తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత హైప్ మధ్య విడుదలైన చిత్రాల్లో.. దేవిపుత్రుడు ఒకటి. 2001 సంక్రాంతికి మృగరాజు, నరసింహనాయుడు లాంటి భారీ చిత్రాలతో ఈ మూవీ పోటీ పడింది. మిగతా రెండు చిత్రాల మీదా భారీ అంచనాలే ఉన్నాయి కానీ.. దేవిపుత్రుడుకు ఉన్న హైప్ వేరు. అప్పటికి టాలీవుడ్లో అత్యధిక బడ్జెట్లో తెరకెక్కిన చిత్రమిది.
దాని కథాంశం, ట్రైలర్, పాటలు అన్నీ కూడా వేరే లెవెల్లో కనిపించాయి. దీంతో ఎంతో ఊహించుకుని థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులకు ఈ చిత్రం మిశ్రమానుభూతిని కలిగించింది. కథ ఆసక్తికరంగానే ఉంటుంది. విజువల్స్ గొప్పగా ఉంటాయి. వెంకీ నటన, పాటలు కూడా సూపరే. కానీ సినిమాలో ఏదో మిస్సయిన ఫీలింగ్ వల్ల చివరికి ప్రేక్షకులు పెదవి విరిచారు.
సినిమా ఫ్లాప్ అయింది. నిర్మాత ఎంఎస్ రాజుకు, బయ్యర్లకు భారీ నష్టాలు తప్పలేదు. ఐతే హీరో వెంకీ మాట వినకపోవడం వల్లే ఈ సినిమా ఫ్లాప్ అయిందని తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఎంఎస్ రాజు వెల్లడించారు.
దేవి పుత్రుడు స్క్రిప్టును వెంకీ విన్నాక చివరి 45 నిమిషాల్లో కొంచెం తేడాగా ఉందని.. దాన్ని సరి చేశాక షూటింగ్కు వెళ్దామని సూచించినట్లు రాజు తెలిపారు. ఐతే తాము మాత్రం ఆయన మాట వినకుండా హడావుడిగా షూటింగ్ మొదలుపెట్టేశామని.. కానీ సినిమా చివరి దశకు వచ్చాక ఈ కథను ఎలా ముగించాలో తెలియక తాను, దర్శకుడు కోడి రామకృష్ణ తలలు పట్టుకున్నామని రాజు చెప్పారు.
ఆ కథకు ఫిట్ అయ్యే క్లైమాక్స్ కోసం తాను, కోడి రామకృష్ణ రకరకాల వెర్షన్లు ట్రై చేశామని.. చివరికి ఏదీ సరిగా కుదరలేదని.. అందువల్లే సినిమా పోయిందని ఆయనన్నారు. చివరికి ఫలితం చూశాక వెంకీ మాట వినకపోవడం పెద్ద తప్పు అని తమకు అర్థమైందని రాజు చెప్పారు.
దేవి పుత్రుడు మీద అప్పట్లోనే రూ.15 కోట్ల బడ్జెట్ పెట్టడం విశేషం. ఈ సినిమా చేదు అనుభవాన్ని మిగిల్చినప్పటికీ ఎంఎస్ రాజు జావగారిపోకుండా తర్వాత మనసంతా నువ్వేతో సూపర్ హిట్ కొట్టారు. ఆ తర్వాత ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రాలతో ఆయన దూసుకెళ్తారు. రాజు డైరెక్ట్ చేసిన అగథ చిత్రం త్వరో విడుదలకు సిద్ధమవుతోంది.
This post was last modified on May 11, 2026 11:24 pm
ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…
సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…
తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…
సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…
వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…
భారతదేశంలోనే వివాహం చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1…