Movie News

8 వారాల ఓటీటీ నిబంధన.. అసలు భయం ఇదేనా?

సినిమా థియేటర్లలో జనం కనిపించడం లేదనేది ఇప్పుడు ఇండస్ట్రీని వేధిస్తున్న అతిపెద్ద సమస్య. సినిమా బాగుంటే వేరే సంగతి, కానీ టాక్ యావరేజ్ గా ఉంటే ప్రేక్షకులు వారం రోజులు ఆగితే ఓటీటీలోకి వచ్చేస్తుంది కదా అనే ఆలోచనతో ఉంటున్నారు. ఈ పరిస్థితిని మార్చడానికి సినిమా విడుదలైన ఎనిమిది వారాల వరకు ఓటీటీలో రాకూడదనే ప్రతిపాదన గట్టిగా వినిపిస్తోంది. కానీ లేటెస్ట్ గా జరిగిన ప్రొడ్యూసర్స్ గిల్డ్ మీటింగ్‌లో ఈ నిర్ణయంపై పెద్ద బ్యానర్లు సానుకూలంగా లేవనే వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

థియేటర్లకు జనం రావాలంటే గ్యాప్ పెంచక తప్పదని ఒకవైపు అంటున్నా, నిర్మాతలు మాత్రం మరో కోణంలో ఆలోచిస్తున్నారు.
అసలు విషయం ఏంటంటే, ఎనిమిది వారాల గ్యాప్ అంటే అది నిర్మాతల పాలిట రెండు అంచుల కత్తి లాంటిది. ఓటీటీ సంస్థలు సినిమా విడుదలకు ముందే భారీ రేటుకు అగ్రిమెంట్ చేసుకుంటున్నాయి. అయితే ఈ ఒప్పందంలో సినిమా థియేటర్లలోకి వచ్చిన ఎన్ని రోజులకు స్ట్రీమింగ్ అవుతుందనేది కీలకమైన పాయింట్.

ఒకవేళ ఎనిమిది వారాల నిబంధన పెడితే, ఓటీటీ సంస్థలు ఇచ్చే రేటును భారీగా తగ్గించే అవకాశం ఉంది. దీనివల్ల నిర్మాతలకు వచ్చే ఆదాయంలో కోత పడుతుంది. అందుకే ఆర్థిక లాభాలను దృష్టిలో పెట్టుకుని పెద్ద బ్యానర్లు ఈ ప్రతిపాదనకు అంతగా మొగ్గు చూపడం లేదని తెలుస్తోంది. మరోవైపు థియేటర్ల ఖర్చుల భయం కూడా నిర్మాతలను వెంటాడుతోంది. జనాలు కేవలం మొదటి వారం మాత్రమే థియేటర్లకు విపరీతంగా వస్తున్నారు. రెండో వారం నుంచి కలెక్షన్లు డ్రాప్ అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సినిమాను ఎనిమిది వారాల పాటు థియేటర్లలోనే ఉంచాలంటే, స్క్రీన్ రెంట్స్ ఇతర మెయింటెనెన్స్ ఖర్చులు తడిసి మోపెడవుతాయి.

ఆడియన్స్ లేని థియేటర్లలో షోలు రన్ చేయడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుందనేది నిర్మాతల వాదన. అందుకే థియేటర్ రన్ పెంచడం కంటే ఓటీటీ డీల్ ద్వారా త్వరగా సేఫ్ అవ్వడమే బెటర్ అని కొందరు భావిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న గిల్డ్ చర్చల్లో పర్సంటేజీ విధానం గురించి కూడా ప్రస్తావన వచ్చినా, అది మరోసారి వాయిదా పడింది. రెంటల్ సిస్టమ్ వల్లే థియేటర్ల భారం పెరుగుతోందని నిర్మాతలు అంటుంటే, ఎగ్జిబిటర్లు తమ ఇబ్బందులు తాము చెబుతున్నారు. ఈ గొడవల మధ్య అసలు సమస్య అయిన ‘ఓటీటీ గ్యాప్’ పరిష్కారం కావడం లేదు. ప్రేక్షకులు థియేటర్లకు రావాలంటే కంటెంట్ తో పాటు వారికి ఒక పక్కా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ వ్యాపార లెక్కల మధ్య ఈ నిర్ణయం తీసుకోవడం ఇండస్ట్రీకి ఒక పెద్ద సవాలుగా మారింది.

Kumar

Recent Posts

లేటైతే… హైప్ హుళక్కే

ఈ రోజుల్లో చెప్పిన డేటుకు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ అరుదైపోయారు. ఒకప్పుడు ఎంత భారీ చిత్రాలనైనా మూడు…

2 hours ago

జ‌ల‌సంధి తెరిచారు.. ధ‌ర‌లు త‌గ్గాయి.. అయినా క‌ష్టాలే!

గ‌త రెండు మాసాల‌కు పైగా ఇంధ‌న, గ్యాస్ స‌మ‌స్య‌ల‌తో ప్ర‌పంచ దేశాలు ఉక్కిరి బిక్కిరికి గుర‌వుతున్నాయి. చ‌మురు ధ‌ర‌లు పెరిగిపోవ‌డ‌మే…

3 hours ago

‘బ‌లిదానాల‌తో ఏర్ప‌డిన తెలంగాణ‌లో నాయ‌కులు గ‌ద్దెనెక్కారు’

తెలంగాణ‌పై మ‌రోసారి ఏపీ డిప్యూటీ సీఎం జ‌న‌సేన పార్టీ అధినేత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో సోమ‌వారం చేప‌ట్టిన జాతీయ…

5 hours ago

ఆప‌రేష‌న్ టైగ‌ర్‌… బీజేపీ దూకుడు!

దేశ‌వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల్లో బీజేపీని మ‌రింత బ‌లోపేతం చేసుకునేందుకు ఆ పార్టీ అగ్ర నేత‌లు ప్రయత్నం చేస్తున్నారా? ప్రాంతీయ పార్టీల…

5 hours ago

అమరావతిపై ఆరా తీసిన సింగపూర్ ప్రధాని

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పురోగతిపై సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌ ఆసక్తి కనబరిచారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి…

7 hours ago

రవితేజ సేఫ్ గేమ్ ఆడతారా

మాస్ మహారాజా రవితేజ లైనప్ అభిమానుల అంచనాలకు తగ్గట్టు చక్కగా కనిపిస్తోంది. వరస డిజాస్టర్ల సంగతి పక్కనపెడితే ఇరుముడి మీద…

7 hours ago