.. ఆ ఒత్తిళ్లకు తలొగ్గి తాను పని చేయలేనని.. తన ఆరోగ్య పరిస్థితి కూడా సహకరించడం లేదని సునీల్ తేల్చేశారు.
ఛాంబర్లో నిర్ణయాలన్నీ ఏకాభిప్రాయంతో జరగాల్సి ఉన్నప్పటికీ, అలా జరగడం లేదని, అందుకే తక్షణం తనను అధ్యక్ష పదవి నుంచి రిలీవ్ చేయాలని విజ్ఞప్తి చేశారు సునీల్. తన స్థానంలో బాధ్యతలు చేపట్టేందుకు శేఖర్ లేదా విజేందర్ పేర్లను సూచించారు సునీల్.
ఏపీలో కూటమి సర్కారు కొలువుదీరి రెండేల్లు అవుతోంది. మూడు పార్టీల కలయికతో ఏర్పడిన కూటమి… 2024 ఎన్నికల్లో అత్యంత కష్టతరమైన…
గత ఎన్నికల సమయంలో కొందరు నాయకులు పోటీ చేసిన నియోజకవర్గాల్లో వారు ఓడిపోయారు. అయితే.. ఆ తర్వాత పలువురు నేతలు..…
సత్యనారాయణ గారూ.. రేపు సిద్ధాంతం వస్తున్నా.. అక్కడ కలుద్దాం. అంటూ 87 ఏళ్ల వృద్ధుడు సత్యనారాయణకు ఆదివారం సీఎం చంద్రబాబు…
పెద్ది ఫలితం బాగుంది. కలెక్షన్లు చక్కగా వస్తున్నాయి. సోమవారం పరీక్ష కూడా నెగ్గింది. అయితే ఎక్కడో చిన్న అసంతృప్తి అభిమానులను…
తెలంగాణలో గతంలో ఎన్నడూ లేని రీతిలో ఇప్పుడు హిట్లర్ పేరుపై రచ్చ సాగుతోంది. అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ నేతల…
ఏపీకి బ్రాండ్ గా కొనసాగుతున్న విశాఖ ఉక్కు కర్మాగారంలో సోమవారం జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది కార్మికులు అక్కడిక్కడే…