టాలీవుడ్ మల్టీస్టారర్స్ లో కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టిన హీరోలుగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎప్పటికీ స్పెషల్ గా నిలిచిపోతారు. వీళ్ళను స్ఫూర్తిగా తీసుకుని వెంటనే ఎవరూ చేతులు కలపలేదు కానీ అలాంటి కాంబోలు సెట్ చేయడానికి అందరూ రాజమౌళిలు కాలేరుగా. సరే ఇది కాసేపు పక్కనపెడితే ఒక విషయంలో ఇద్దరూ కాకతాళీయంగా ఒకే పోలికను చూపిస్తున్నారు. అదేంటో చూద్దాం. పెద్దికు ముందు వచ్చిన రామ్ చరణ్ మూవీ గేమ్ ఛేంజర్ ఎంత పెద్ద డిజాస్టరో తెలిసిందే.
డ్రాగన్ కు ముందు జూనియర్ ఎన్టీఆర్ మూవీ వార్ 2. ఇది తెచ్చిన నష్టాల గురించి బాలీవుడ్ సైట్స్ తరచూ ప్రస్తావిస్తూ ఉంటాయి. ఈ రెండు సినిమాల దర్శకులు పరభాషా బ్యాచ్. శంకర్ తమిళం అయితే అయాన్ ముఖర్జీ హిందీ. అంత సులభంగా మర్చిపోలేని ఫ్లాప్స్ ఇచ్చారు. రాజమౌళి నెగటివ్ సెంటిమెంట్ ని తారక్ దేవరతో బ్రేక్ చేశాడు కానీ చరణ్ మాత్రం తప్పించుకోలేకపోయాడు. రాబోయే పెద్ది, డ్రాగన్ లో సింగల్ హీరోయిన్లు ఉన్నారు. జాన్వీ కపూర్ హిందీ కాగా, రుక్మిణి వసంత్ కన్నడ.
ఇలా ఎన్నో కంపారిజన్లు చాలా దగ్గరగా ఉండటం గమనించాల్సిన విషయం. అయితే పెద్ది జూన్ 4 విడుదల కానుండగా సరిగ్గా సంవత్సరం తర్వాత అదే జూన్ నెలలో డ్రాగన్ థియేటర్లకు వస్తుంది. అప్పటికంతా చరణ్ సుకుమార్ కాంబో మూవీ ఒక కొలిక్కి వచ్చి ఉండొచ్చు. త్రివిక్రమ్ డైరెక్షన్ లో తారక్ చేయబోయే మూవీ స్టార్ట్ అవ్వొచ్చు. ఇక్కడ ఆశ్చర్యపోవాల్సిన విషయం మరొకటుంది. ఈ ఇద్దరూ ఒకేసారి టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ తో ఒకేసారి పని చేయబోవడం.
ఈ పోలికల ముచ్చట కాసేపు పక్కనపెడితే పెద్ది, డ్రాగన్ గ్రాండ్ సక్సెస్ కావడం చరణ్, తారక్ ఇద్దరికీ చాలా కీలకం. మార్కెట్ విస్తృతి పెరగాలన్నా, గ్లోబల్ గా మరింత రీచ్ రావాలన్నా ఇవి బ్లాక్ బస్టర్ కన్నా తక్కువ ఫలితం అందుకోకూడదు. దానికి తగ్గట్టే ఒక్కొక్కరు రెండేళ్లకు పైగా విలువైన సమయం, ఒళ్ళు హూనం అయ్యేలా మేకోవర్ లాంటివన్నీ చేసుకుంటున్నారు. వన్ ఇయర్ గ్యాప్ లో ఇద్దరూ ఎలాంటి రిజల్ట్స్ అందుకుంటారో చూడాలి.
This post was last modified on May 18, 2026 10:42 pm
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పనితీరులో దూసుకుపోతున్నారు. మొన్నటిదాకా సినిమా నటుడిగా తనదైన సత్తా చాటిన…
పెద్దగా ప్రమోషన్లు చేయకుండా, జనాల్లో అంతగా ఆసక్తి కలిగించకుండా, ప్రమోషన్లకు దూరంగా ఉంటూ ఒక సినిమాకు ఓపెనింగ్స్ రావడం లేదా…
స్టార్ హీరోల వారసురాళ్లు స్క్రీన్ మీదకు వచ్చి సక్సెస్ కావడం అరుదు. ముఖ్యంగా మన దక్షిణాదిలో ఒక్క కమల్ హాసన్…
నీట్ పేపర్ లీక్ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన రాజీనామాను…
ఆగస్ట్ 21 ఇరుముడి విడుదల కానుంది. ముందు నుంచి దీని మీద పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ముఖ్యంగా వరస ఫ్లాపులతో…
డీఎస్సీ ఉద్యోగాల భర్తీ విషయంలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ చేస్తున్న ర్యాలీల రచ్చ చూసి రాష్ట్ర ప్రజల నుంచి ఆగ్రహం…