సినిమా వాళ్లకు రాజకీయ ఆసక్తులు, అభిమానాలు ఉండడం కొత్త కాదు. అందులో తప్పు కూడా లేదు. ఐతే ఎప్పుడూ రాజకీయాల గురించి మాట్లాడకుండా, వాటి పొడే గిట్టనట్లు ఉండిపోయిన.. దిగ్గజ స్థాయి ఉన్న వ్యక్తులు.. ఒక రాజకీయ నాయకుడికి ఎలివేషన్ ఇస్తూ వ్యాఖ్యానాలు చేస్తే ఆశ్చర్యం కలగక మానదు.
రచయితగా, నటుడిగా, దర్శకుడిగా బహుముఖ ప్రజ్ఞను చాటుకుని లెజెండరీ స్టేటస్ తెచ్చుకున్న తనికెళ్ల భరణి.. ఇప్పుడు ఎక్స్లో పెట్టిన పోస్టు చర్చనీయాంశంగా మారింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఆయన ఎవ్వరూ ఊహించని స్థాయిలో పొగిడేశారు.
ఆయన్ని కలిసినందుకు పరవశించిపోయారు. మోడీ ఆదివారం హైదరాబాద్లో పర్యటించిన సంగతి తెలిసిందే. తిరిగి దిల్లీ వెళ్లే ముందు విమానాశ్రయంల ఆయన్ని కలిసిన వ్యక్తుల్లో తనికెళ్ల భరణి కూడా ఉన్నారు.
తాను చేతులెత్తి నమస్కరిస్తుండగా, వారిస్తూ తన చేతులను మోడీ పట్టుకున్న ఫొటోను భరణి ఎక్స్లో పోస్ట్ చేసి దానికి ఒక వ్యాఖ్య జోడించారు. నేను రాముణ్ణి చూడలేదు, కృష్ణుణ్ణి చూడలేదు, ఆదిశంకరుల్ని చూడలేదు, వివేకానందుణ్ణి చూడలేదు. అంటే చూడలేము కూడా. కానీ వాళ్లందరి అంశలతో ఉన్న మోడీ గారిని చూశాను, ముట్టుకున్నాను, చేతిని ముద్దెట్టుకున్నాను. నా జన్మ ధన్యం అని ఆయన కామెంట్ పెట్టారు.
ఇది బీజేపీ వాళ్లకు ఆనందం కలిగిస్తున్నప్పటికీ.. యాంటీ మోడీ ఫ్యాన్స్కు, అలాగే న్యూట్రల్స్కు మాత్రం నచ్చట్లేదు. భరణి స్థాయి వ్యక్తి ఇలాంటి కామెంట్ పెట్టడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు. దేవుళ్లతో మోడీని పోల్చడమేంటి.. ఆయన్ని ముట్టుకున్నందుకు జన్మ ధన్యం అనడమేంటి.. మీ స్థాయికి ఇది తగునా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఐతే దేశంలో హిందూ సంస్కృతిని కాపాడుతున్న మోడీ మీద భరణికి అంత ప్రేమ, గౌరవం ఉంటే తప్పేముందని.. ప్రకాష్ రాజ్ లాగా మేధావి, లిబరల్ అనిపించుకోవాలంటే మోడీని వ్యతిరేకించాలా అంటూ బీజేపీ వాళ్లు కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. తన మనసుకు అనిపించింది చెప్పారంటూ భరణిని కొనియాడుతున్నారు.
This post was last modified on May 11, 2026 11:33 pm
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
బారత ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ... వరుసబెట్టి మూడు పర్యాయాలు దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా దేశానికి అత్యధిక…
కొత్త నెల వచ్చేసింది. సంక్రాంతి అయిపోయాక ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా జనాలు రాక థియేటర్లు అలో లక్ష్మణా అంటున్న…