గత శుక్రవారం జెట్లీ అనే సినిమా రిలీజైంది. అది కమెడియన్ సత్య హీరోగా పరిచయం అయిన సినిమా. అయినా సరే.. దానికి మంచి బజ్ క్రియేట్ అయింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజవుతుందా అని ఒక వర్గం ప్రేక్షకులు ఎదురు చూశారు. కొందరు స్టార్ హీరోల సినిమాలను మించి ఆ సినిమా ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ తీసుకురాగలిగింది. దీనికి కారణం.. సినిమా మొదలైన దగ్గర్నుంచి టీం చేసిన ప్రచారం.
అనౌన్స్మెంట్ దగ్గర్నుంచి రెగ్యులర్గా ఫన్నీ ప్రోమోలు వదులుతూ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించగలిగాడు దర్శకుడు రితేష్ రాణా. మేకింగ్ టైంలో వచ్చిన కొన్ని వీడియోలైతే ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాయి. ఇక ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్లు కూడా భలే సరదాగా సాగాయి. సత్య ముందే రాసుకువచ్చిన ఫన్నీ స్పీచ్లతో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. రితేష్ రాణా, వెన్నెల కిషోర్ లాంటి వాళ్లు కూడా అంతే ఎంటర్టైన్ చేశారు. టీం చేసిన ఇంటర్వ్యూలు కూడా భలే ఎంటర్టైన్ చేశాయి.
ఐతే ప్రోమోల్లో ఎంతో క్రియేటివిటీ చూపించి.. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన టీం.. సినిమాలో మాత్రం ఆ స్థాయి వినోదాన్ని పంచలేకపోయింది. రితేష్ రాణా క్రియేటివిటీలో ఎక్కువగా ప్రోమోలకే వాడేశాడా అన్నట్లుగా సాగింది సినిమా. అక్కడక్కడా కొన్ని సీన్లలో తన సెన్సాఫ్ హ్యూమర్ కనిపించినా.. కొన్ని జోకులు బాగా పేలినా.. ఓవరాల్గా సినిమా నిరాశపరిచింది. ముఖ్యంగా సెకండాఫ్ చప్పగా సాగడంతో ప్రేక్షకులకు నిరాశ తప్పలేదు. గత వారం రిలీజైన మరో సినిమా గాయపడ్డ సింహం కూడా ప్రోమోలతో బాగానే ఆసక్తి రేకెత్తించలిగింది. ట్రంప్ క్యారెక్టర్ను ఏఐలో క్రియేట్ చేసి.. దాంతో కలిసి తరుణ్ భాస్కర్ చేసిన వీడియోలు భలే ఫన్నీగా అనిపించాయి. ఈ సినిమా టీజర్, ట్రైలర్ కూడా బాగా కట్ చేశారు. ప్రమోషన్లు కూడా గట్టిగా జరిగాయి.
సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయింది. చిన్న సినిమాల్లో ఒక సంచలనం అవుతుందేమో అన్నంత హడావుడి కనిపించింది రిలీజ్ ముంగిట. తీరా చూస్తే సినిమాలో అంత విషయం లేదు. జెట్లీ స్థాయిలో కూడా ఇందులో కామెడీ పండలేదు. వినోదానికి స్కోప్ ఉన్న కాన్సెప్టే అయినా దర్శకుడు ఉపయోగించుకోలేదు. ఈ రెండు చిత్రాలూ వీకెండ్ తర్వాత ఏమాత్రం నిలబడే పరిస్థితులు కనిపించడం లేదు. ప్రోమోలు చూస్తే ఆహా ఓహో అన్నట్లుంటే.. సినిమాల్లో ఏమో సరిపడా విషయం లేక టాలీవుడ్ బాక్సాఫీస్లో మరో వీకెండ్ నిరాశే మిగిల్చింది.
కోలీవుడ్ లో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకోనుంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చివరి సినిమాగా చెప్పబడుతున్న జన నాయగన్…
రెండేళ్ల ముందు ఐపీఎల్ వేలంలో ఏకంగా రూ.27 కోట్లతో లక్నో సూపర్ జెయింట్స్ టీం సొంతమైన ఆటగాడు రిషబ్ పంత్.…
ఏపీ సీఎం చంద్రబాబు.. గత వారం రోజులుగా మహానాడు నిర్వహణపై దృష్టి పెట్టారు. ఇదేసమయంలో పాలన పరంగా కూడా సమీక్షలు..…
మహేష్ బాబు ఫ్లాప్ సినిమాలు సైతం రీ రిలీజ్ లోనూ రికార్డులు సృష్టించడం చూశాం. ముఖ్యంగా ఖలేజాని చూసుకుంటే దానికొచ్చిన…
వైసీపీ అధినేత జగన్ ఆవేదన చెందుతున్నారా ? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాలు.. పార్టీని…
తెలుగులో మంచి అభిరుచి ఉన్న దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడి ఒకరు. తొలి సినిమా ‘గమ్యం’తో మొత్తం ఇండస్ట్రీ దృష్టిని అతను…