దక్షిణాది సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నిర్మాతల్లో ఒకరైన ఆర్.బి.చౌదరి.. రెండు రోజుల కిందట ఒక కారు ప్రమాదంలో దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఆయన సేవలను అటు తమిళ, ఇటు తెలుగు సినీ పరిశ్రమల్లో అందరూ స్మరించుకుంటున్నారు. ఎన్నో అద్భుతమైన కుటుంబ కథా చిత్రాలతో ఒక ట్రెండ్ సెట్ చేసిన ఘనత ఆయన సొంతం. రెండు ఫిలిం ఇండస్ట్రీల్లోనూ అగ్ర కథానాయకులతో ఆయన సినిమాలు చేశారు.
ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి కాబోతున్న విజయ్ సైతం చౌదరి నిర్మించిన సినిమాలతోనే పెద్ద స్టార్ అయ్యాడు. నిన్న చౌదరి భౌతిక కాయాన్ని సందర్శించిన విజయ్ కన్నీళ్లు కూడా పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ రోజు సూపర్ స్టార్ రజినీకాంత్ చౌదరికి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చౌదరి తన వందో సినిమాను తనతోనే ప్రొడ్యూస్ చేయాలనుకున్న విషయాన్ని వెల్లడించారు.
తాను ఆర్.బి.చౌదరితో ఒక్క సినిమా కూడా చేయలేదని.. కానీ ఆయన మీద తనకు ఎంతో గౌరవ భావం ఉందని రజినీకాంత్ వెల్లడించారు. నాలుగు నెలల ముందు చౌదరికి, తనకు మధ్య జరిగిన సంభాషణ గురించి ఆయన బయటపెట్టారు. తాను నిర్మాతగా 99 సినిమాలు నిర్మించానని.. వందో సినిమా చేసి రిటైరైపోవాలనుకుంటున్నానని.. ఆ సినిమాను మీరే చేయాలి అని చౌదరి చెప్పారని.. తాను కూడా కచ్చితంగా చేస్తానని మాట ఇచ్చానని రజినీ వెల్లడించారు.
తన కోసం కథ కూడా రెడీ చేయిస్తున్నట్లు చౌదరి చెప్పారన్నారు రజినీ. ఇండస్ట్రీలో ఎంతోమంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు ఆయన లైఫ్ ఇచ్చారని, ఇలాంటి నిర్మాత ఇంకొకరు ఉండరని రజినీ వ్యాఖ్యానించారు. తన సినిమాలకు సంబంధించి ఎవరితో అయినా ఇబ్బంది వస్తే నేరుగా వారి ఇంటికి వెళ్లిపోయేవారని.. సమస్య ఏంటి అని అడిగి తెలుసుకుని, దాన్ని పరిష్కరించి కాఫీ తాగి వచ్చేసేవారని.. ఎవరినీ ఏ రకంగానూ ఆయన ఇబ్బంది పెట్టరని ఆర్.బి.చౌదరి వ్యాఖ్యానించారు. చౌదరి లేని లోటు ఇండస్ట్రీలో ఎప్పటికీ ఉంటుందని రజినీ అన్నారు.
విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడి సినిమాలు తీయడం చాలా రిస్క్. కొన్నిసార్లు ఇవి తీసుకునే సమయం హీరోల కెరీర్ల మీద…
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్టులో స్టార్ క్యాస్ట్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది.…
విజయవాడలో యువకుడి అదృశ్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ, కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం…
విజయవాడలో కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని ఆరోపణలు రావడం రాజకీయ దుమారం రేపిన…
పెద్ది విడుదలకు ముందు జాన్వీ కపూర్ ప్రమోషన్ల పరంగా ఎంత చేయాలో అంతా చేసింది. ఇండియా మొత్తం టీమ్ తో…
రాజకీయ చతురతలో మరోసారి టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు చాణక్యం వెలుగు చూసింది. ఇంకేముంది.. సర్కారును ఇరుకున పెట్టేసి.. కుల,…