సరిగ్గా ఇంకో ముప్పై రోజుల్లో పెద్ది ప్రీమియర్ డే వచ్చేస్తుంది. నిర్మాత వెంకట సతీష్ కిలారు ప్రకటించిన దాని ప్రకారం ముందు రోజు జూన్ 3 సాయంత్రం ప్రపంచవ్యాప్తంగా బెనిఫిట్ షోలు వేయబోతున్నారు. హిందీలో కూడా అదే సమయంలో స్క్రీనింగ్ చేసేందుకు ఉత్తరాదిలో పంపిణి చేస్తున్న జియో స్టూడియోస్ సుముఖంగా ఉండటంతో దానికి సంబంధించిన సాధ్యాసాధ్యాలు బేరీజు వేసుకునే పనిలో నిర్మాతలున్నారు. దురంధర్ తరహాలో వర్కౌట్ అవుతుందనేది ఉత్తరాది బయ్యర్ల ఆలోచన.
ప్రస్తుతం ఊపిరి సలపనంతగా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న దర్శకుడు బుచ్చిబాబు వీలైనంత వేగంగా రెహమాన్ కు ఫైనల్ కాపీ ఇచ్చేసి రీ రికార్డింగ్ పూర్తి చేయించాలి. అక్కడితో ఒక పెద్ద బాధ్యత తీరిపోతుంది. ప్రమోషన్ల విషయానికి వస్తే కనీసం నాలుగు ప్రధాన నగరాల్లో ఈవెంట్స్ చేయాలనేది ప్రాథమికంగా ఉన్న ఆలోచన. హైదరాబాద్ తో పాటు కోచి, చెన్నై, బెంగళూరు, ముంబైలో వేడుకలు చేయడం ద్వారా నేషనల్ లెవెల్ బజ్ పెంచాలనేది అసలు ప్లాన్.
పెద్ది పట్ల బయ్యర్ వర్గాల ఎగ్జైట్ మెంట్ చాలా పెద్ద స్థాయిలో ఉంది. మూడు నెలల నుంచి హౌస్ ఫుల్స్ లేక థియేటర్లు పెడుతున్న ఆకలి కేకలు మాములుగా లేవు. అవన్నీ పెద్ది తీరుస్తుందనే నమ్మకంతో ఎదురు చూస్తున్నారు. పుష్ప 2 రేంజ్ లో రేట్లు పలుకుతున్నా ఎవరు వెనుకడుగు వేయడం లేదని ట్రేడ్ టాక్. ముఖ్యంగా సీడెడ్, గోదావరి జిల్లాల సైడ్ నుంచి వస్తున్న ధరల గురించి వింటే కలెక్షన్ల జాతర మాములుగా ఉండబోవడం లేదని అర్థమవుతోంది.
మెగా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ కు రెడీ అవుతున్నారు. ఈ ఏడాది చిరంజీవి సూపర్ హిట్ ఇచ్చినా పవన్ కళ్యాణ్ డిజాస్టర్ వాళ్ళకు నిరాశ కలిగించింది. అందుకే పెద్ది దీన్ని బ్యాలన్స్ చేస్తుందని ఎదురు చూస్తున్నారు. ఫ్యాన్ అసోసియేషన్స్ నుంచి వస్తున్న సమాచారం మేరకు ఈసారి కనివిని ఎరుగని స్థాయిలో పెద్దికి స్వాగతం చెబుతారట. పాజిటివ్ వైబ్స్ విపరీతంగా ఉన్న నేపథ్యంలో ఆ నమ్మకాన్ని కనక బుచ్చిబాబు నిలబెట్టుకుంటే నేరుగా టయర్ 1 డైరెక్టర్ల లిస్టులోకి వెళ్లపోతారు.
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…