గత శుక్రవారం జెట్లీ అనే సినిమా రిలీజైంది. అది కమెడియన్ సత్య హీరోగా పరిచయం అయిన సినిమా. అయినా సరే.. దానికి మంచి బజ్ క్రియేట్ అయింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజవుతుందా అని ఒక వర్గం ప్రేక్షకులు ఎదురు చూశారు. కొందరు స్టార్ హీరోల సినిమాలను మించి ఆ సినిమా ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ తీసుకురాగలిగింది. దీనికి కారణం.. సినిమా మొదలైన దగ్గర్నుంచి టీం చేసిన ప్రచారం.
అనౌన్స్మెంట్ దగ్గర్నుంచి రెగ్యులర్గా ఫన్నీ ప్రోమోలు వదులుతూ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించగలిగాడు దర్శకుడు రితేష్ రాణా. మేకింగ్ టైంలో వచ్చిన కొన్ని వీడియోలైతే ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాయి. ఇక ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్లు కూడా భలే సరదాగా సాగాయి. సత్య ముందే రాసుకువచ్చిన ఫన్నీ స్పీచ్లతో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. రితేష్ రాణా, వెన్నెల కిషోర్ లాంటి వాళ్లు కూడా అంతే ఎంటర్టైన్ చేశారు. టీం చేసిన ఇంటర్వ్యూలు కూడా భలే ఎంటర్టైన్ చేశాయి.
ఐతే ప్రోమోల్లో ఎంతో క్రియేటివిటీ చూపించి.. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన టీం.. సినిమాలో మాత్రం ఆ స్థాయి వినోదాన్ని పంచలేకపోయింది. రితేష్ రాణా క్రియేటివిటీలో ఎక్కువగా ప్రోమోలకే వాడేశాడా అన్నట్లుగా సాగింది సినిమా. అక్కడక్కడా కొన్ని సీన్లలో తన సెన్సాఫ్ హ్యూమర్ కనిపించినా.. కొన్ని జోకులు బాగా పేలినా.. ఓవరాల్గా సినిమా నిరాశపరిచింది. ముఖ్యంగా సెకండాఫ్ చప్పగా సాగడంతో ప్రేక్షకులకు నిరాశ తప్పలేదు. గత వారం రిలీజైన మరో సినిమా గాయపడ్డ సింహం కూడా ప్రోమోలతో బాగానే ఆసక్తి రేకెత్తించలిగింది. ట్రంప్ క్యారెక్టర్ను ఏఐలో క్రియేట్ చేసి.. దాంతో కలిసి తరుణ్ భాస్కర్ చేసిన వీడియోలు భలే ఫన్నీగా అనిపించాయి. ఈ సినిమా టీజర్, ట్రైలర్ కూడా బాగా కట్ చేశారు. ప్రమోషన్లు కూడా గట్టిగా జరిగాయి.
సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయింది. చిన్న సినిమాల్లో ఒక సంచలనం అవుతుందేమో అన్నంత హడావుడి కనిపించింది రిలీజ్ ముంగిట. తీరా చూస్తే సినిమాలో అంత విషయం లేదు. జెట్లీ స్థాయిలో కూడా ఇందులో కామెడీ పండలేదు. వినోదానికి స్కోప్ ఉన్న కాన్సెప్టే అయినా దర్శకుడు ఉపయోగించుకోలేదు. ఈ రెండు చిత్రాలూ వీకెండ్ తర్వాత ఏమాత్రం నిలబడే పరిస్థితులు కనిపించడం లేదు. ప్రోమోలు చూస్తే ఆహా ఓహో అన్నట్లుంటే.. సినిమాల్లో ఏమో సరిపడా విషయం లేక టాలీవుడ్ బాక్సాఫీస్లో మరో వీకెండ్ నిరాశే మిగిల్చింది.
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…