నిన్న వారం విడుదలైన గోదారి గట్టుపైనకు మిక్స్డ్ టాక్ వచ్చిన మాట వాస్తవం. తండ్రి కూతురి ఎమోషన్ ని తీసుకుని ఒక ఆటో డ్రైవర్ ప్రేమకథకు ముడి పెడదామని చూసిన దర్శకుడు అందులో పూర్తిగా సక్సెస్ కాలేకపోయారు. ఫలితంగా వీక్ డేస్ మొదలయ్యాక విపరీతమైన డ్రాప్ కనిపించేసింది. దీంతో రిలీజ్ ముందు వరకు తెగ హడావిడి చేసిన టీమ్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. ప్రెస్ మీట్లు, లేకుండా మౌనం వహించింది. హీరో హీరోయిన్ కొన్ని టూర్లు వేస్తున్నారు కానీ అవి జనాల్లోకి వెళ్ళడం లేదు.
అసలు సంగతేమిటంటే గోదారి గట్టుపైన రెండో వారంలో చాలా చోట్ల కొనసాగుతోంది. వేరే సినిమాలు లేకపోవడం, డబ్బింగులు ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోవడం వల్ల ఎగ్జిబిటర్లు కంటిన్యూ చేస్తున్నారు. వీరభద్రుడు టాక్ యావరేజ్ లేదా ఫ్లాప్ అయ్యే స్థాయిలో ఉన్నా ఆక్యుపెన్సీలు బాగున్నాయి. ముఖ్యంగా ఏ సెంటర్స్ అధిక శాతం హౌస్ ఫుల్స్ నమోదు చేశాయి. ఈ ఫ్లోలో గోదారి గట్టుపైన చూసే ఆడియన్స్ కూడా ఉండటం గమనించాల్సిన విషయం.
ఒకరకంగా చెప్పాలంటే పూర్తిగా గట్టుపైన వదిలేసి యూనిట్ మౌనవ్రతం పాటించడం కొంచెం రాంగనే చెప్పాలి. అలాని ఏదో భీభత్సంగా వసూళ్లు వస్తున్నాయని కాదు కానీ ఉన్నంతలో ఏదో నెట్టుకొస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో యావరేజ్ కంటెంట్ ఉన్నా చాలు జనంలోకి బలంగా తోస్తే ఎంతో కొంత డబ్బులు వస్తాయి. కానీ పబ్లిసిటీ ఖర్చు భరించలేక చాలా మంది నిర్మాతలు మొదటి వీకెండ్ అవ్వగానే ఉన్నట్టుండి సౌండ్ చేయడం మానేస్తున్నారు.
మేం ఫేమస్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న హీరో సుమంత్ ప్రభాస్ కు రెండో సినిమా మాత్రం చిన్నపాటి షాక్ ఇచ్చిందని చెప్పాలి. తనకు సూటయ్యే పాత్రే ఎంచుకున్నా అది అన్ని వర్గాలను చేరేలా ఉందో లేదో చూసుకోకపోవడం గోదారి గట్టుపైనకు మైనస్ అయ్యింది. నువ్వే నువ్వే, ఆకాశమంత కథలను అటుఇటు తిప్పి ఇంటర్ క్యాస్ట్ లవ్ స్టోరీగా మార్చడం బాగానే ఉంది కానీ దానికి సరిపడా ఎంటర్ టైన్మెంట్, ఎమోషన్స్ బలంగా జోడించి ఉంటే ఖచ్చితంగా హిట్టయ్యేది.
This post was last modified on May 17, 2026 11:19 am
ఫోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ పోలీసులకు లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శనివారం రాత్రి తమ…
టాలీవుడ్లో హీరోలు దర్శకులవడం కొత్త కాదు కానీ.. ఈ జాబితా మరీ పెద్దదేమీ కాదు. తాజాగా యువ కథానాయకుడు రామ్…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సానా రూపొందించిన పెద్ది మీద అంచనాలు ఏ…
ఏపీ రాజధాని అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించాలని.. ప్రభుత్వం ప్రతిపాదించిన విషయం తెలిసిందే. దీనిని సుమారు 5 వేల ఎకరాల్లో…
ప్రస్తుతం పొదుపు మంత్రం పఠిస్తున్న కేంద్ర ప్రభుత్వం చమురు సహా బంగారం వంటివాటిపై కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రభుత్వ పరిధిలో…
ఏపీలో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాల్లో ఒకటి బీజేపీకి కేటాయించనున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చసాగుతోంది. మొత్తం నాలుగు స్థానాల్లో…