సౌత్ ఇండియాలో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్లో ఒకటైన ‘దృశ్యం-3’ ఇంకో పది రోజుల్లోపే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఏప్రిల్ 2కే రావాల్సిన ఈ చిత్రాన్ని గల్ఫ్ దేశాల్లో ప్రతికూల పరిస్థితుల కారణంగా మే 21కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఆ తేదీకే పక్కాగా సినిమా రిలీజ్ కాబోతోంది. ఐతే ఈ చిత్రం మేకింగ్ దశలో ఉండగా.. తెలుగు రీమేక్ మీద రకరకాల వార్తలు వచ్చాయి.
దృశ్యం, దృశ్యం-2 చిత్రాలను రీమేక్ చేసిన విక్టరీ వెంకటేష్.. దృశ్యం-3లో కూడా నటిస్తాడని, నటించడని.. ఇలా సందిగ్ధత నడిచింది. చివరగా వెంకీ ‘దృశ్యం-3’ని పక్కన పెట్టినట్లే వార్తలు వచ్చాయి. ఐతే ఆ విషయం అధికారికంగా ఏమీ ప్రకటించలేదు. ‘దృశ్యం-2’ వచ్చినపుడు రీమేక్ గురించి చర్చ లేదు. కానీ తర్వాత వెంకీ దాన్ని టేకప్ చేశాడు. ఇప్పుడు కూడా అలాగే చేస్తాడేమో అన్న సందేహాలు కూడా కలిగాయి. కానీ ఇప్పుడు ఆ సందేహాలకు తెరపడింది. రాంబాబు ఇక రాడని తేలిపోయింది.
‘దృశ్యం-3’ తెలుగు రీమేక్ క్యాన్సిల్ అయినట్లు కన్ఫమ్ అయింది. ఎందుకంటే ఈ నెల 21న మలయాళ వెర్షన్తో పాటే తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా రిలీజ్ కానుంది. ఈ మేరకు ట్రైలర్ కూడా లాంచ్ కావడంతో ఒక క్లారిటీ వచ్చేసింది. ఈ రోజుల్లో రీమేక్లు చేయడమే పెద్ద రిస్క్ అయిపోయింది. పైగా ‘దృశ్యం’ ఫ్రాంఛైజీకి ఉన్న క్రేజ్ దృష్ట్యా సౌత్ ఇండియా అంతటా జనాలు మలయాళ వెర్షన్ చూడడానికి సిద్ధంగా ఉన్నారు. థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఎలాగూ నెల రోజులకే ఓటీటీలోకి ఆ సినిమా వచ్చేస్తుంది.
అలాంటపుడు మళ్లీ తెలుగులో తీయడం వ్యర్థం. అందుకే వెంకీ అన్నీ ఆలోచించి రీమేక్ నుంచి తప్పుకున్నట్లు ఉన్నాడు. కానీ హిందీలో మాత్రం ఈ చిత్రం రీమేక్ అవుతోంది. ఇప్పటికే షూటింగ్ కూడా మొదలైంది. కానీ ఒరిజినల్ నిర్మాత పెట్టిన కండిషన్ మేరకు ఆ చిత్రాన్ని కొంచెం లేటుగా రిలీజ్ చేయబోతున్నారు. అక్టోబరులో అది ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇక మలయాళ వెర్షన్ను తమిళంలో సైతం అనువాదం చేసి రిలీజ్ చేస్తున్నారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. బీజేపీకి జనసేనతో…
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా సినిమా మేజర్ షెడ్యూల్ ఈ జూన్ మధ్యలో ప్రారంభం కాబోతున్నట్లు…
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…