Movie News

గుట్టుగా మాట్లాడుకుంటే గొడవలెందుకు వస్తాయి

ఎన్నడూ లేని విధంగా టాలీవుడ్ లో నివురు గప్పిన నిప్పులా మొదలైన సింగల్ స్క్రీన్ల పర్సెంటెజ్ వివాదం ఇప్పుడు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల మధ్య వ్యక్తిగత ఇష్యూగా మారిపోయింది. ముఖ్యంగా శిరీష్ రెడ్డి, సునీల్ నారంగ్, నాగవంశీలు పరస్పరం చేసుకున్న విమర్శలు, జోకులు సోషల్ మీడియా నట్టింట్లోకి వచ్చేశాయి. ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది పక్కనపెడితే ఇది కాస్తా జనాలకు టైం పాస్ కంటెంట్ అయిపోవడం ఎంత మాత్రం మంచిది కాదనేది వాస్తవం.

స్వంత కుటుంబాల్లోనే ఎన్నో సమస్యలు ఉంటాయి. అలాంటిది వేల కోట్ల పెట్టుబడులతో లక్షల మందికి జీవనోపాధి కలిగించే టాలీవుడ్ లో లేకుండా పోవు. గతంలో ఇంత కంటే తీవ్రమైన సంక్షోభాలు ఎన్నో చూశాం. రోజుల తరబడి షూటింగులు ఆగిపోయి ప్రొడ్యూసర్లు తల్లడిల్లిపోవడం కొత్త కాదు. కరోనా టైంలో థియేటర్లు మూతబడి సిబ్బంది అల్లాడిపోయిన ఉదంతాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. ఇప్పుడు వచ్చింది వాటికన్నా పెద్దది కాదు ఘోరమైంది అంతకన్నా కాదు.

కానీ వీధికెక్కి ఒకరి పరువు మరొకరు తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు సరికదా ఇవాళ అన్న మాటలు శాశ్వతంగా వీడియో రూపంలో భద్రంగా ఉంటాయి. భవిష్యత్తులో వ్యాపార ప్రత్యర్థులు వీటినే అస్త్రాలుగా మార్చుకుంటారు. సింగల్ స్క్రీన్, మల్టీప్లెక్సుల మధ్య షేర్ల వ్యత్యాసాల గురించి కూచుని మాట్లాడుకోవచ్చు. అలా కాకుండా కెమెరాల ముందు రోజుకొకరు కాంట్రావర్సీ చేస్తే పరిష్కారం దొరకడం మాట అటుంచి ఇదో ఈగోల యుద్ధంగా మారిపోయింది.

ఎవరో ఒకరు పెద్ద మనిషి పాత్ర పోషించి దీన్ని పరిష్కరించడం అవసరం. దాసరిని గుర్తు చేసుకోవడం కాదు, ఆయన స్థానాన్ని ఎవరు తీసుకుంటారని కాదు, ఇంతదాకా వచ్చాక ఇది మరింత ముదరకుండా ఆపే చొరవ ఎవరో ఒకరు తీసుకోవాలి. తెలంగాణ ఎఫ్డిసి చైర్ మెన్ గా ఉన్న దిల్ రాజు, అగ్ర నిర్మాత సురేష్ బాబు తదితరులు తటస్థంగా ఉండటం ఆందోళన పెంచుతోంది. గుట్టుగా ఉండాల్సిన కాపురాలు బయట గొడవలకు దిగితే కొంపలు కూలుతాయి. వీలైనంత త్వరగా దీనికి చెక్ పడితే మంచిది.

This post was last modified on May 14, 2026 1:06 pm

Share

Recent Posts

పీకే విక్టరీ బీజేపీకి డేంజర్ బెల్స్ మోగించినట్టేనా?

బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…

28 minutes ago

40 నిముషాల్లోనే శ్రీవారి దర్శనం… కేవలం వారికే!

నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…

4 hours ago

జంతర్ మంతర్ కు చెక్ ?

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…

8 hours ago

సత్య హాస్యం చాలా ప్లస్ అవుతోంది

గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…

8 hours ago

వెంక‌ట‌ప్ప ఫెయిల్… ఇక మాలిక్ ఏం చేస్తాడో?

తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే అత్యంత గొప్ప న‌టుల జాబితా తీస్తే.. అందులో పైవ‌రుస‌లో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒక‌రు.…

9 hours ago

పీకే ఇక ఎమ్మెల్యే సాబ్!

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…

10 hours ago