సౌత్ ఇండియాలో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్లో ఒకటైన ‘దృశ్యం-3’ ఇంకో పది రోజుల్లోపే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఏప్రిల్ 2కే రావాల్సిన ఈ చిత్రాన్ని గల్ఫ్ దేశాల్లో ప్రతికూల పరిస్థితుల కారణంగా మే 21కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఆ తేదీకే పక్కాగా సినిమా రిలీజ్ కాబోతోంది. ఐతే ఈ చిత్రం మేకింగ్ దశలో ఉండగా.. తెలుగు రీమేక్ మీద రకరకాల వార్తలు వచ్చాయి.
దృశ్యం, దృశ్యం-2 చిత్రాలను రీమేక్ చేసిన విక్టరీ వెంకటేష్.. దృశ్యం-3లో కూడా నటిస్తాడని, నటించడని.. ఇలా సందిగ్ధత నడిచింది. చివరగా వెంకీ ‘దృశ్యం-3’ని పక్కన పెట్టినట్లే వార్తలు వచ్చాయి. ఐతే ఆ విషయం అధికారికంగా ఏమీ ప్రకటించలేదు. ‘దృశ్యం-2’ వచ్చినపుడు రీమేక్ గురించి చర్చ లేదు. కానీ తర్వాత వెంకీ దాన్ని టేకప్ చేశాడు. ఇప్పుడు కూడా అలాగే చేస్తాడేమో అన్న సందేహాలు కూడా కలిగాయి. కానీ ఇప్పుడు ఆ సందేహాలకు తెరపడింది. రాంబాబు ఇక రాడని తేలిపోయింది.
‘దృశ్యం-3’ తెలుగు రీమేక్ క్యాన్సిల్ అయినట్లు కన్ఫమ్ అయింది. ఎందుకంటే ఈ నెల 21న మలయాళ వెర్షన్తో పాటే తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా రిలీజ్ కానుంది. ఈ మేరకు ట్రైలర్ కూడా లాంచ్ కావడంతో ఒక క్లారిటీ వచ్చేసింది. ఈ రోజుల్లో రీమేక్లు చేయడమే పెద్ద రిస్క్ అయిపోయింది. పైగా ‘దృశ్యం’ ఫ్రాంఛైజీకి ఉన్న క్రేజ్ దృష్ట్యా సౌత్ ఇండియా అంతటా జనాలు మలయాళ వెర్షన్ చూడడానికి సిద్ధంగా ఉన్నారు. థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఎలాగూ నెల రోజులకే ఓటీటీలోకి ఆ సినిమా వచ్చేస్తుంది.
అలాంటపుడు మళ్లీ తెలుగులో తీయడం వ్యర్థం. అందుకే వెంకీ అన్నీ ఆలోచించి రీమేక్ నుంచి తప్పుకున్నట్లు ఉన్నాడు. కానీ హిందీలో మాత్రం ఈ చిత్రం రీమేక్ అవుతోంది. ఇప్పటికే షూటింగ్ కూడా మొదలైంది. కానీ ఒరిజినల్ నిర్మాత పెట్టిన కండిషన్ మేరకు ఆ చిత్రాన్ని కొంచెం లేటుగా రిలీజ్ చేయబోతున్నారు. అక్టోబరులో అది ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇక మలయాళ వెర్షన్ను తమిళంలో సైతం అనువాదం చేసి రిలీజ్ చేస్తున్నారు.
This post was last modified on May 12, 2026 9:15 am
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…