ఫాంటసీ, విజువల్ ఎఫెక్ట్స్, వరల్డ్ బిల్డింగ్ లాంటివి లేకుండా ఒక స్పై డ్రామాతో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టొచ్చని నిరూపించిన దర్శకుడు ఆదిత్య ధార్. దురంధర్ గత ఏడాది డిసెంబర్ లో రిలీజైనప్పుడు అసలిది ఆడుతుందాని సవాలక్ష అనుమానాలు కలిగాయి. ముందు రోజు ప్లాన్ చేసిన ప్రీమియర్ షో క్యాన్సిల్ చేయడంతో అవి మరింత బలపడ్డాయి. దీనికి తోడు ట్రైలర్ మీద నెగటివిటీ. కట్ చేస్తే ఎవరూ కలలో కూడా ఊహించని స్థాయిలో దురంధర్ వసూళ్ల భీభత్సం చేసింది.
కేవలం మూడు నెలల గ్యాప్ లో వచ్చిన సెకండ్ పార్ట్ దురంధర్ ది రివెంజ్ నేనేం తీసిపోలేదు అనే రేంజ్ లో ఏకంగా బాహుబలి 2, పుష్ప 2 రికార్డులకు ఎసరు పెట్టింది. ఇప్పుడు నెమ్మదించింది కానీ 40 రోజుల తర్వాత కూడా బుక్ మై షోలో ట్రెండింగ్ ఉండటం అనేది మాములు విషయం కాదు. రాజమౌళి, సుకుమార్, ప్రశాంత్ నీల్ తర్వాత అంత ప్రామిసింగ్ డైరెక్టర్ గా ఆదిత్య ధార్ కేవలం మూడు సినిమాలతోనే పేరు తెచ్చుకున్నాడు.
ఇప్పుడు అందరి చూపు తన నెక్స్ట్ మూవీ ఎవరితో చేస్తాడనే దాని మీద ఉంది. ముంబై మీడియా ప్రకారం ఆదిత్య ధార్ ప్రస్తుతం ఒక లైన్ డెవలప్ చేసే పనిలో ఉన్నాడు. వచ్చే ఏడాది 2027 మార్చి నుంచి షూటింగ్ మొదలుపెట్టేలా ప్రణాళిక వేసుకుంటున్నారట. టాలీవుడ్ ఫ్యాన్స్ ఊహించుకుంటున్నట్టు అది రామ్ చరణ్, అల్లు అర్జున్ లేదా ప్రభాస్ తోనో కాదు. తనను రెండుసార్లు నమ్మిన రణ్వీర్ సింగ్ కే ఓటు వేయొచ్చని అంటున్నారు. స్క్రిప్ట్ లాకయ్యాకే క్యాస్టింగ్ తెలుస్తుంది.
ఏ టైంలో స్టార్ట్ అవుతుందనేది పక్కనపెడితే అనౌన్స్ మెంట్ స్టేజి నుంచే దాని మీద అంచనాలు పెరిగిపోవడం ఖాయం. ఆదిత్య ధార్ కోసం ఇండియా వైడ్ టాప్ స్టార్స్ అందరూ ఎప్పుడెప్పుడు పని చేద్దామాని ఎదురు చూస్తున్నారు. కానీ అతను అంత ఈజీగా దొరికిపోయి రకం కాదు. యురి ది సర్జికల్ స్ట్రైక్, దురంధర్, దురంధర్ ది రివెంజ్ తర్వాత సినిమా అంటే ఆ మూడింటిని మించి ఉండాలి. సబ్జెక్ట్, స్కేల్, బడ్జెట్ ఏదైనా సరే. ఆదిత్య ధార్ టార్గెట్ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే.
This post was last modified on April 28, 2026 9:08 pm
కనకవర్షం కురిపించుకోవడమంటే బాక్సాఫీస్ దగ్గర అదో పెద్ద యుద్ధం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఏది ఎలా ఎప్పుడు ఆడుతుందో ఎవరూ…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్మను…ఆ…ని..చూసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి…
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు, సీజేపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీ ఛార్జ్ ను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ…
నీట్ పేపర్ లీక్ వ్యవహారం నేపథ్యంలో సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ నిరాహార దీక్ష భగ్నం, కాక్రోచ్ జనతా…
టాక్సిక్ నుంచి కొత్త పాట వచ్చింది. ఈసారి యష్ తో తారా సుతారియా రొమాన్స్ చేసింది. తబాహి లాగే ఇందులో…
శాటిలైట్ మార్కెట్ మునుపటిలా లేదు. జూనియర్ ఎన్టీఆర్ దేవరకు ఇప్పటిదాకా ఈ విభాగం హక్కులు అమ్ముడుపోలేదు. ఆ మధ్య ఈటీవీ…