ఈ వారం విడుదల కాబోతున్న వీరభద్రుడుకి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. దర్శకుడు ఆర్జె బాలాజీ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను సోషల్ మీడియా కోసం సినిమా తీయలేదని, చీకటి గదిలో కూచుని రివ్యూల పేరుతో పోస్ట్ మార్టం చేసేవాళ్లని పట్టించుకోనని, అదే సమయంలో బుర్రని ఇంట్లో వదిలేసి రమ్మని ప్రేక్షకులను కోరనని, లాజిక్స్ ఉన్న ప్రాపర్ ఎంటర్ టైనర్ తీశానని హామీ ఇచ్చారు. ఏపీ తెలంగాణ తమిళనాడు ఆడియన్స్ కోసం తీశానని చెప్పుకొచ్చారు.
నిజానికి రిలీజ్ కు ముందు ఈ టాపిక్ మీద దర్శకులు మాట్లాడ్డం అరుదు. బాలాజీ రియాక్ట్ అవ్వడానికి కారణం లేకపోలేదు. తమిళ వెర్షన్ ట్రైలర్ వచ్చాక ఎక్స్, ఇన్స్ టా తదితర సామజిక మాధ్యమాల్లో కొంత మిశ్రమ స్పందన కనిపించింది. ముఖ్యంగా మెయిన్ విలన్ గా ఆర్జెజె బాలాజీ సూట్ కాలేదని ఎక్కువ శాతం కామెంట్ చేశారు. సూర్య లాంటి మాస్ కటవుట్ ముందు బాలాజీ అనలేదని, కామెడీ పాత్రల్లో చూసి అలవాటైన తనను ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలని అన్నారు.
అయితే ప్రాక్టికల్ గా చూసుకుంటే బాలాజీ కొన్ని లాజిక్స్ మిస్ అవుతున్నారు. సోషల్ మీడియా అనేది వేరే ప్రపంచం కాదు. అక్కడ ఉండేది కూడా సగటు అభిమానులు, సినిమా ప్రియులే. కాకపోతే అటాకింగ్ స్టయిల్ కాస్త ఎక్కువగా ఉంది. సినిమా పాజిటివ్ గా ఉంటే మోసేది వీళ్ళే, తేడా కొడితే ట్రోలింగ్ చేసేది వీళ్ళే. ఫేక్ ఐడిలతో ఆపరేట్ చేసినా వాళ్ళూ మనుషులే. సో ఆ బ్యాచ్ కోసం తీసినా తీయకపోయినా వాళ్ళు చూడటం మానరు, అభిప్రాయాలు చెప్పకుండా ఉండరు.
ఫైనల్ గా మాట్లాడాల్సింది కంటెంట్ తప్ప మరొకటి కాదు. వీరభద్రుడు మీద బజ్ తక్కువగా ఉన్న మాట వాస్తవమే. అటు తమిళంలో హైప్ మెల్లగా పెరుగుతోంది. కొన్నేళ్లుగా హిట్ లేక ఇబ్బంది పడుతున్న సూర్యకి ఇది విజయం సాధించడం చాలా కీలకం. నయనతారతో అమ్మోరు తల్లి రూపంలో ఓటిటి డెబ్యూ హిట్టు కొట్టిన ఆర్జె బాలాజీకి ఇది హిట్ అయితే సూర్యకి బ్రేక్ ఇచ్చిన ఆనందంతో పాటు స్టార్ హీరోల నుంచి పిలుపులొస్తాయి. విలన్ గా కూడా చేశాడు కాబట్టి అది క్లిక్ అయితే నటుడిగా మరిన్ని వైవిధ్యమైన పాత్రలు చేయొచ్చు.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…