టాలీవుడ్లో హీరోగా బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చి.. తక్కువ టైంలోనే పెద్ద రేంజికి చేరుకుని.. ఆ తర్వాత సుదీర్ఘమైన ఫ్లాప్ స్ట్రీక్తో పతనం చవిచూసిన హీరో నితిన్. జయం, దిల్, సై చిత్రాలతో విపరీతమైన డిమాండ్ తెచ్చుకున్న అతను.. ఆ తర్వాత వరుసగా డజను ఫ్లాపులు ఖాతాలో వేసుకున్నాడు. ఇక తన పనైపోయిందని అనుకున్న టైంలో ‘ఇష్క్’ మూవీతో భలేగా బౌన్స్ బ్యాక్ అయ్యాడు.
ఆపై గుండెజారి గల్లంతయ్యిందే, అఆ, భీష్మ లాంటి హిట్లు ఇచ్చి ఒక దశ వరకు మంచి స్థాయిలోనే ఉన్నాడు. కానీ ‘భీష్మ’ తర్వాత నితిన్కు హిట్టన్నదే లేదు. అరడజనుకు పైగా ఫ్లాపులు ఇచ్చి ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ను బాగా దెబ్బ తీసుకున్నాడు నితిన్. ముఖ్యంగా గత ఏడాది వచ్చిన ‘తమ్ముడు’ సినిమా పెట్టుబడిలో పావు వంతు కూడా వెనక్కి రాబట్టలేక నితిన్ కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్ అయింది.
దీంతో నితిన్ ఆలోచనలో పడ్డాడు. కొత్త సినిమా విషయంలో తొందరపడలేదు. ముందు అనుకున్న ప్రాజెక్టులను వదిలేశాడు. వేరే సినిమా ఏదీ అనౌన్స్ చేయలేదు.
ఎట్టకేలకు నితిన్ కొత్త సినిమాను మొదలుపెట్టడానికి సిద్ధమయ్యాడు. ఇన్ని ఫ్లాపుల తర్వాత కూడా సితార ఎంటర్టైన్మెంట్స్ లాంటి పేరున్న సంస్థే నితిన్ కొత్త చిత్రాన్ని నిర్మించబోతోంది.
హిట్టు కోసం ఈసారి కొత్త దర్శకులను నమ్ముకున్నాడు నితిన్. అతడి తర్వాతి చిత్రానికి ఇద్దరు దర్శకులు పని చేయబోతుండడం విశేషం. వారి పేర్లు.. సోము-నర్రి. ఈ ఇద్దరూ కలిసి నితిన్ కోసం ఒక యాక్షన్ ఎంటర్టైనర్ కథ రెడీ చేశారు. కొన్ని నెలల నుంచి కథ మీద కసరత్తులు జరుగుతున్నాయి. ఎట్టకేలకు స్క్రిప్టు ఫైనలైజ్ అయింది.
నిర్మాత నాగవంశీ కూడా ఈ మధ్య వరుసగా ఫ్లాపులు ఎదుర్కొన్నాడు. కింగ్డమ్, మాస్ జాతర, ఫంకీ చిత్రాలు ఆయనకు తీవ్ర నిరాశను మిగిల్చాయి. ఇప్పుడు వంశీకి కూడా హిట్టు చాలా అవసరం. ఈ నేపథ్యంలో నితిన్, నాగవంశీ కూడా స్క్రిప్టు విషయంలో జాగ్రత్తగానే వ్యవహరించారని తెలుస్తోంది. బుధవారమే ఈ చిత్రం ప్రారంభోత్సవం జరుపుకోనుంది. ఈ సినిమాలో ఇప్పటిదాకా చూడని కొత్త లుక్లో నితిన్ దర్శనమివ్వబోతున్నాడట.
తెలంగాణపై మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో సోమవారం చేపట్టిన జాతీయ…
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బీజేపీని మరింత బలోపేతం చేసుకునేందుకు ఆ పార్టీ అగ్ర నేతలు ప్రయత్నం చేస్తున్నారా? ప్రాంతీయ పార్టీల…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పురోగతిపై సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ ఆసక్తి కనబరిచారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి…
మాస్ మహారాజా రవితేజ లైనప్ అభిమానుల అంచనాలకు తగ్గట్టు చక్కగా కనిపిస్తోంది. వరస డిజాస్టర్ల సంగతి పక్కనపెడితే ఇరుముడి మీద…
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. రాజస్థాన్ రాజధాని జైపూర్లో నిర్వహించిన…
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎదురు చూస్తున్న అప్డేట్ దేవర 2. మొదటి భాగం వచ్చి రెండేళ్లు దాటిపోతున్నా ఇప్పటికీ సీక్వెల్…