దక్షిణాది సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నిర్మాతల్లో ఒకరైన ఆర్.బి.చౌదరి.. రెండు రోజుల కిందట ఒక కారు ప్రమాదంలో దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఆయన సేవలను అటు తమిళ, ఇటు తెలుగు సినీ పరిశ్రమల్లో అందరూ స్మరించుకుంటున్నారు. ఎన్నో అద్భుతమైన కుటుంబ కథా చిత్రాలతో ఒక ట్రెండ్ సెట్ చేసిన ఘనత ఆయన సొంతం. రెండు ఫిలిం ఇండస్ట్రీల్లోనూ అగ్ర కథానాయకులతో ఆయన సినిమాలు చేశారు.
ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి కాబోతున్న విజయ్ సైతం చౌదరి నిర్మించిన సినిమాలతోనే పెద్ద స్టార్ అయ్యాడు. నిన్న చౌదరి భౌతిక కాయాన్ని సందర్శించిన విజయ్ కన్నీళ్లు కూడా పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ రోజు సూపర్ స్టార్ రజినీకాంత్ చౌదరికి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చౌదరి తన వందో సినిమాను తనతోనే ప్రొడ్యూస్ చేయాలనుకున్న విషయాన్ని వెల్లడించారు.
తాను ఆర్.బి.చౌదరితో ఒక్క సినిమా కూడా చేయలేదని.. కానీ ఆయన మీద తనకు ఎంతో గౌరవ భావం ఉందని రజినీకాంత్ వెల్లడించారు. నాలుగు నెలల ముందు చౌదరికి, తనకు మధ్య జరిగిన సంభాషణ గురించి ఆయన బయటపెట్టారు. తాను నిర్మాతగా 99 సినిమాలు నిర్మించానని.. వందో సినిమా చేసి రిటైరైపోవాలనుకుంటున్నానని.. ఆ సినిమాను మీరే చేయాలి అని చౌదరి చెప్పారని.. తాను కూడా కచ్చితంగా చేస్తానని మాట ఇచ్చానని రజినీ వెల్లడించారు.
తన కోసం కథ కూడా రెడీ చేయిస్తున్నట్లు చౌదరి చెప్పారన్నారు రజినీ. ఇండస్ట్రీలో ఎంతోమంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు ఆయన లైఫ్ ఇచ్చారని, ఇలాంటి నిర్మాత ఇంకొకరు ఉండరని రజినీ వ్యాఖ్యానించారు. తన సినిమాలకు సంబంధించి ఎవరితో అయినా ఇబ్బంది వస్తే నేరుగా వారి ఇంటికి వెళ్లిపోయేవారని.. సమస్య ఏంటి అని అడిగి తెలుసుకుని, దాన్ని పరిష్కరించి కాఫీ తాగి వచ్చేసేవారని.. ఎవరినీ ఏ రకంగానూ ఆయన ఇబ్బంది పెట్టరని ఆర్.బి.చౌదరి వ్యాఖ్యానించారు. చౌదరి లేని లోటు ఇండస్ట్రీలో ఎప్పటికీ ఉంటుందని రజినీ అన్నారు.
This post was last modified on May 7, 2026 2:39 pm
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…