Political News

ర‌ఘురామ‌కు కోర్టు గ్రీన్ సిగ్న‌ల్‌…

టీడీపీ ఎమ్మెల్యే, అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు త‌ల‌పెట్టి రామాయ‌ల‌ నిర్మాణానికి సంబంధించిన ఇక్క‌ట్లు దాదాపు తొలిగిపోయాయి. ఆయ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం ఉండిలోని ఆకివీడు మండ‌లంలో ఉన్న పెద‌పేట‌లో పురాత‌న రామాల‌యాన్ని పున‌ర్నించేందుకు ర‌ఘురామ న‌డుం బిగించారు. అయితే.. ఈ ప్రాంతంలోని ఎస్సీలు దీనిని వ్య‌తిరేకించారు. ఇక్క‌డ తాము గొంతేన‌మ్మ ఆల‌యాన్ని నిర్మించుకున్నామ‌ని.. పూజ‌లు కూడా చేస్తున్నామ‌ని పేర్కొన్నారు.

ఇది తీవ్ర వివాదానికి దారి తీసింది. అయితే.. అస‌లు క్రిస్టియానిటీ తీసుకున్న వారు ద‌ళితులు కారంటూ ర‌ఘురామ ప్ర‌త్యేక వాద‌న తెర‌మీదికి తీసుకురావ‌డం.. ప‌ట్టుద‌ల‌తో రామాల‌య నిర్మాణానికి పూనుకోవ‌డం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే రెండు రోజుల కిందట స‌తీసమేతంగా ఆల‌య నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ కూడా చేశారు. అయితే.. దీనిని వ్య‌తిరేకిస్తూ.. కొంద‌రు ఎస్సీ సంఘాల నాయ‌కులు, ఓ న్యాయ‌వాది కూడా హైకోర్టును ఆశ్ర‌యించారు.

దీనిని విచార‌ణ‌కు స్వీక‌రించిన హైకోర్టు.. అస‌లు ఆ ప్రాంతంలో రామాల‌యంపై ఎప్ప‌టి నుంచో వివ‌ర‌ణ ఇవ్వాలంటూ.. అధికారుల‌ను ఆదేశించింది. దీంతో సంబంధిత రెవెన్యూ, పంచాయ‌తీ, ర‌హ‌దారులు, భ‌వ‌నాల శాఖ అధికారులు పెద‌పాడులో ఉన్న రామాల‌యం హిస్ట‌రీని త‌వ్వితీసి.. కాయితాలు, ఆధారాలు స‌హా.. తాజాగా మంగ‌ళ‌వారం కోర్టుకు స‌మ‌ర్పించారు. దీనిలో దాదాపు 80 ఏళ్ల కింద‌టే ఇక్క‌డ రామాల‌యం ఉంద‌ని.. అయితే, కాల‌గ‌తిలో అది జీవం కోల్పోయింద‌ని తెలిపారు.

ఈ ఆధారాల‌తో ఏకీభ‌వించిన హైకోర్టు.. ఇక్క‌డ రామాల‌యం నిర్మించుకునేందుకు అనుమ‌తి ఇస్తూ.. పిటిష‌న్‌ను తోసిపుచ్చింది. పురాత‌న కాలం నుంచి రామాల‌యం ఉంద‌న్న ఆధారాలు త‌మ‌ను సంతృప్తి ప‌రిచాయ‌ని హైకోర్టు స్ప‌ష్టం చేసింది. అంతేకాదు.. గొంతేన‌మ్మ అనే ఆల‌యం లేద‌ని.. గ్రామ దేవ‌త మాత్ర‌మేన‌ని అది కూడా.. 20 ఏళ్ల‌కు ముందే ఏర్పాటు కాలేద‌ని ఆధారాలు ఉన్నాయ‌ని పేర్కొంది. ఈ నేప‌థ్యంలో రామాల‌య నిర్మాణానికి అనుమ‌తులు మంజూరు చేసింది. పోలీసులు త‌గిన భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని ఆదేశించింది.

This post was last modified on May 5, 2026 4:44 pm

Share

Recent Posts

పోటీకి సిద్ధంకండి… పొత్తు సంగతి నేను చూసుకుంటాను

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…

2 hours ago

తిరుమలలో ‘రోబోట్‌ డాగ్‌’… వాటి కదలికలపై నిఘా!

తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…

2 hours ago

అప్పట్లో చిరు ఏడాదికి నాలుగు సినిమాలు చేసినా గొడవే

ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్‌ను పక్కన పెడితే.. అల్లు…

9 hours ago

దీపికా విషయంలో సందీప్ వంగానే కరెక్ట్

ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…

10 hours ago

హృద‌య విదార‌కం… టీచ‌ర్ దెబ్బ‌కు ప్రాణం వ‌దిలిన పిల్లాడు

పిల్ల‌ల విష‌యంలో త‌ల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్య‌వ‌హ‌రించాలో చెప్పే ఉదంత‌మిది. విద్యార్థుల‌ను క్ర‌మ‌శిక్ష‌ణ‌లో పెట్టాల‌ని, వారిలో భ‌యం పెంచాల‌ని…

11 hours ago

యాక్సిడెంట్ కేసులో జనసేన ఎంపీ తనయుడు

హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి అనే 26 ఏళ్ల యువతి మృతి చెందిన…

12 hours ago