ఫాంటసీ, విజువల్ ఎఫెక్ట్స్, వరల్డ్ బిల్డింగ్ లాంటివి లేకుండా ఒక స్పై డ్రామాతో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టొచ్చని నిరూపించిన దర్శకుడు ఆదిత్య ధార్. దురంధర్ గత ఏడాది డిసెంబర్ లో రిలీజైనప్పుడు అసలిది ఆడుతుందాని సవాలక్ష అనుమానాలు కలిగాయి. ముందు రోజు ప్లాన్ చేసిన ప్రీమియర్ షో క్యాన్సిల్ చేయడంతో అవి మరింత బలపడ్డాయి. దీనికి తోడు ట్రైలర్ మీద నెగటివిటీ. కట్ చేస్తే ఎవరూ కలలో కూడా ఊహించని స్థాయిలో దురంధర్ వసూళ్ల భీభత్సం చేసింది.
కేవలం మూడు నెలల గ్యాప్ లో వచ్చిన సెకండ్ పార్ట్ దురంధర్ ది రివెంజ్ నేనేం తీసిపోలేదు అనే రేంజ్ లో ఏకంగా బాహుబలి 2, పుష్ప 2 రికార్డులకు ఎసరు పెట్టింది. ఇప్పుడు నెమ్మదించింది కానీ 40 రోజుల తర్వాత కూడా బుక్ మై షోలో ట్రెండింగ్ ఉండటం అనేది మాములు విషయం కాదు. రాజమౌళి, సుకుమార్, ప్రశాంత్ నీల్ తర్వాత అంత ప్రామిసింగ్ డైరెక్టర్ గా ఆదిత్య ధార్ కేవలం మూడు సినిమాలతోనే పేరు తెచ్చుకున్నాడు.
ఇప్పుడు అందరి చూపు తన నెక్స్ట్ మూవీ ఎవరితో చేస్తాడనే దాని మీద ఉంది. ముంబై మీడియా ప్రకారం ఆదిత్య ధార్ ప్రస్తుతం ఒక లైన్ డెవలప్ చేసే పనిలో ఉన్నాడు. వచ్చే ఏడాది 2027 మార్చి నుంచి షూటింగ్ మొదలుపెట్టేలా ప్రణాళిక వేసుకుంటున్నారట. టాలీవుడ్ ఫ్యాన్స్ ఊహించుకుంటున్నట్టు అది రామ్ చరణ్, అల్లు అర్జున్ లేదా ప్రభాస్ తోనో కాదు. తనను రెండుసార్లు నమ్మిన రణ్వీర్ సింగ్ కే ఓటు వేయొచ్చని అంటున్నారు. స్క్రిప్ట్ లాకయ్యాకే క్యాస్టింగ్ తెలుస్తుంది.
ఏ టైంలో స్టార్ట్ అవుతుందనేది పక్కనపెడితే అనౌన్స్ మెంట్ స్టేజి నుంచే దాని మీద అంచనాలు పెరిగిపోవడం ఖాయం. ఆదిత్య ధార్ కోసం ఇండియా వైడ్ టాప్ స్టార్స్ అందరూ ఎప్పుడెప్పుడు పని చేద్దామాని ఎదురు చూస్తున్నారు. కానీ అతను అంత ఈజీగా దొరికిపోయి రకం కాదు. యురి ది సర్జికల్ స్ట్రైక్, దురంధర్, దురంధర్ ది రివెంజ్ తర్వాత సినిమా అంటే ఆ మూడింటిని మించి ఉండాలి. సబ్జెక్ట్, స్కేల్, బడ్జెట్ ఏదైనా సరే. ఆదిత్య ధార్ టార్గెట్ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే.
This post was last modified on April 28, 2026 9:08 pm
ఆర్ఎక్స్ 100 మూవీతో టాలీవుడ్లోకి మెరుపులా దూసుకొచ్చింది ఉత్తరాది అమ్మాయి పాయల్ రాజ్పుత్. ఆ సినిమానే కాదు.. అందులో పాయల్…
ఇంకో మూడు రోజుల్లో రెండు కొత్త తెలుగు స్ట్రెయిట్ సినిమాలు రిలీజవుతున్నాయి. బాక్సాఫీస్ దగ్గర సందడి లేక టికెట్ కౌంటర్లు…
అక్కినేని నాగార్జున ఆల్రెడీ షూటింగ్ లో ఉన్న తన వందో సినిమా కోసం పెద్ద కసరత్తే చేస్తున్నారు. తమిళ దర్శకుడు…
అదేదో నిన్నా మొన్నా చూసినట్టు ఉంది మహేష్ బాబు అభిమానులకు. సరిగ్గా ఇరవై సంవత్సరాల క్రితం ఏప్రిల్ 28 బాక్సాఫీస్…
ఏపీకి చంద్రబాబు సీఎంగా ఉండడం.. ఇక్కడి ప్రజలు చేసుకున్న అదృష్టమని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కొనియాడారు.…
విశాఖపట్నం కీర్తి .. విశ్వఖ్యాతికి చేరింది. ఇక్కడ ఏర్పాటు చేయనున్న ప్రతిష్టాత్మక గూగుల్ ఏఐ డేటా కేంద్రానికి ఈ రోజు(మంగళవారం)…