అక్కినేని నాగార్జున ఆల్రెడీ షూటింగ్ లో ఉన్న తన వందో సినిమా కోసం పెద్ద కసరత్తే చేస్తున్నారు. తమిళ దర్శకుడు ఆర్ కార్తీక్ కి ఇంత పెద్ద బాధ్యత ఇవ్వడం అభిమానుల్లో ఆశ్చర్యం, అనుమానం రెండూ కలిగించాయి. ఎందుకంటే అతని ట్రాక్ రికార్డు ఏమంత గొప్పగా లేకపోవడం వల్లే. ఇటీవలే ప్రియాంకా మోహన్ ప్రధాన పాత్ర పోషించిన మేడ్ ఇన్ కొరియా ఈయన డైరెక్షన్ లోనే నేరుగా నెట్ ఫ్లిక్స్ లో ఓటిటి రిలీజ్ జరుపుకుంది. ఆశించిన స్థాయిలో భారీ స్పందన రాలేదు. మిక్స్డ్ టాక్ వచ్చింది.
అలాంటి కార్తీక్ కి నాగార్జున ఛాన్స్ ఇచ్చారంటే విశేషమే. సినిమా పరంగా నాగార్జున మీద ఓ వంద బరువులు ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే కూలీ, కుబేరలో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా చేయడం వల్ల ఆయనకు కెరీర్ పరంగా ఏమి ప్లస్ కాలేదు. పైగా రజనీకాంత్ చేతిలో చనిపోయే పాత్రను ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు. సో వాళ్ళను చల్లార్చాలి. బంగార్రాజు తర్వాత నాగ్ అసలు మాస్ సబ్జెక్టు ట్రై చేయలేదు. ఆ లోటు తీవ్రంగా ఉంది. దాన్ని పూడ్చాలి.
ఇందులో నాగార్జున డిఫరెంట్ టైం ఫ్రేమ్స్ లో కనిపిస్తారని సమాచారం. అంటే పాతికేళ్ల యువకుడి నుంచి యాభై వయసు వచ్చే న్యూ ఏజ్ డాన్ గా పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుందట. గ్యాంబ్లింగ్ కాన్సెప్ట్ అయినప్పటికీ దాన్ని ప్రెజెంట్ చేసిన విధానం షాకింగ్ అనిపిస్తుందని యూనిట్ టాక్. లాటరీ కింగ్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది కానీ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. రిజిస్టర్ చేసి ఉంచారని వినికిడి. త్వరలోనే ప్రకటన ఇచ్చే అవకాశముంది.
నిన్నే పెళ్లాడతా వచ్చిన ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత టబు నాగార్జున సినిమాలో నటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మీద కూడా పెద్ద ఎత్తున అంచనాలున్నాయి. విడుదల గురించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సోగ్గాడే చిన్ని నాయనా సీక్వెల్ కనక 2027 సంక్రాంతికి వచ్చే పనైతే నాగ్ 100 దసరా లేదా దీపావళిని టార్గెట్ చేసుకోవాలి. ఇంకా బోలెడు టైం ఉంది కాబట్టి హడావిడి అవసరం లేదు కానీ ఒక బేసిక్ క్లారిటీ ఉండటం మంచిదే.
This post was last modified on April 28, 2026 6:20 pm
అదేదో నిన్నా మొన్నా చూసినట్టు ఉంది మహేష్ బాబు అభిమానులకు. సరిగ్గా ఇరవై సంవత్సరాల క్రితం ఏప్రిల్ 28 బాక్సాఫీస్…
ఏపీకి చంద్రబాబు సీఎంగా ఉండడం.. ఇక్కడి ప్రజలు చేసుకున్న అదృష్టమని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కొనియాడారు.…
విశాఖపట్నం కీర్తి .. విశ్వఖ్యాతికి చేరింది. ఇక్కడ ఏర్పాటు చేయనున్న ప్రతిష్టాత్మక గూగుల్ ఏఐ డేటా కేంద్రానికి ఈ రోజు(మంగళవారం)…
ఒక బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ అనగానే ప్రేక్షకుల్లో అమితాసక్తి కనిపిస్తుంది. మళ్లీ అలాంటి మ్యాజిక్ను రిపీట్ చేయడం కష్టమే…
దర్శక ధీరుడు రాజమౌళితో సినిమా చేస్తే.. ఆ హీరో ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ అన్నీ ఒక్కసారిగా మారిపోవడం మామూలే. ముఖ్యంగా…
ఒడిశాలో మానవత్వాన్ని కలచివేసే ఘటన వెలుగులోకి వచ్చింది. చనిపోయిన సోదరి ఖాతా నుంచి డబ్బు తీసుకునేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి,…