Movie News

8 వారాల ఓటీటీ నిబంధన.. అసలు భయం ఇదేనా?

సినిమా థియేటర్లలో జనం కనిపించడం లేదనేది ఇప్పుడు ఇండస్ట్రీని వేధిస్తున్న అతిపెద్ద సమస్య. సినిమా బాగుంటే వేరే సంగతి, కానీ టాక్ యావరేజ్ గా ఉంటే ప్రేక్షకులు వారం రోజులు ఆగితే ఓటీటీలోకి వచ్చేస్తుంది కదా అనే ఆలోచనతో ఉంటున్నారు. ఈ పరిస్థితిని మార్చడానికి సినిమా విడుదలైన ఎనిమిది వారాల వరకు ఓటీటీలో రాకూడదనే ప్రతిపాదన గట్టిగా వినిపిస్తోంది. కానీ లేటెస్ట్ గా జరిగిన ప్రొడ్యూసర్స్ గిల్డ్ మీటింగ్‌లో ఈ నిర్ణయంపై పెద్ద బ్యానర్లు సానుకూలంగా లేవనే వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

థియేటర్లకు జనం రావాలంటే గ్యాప్ పెంచక తప్పదని ఒకవైపు అంటున్నా, నిర్మాతలు మాత్రం మరో కోణంలో ఆలోచిస్తున్నారు.
అసలు విషయం ఏంటంటే, ఎనిమిది వారాల గ్యాప్ అంటే అది నిర్మాతల పాలిట రెండు అంచుల కత్తి లాంటిది. ఓటీటీ సంస్థలు సినిమా విడుదలకు ముందే భారీ రేటుకు అగ్రిమెంట్ చేసుకుంటున్నాయి. అయితే ఈ ఒప్పందంలో సినిమా థియేటర్లలోకి వచ్చిన ఎన్ని రోజులకు స్ట్రీమింగ్ అవుతుందనేది కీలకమైన పాయింట్.

ఒకవేళ ఎనిమిది వారాల నిబంధన పెడితే, ఓటీటీ సంస్థలు ఇచ్చే రేటును భారీగా తగ్గించే అవకాశం ఉంది. దీనివల్ల నిర్మాతలకు వచ్చే ఆదాయంలో కోత పడుతుంది. అందుకే ఆర్థిక లాభాలను దృష్టిలో పెట్టుకుని పెద్ద బ్యానర్లు ఈ ప్రతిపాదనకు అంతగా మొగ్గు చూపడం లేదని తెలుస్తోంది. మరోవైపు థియేటర్ల ఖర్చుల భయం కూడా నిర్మాతలను వెంటాడుతోంది. జనాలు కేవలం మొదటి వారం మాత్రమే థియేటర్లకు విపరీతంగా వస్తున్నారు. రెండో వారం నుంచి కలెక్షన్లు డ్రాప్ అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సినిమాను ఎనిమిది వారాల పాటు థియేటర్లలోనే ఉంచాలంటే, స్క్రీన్ రెంట్స్ ఇతర మెయింటెనెన్స్ ఖర్చులు తడిసి మోపెడవుతాయి.

ఆడియన్స్ లేని థియేటర్లలో షోలు రన్ చేయడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుందనేది నిర్మాతల వాదన. అందుకే థియేటర్ రన్ పెంచడం కంటే ఓటీటీ డీల్ ద్వారా త్వరగా సేఫ్ అవ్వడమే బెటర్ అని కొందరు భావిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న గిల్డ్ చర్చల్లో పర్సంటేజీ విధానం గురించి కూడా ప్రస్తావన వచ్చినా, అది మరోసారి వాయిదా పడింది. రెంటల్ సిస్టమ్ వల్లే థియేటర్ల భారం పెరుగుతోందని నిర్మాతలు అంటుంటే, ఎగ్జిబిటర్లు తమ ఇబ్బందులు తాము చెబుతున్నారు. ఈ గొడవల మధ్య అసలు సమస్య అయిన ‘ఓటీటీ గ్యాప్’ పరిష్కారం కావడం లేదు. ప్రేక్షకులు థియేటర్లకు రావాలంటే కంటెంట్ తో పాటు వారికి ఒక పక్కా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ వ్యాపార లెక్కల మధ్య ఈ నిర్ణయం తీసుకోవడం ఇండస్ట్రీకి ఒక పెద్ద సవాలుగా మారింది.

This post was last modified on May 5, 2026 12:54 pm

Share

Recent Posts

అనుప‌మ ఆ రోజు ఏడ్చింది అందుకా?

గ‌త కొన్ని రోజులుగా మ‌ల‌యాళ క‌థానాయిక అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ బ్రేకప్ వ్య‌వ‌హారం సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే.…

1 hour ago

తమిళ ప్రేక్షకుల ప్రేమ ఎందుకు తక్కువంటే

తాజాగా విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ తెలుగులో చూపిస్తున్న జోరు తమిళంలో ప్రదర్శించడం లేదన్నది వాస్తవం. ఓపెనింగ్స్ నెంబర్లు పోల్చుకుని…

1 hour ago

సోష‌ల్ మీడియా ఎటాక్… ఫరియా క‌న్నీళ్లు

జాతిర‌త్నాలు సినిమాతో మంచి గుర్తింపు సంపాదించి, తెలుగులో వ‌రుస‌గా సినిమాలు చేస్తున్న క‌థానాయిక‌.. ఫ‌రియా అబ్దుల్లా. థియేట‌ర్ బ్యాగ్రౌండ్ నుంచి…

4 hours ago

ప‌వ‌న్ ఒక్క ఆలోచ‌న‌… 5 వేల కుటుంబాల క‌ళ్ల‌లో మెరుపులు!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. అట‌వీశాఖ మంత్రిగా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆయ‌న చేసిన ఒకే ఒక్క ఆలోచ‌న.. 5…

4 hours ago

రాహుల్ రాముడైతే… జగ్గారెడ్డి హనుమంతుడు

పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ వీరాభిమాని జగ్గారెడ్డి వ్యవహార శైలి గురించి తెలిసిందే. తన…

5 hours ago

కేటీఆర్ బిడ్డ చదువుకోవడానికి గొప్ప కాలేజీ లేదా

‘‘రేపు నా బిడ్డను డ్రాప్ చేయడానికి అమెరికా వెళ్లాలి...ఇక్కడే చదువుకోవచ్చు కదా అని అడిగితే...అంత గొప్ప కాలేజీలు ఇక్కడ ఎక్కడున్నాయి…

5 hours ago