మే 8 రవిబాబు కొత్త సినిమా రేజర్ విడుదల కానుంది. హీరో దర్శకుడు రెండూ ఆయనే. దీంతో సహజంగా ప్రమోషన్ల భారం కూడా ఒక్కరే మోస్తున్నారు. అల్లరితో హీరో నరేష్ కో ఇంటి పేరు ఇచ్చిన రవిబాబు ఆ తర్వాత అనసూయ, అమరావతి లాంటి థ్రిల్లర్ మూవీస్ ద్వారా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ముఖ్యంగా పూర్ణ లీడ్ రోల్ చేసిన అవును చాలా పాపులారిటీ తెచ్చింది. తర్వాత వరస ఫ్లాపులు రవిబాబుకి కొంత గ్యాప్ వచ్చేలా చేశాయి. ఇప్పుడు రేజర్ తో కంబ్యాక్ అవుతున్నారు.
ఈ సందర్భంగా ఆయన అన్న మాటలు కొన్ని హాట్ టాపిక్ గా మారాయి. మనకున్న హీరోల్లో తొంభై శాతం మంది డూపులతోనే మేనేజ్ చేశారని, అందుకే తన రేజర్ లో మధ్య వయసు ఉన్న పర్ఫెక్ట్ ఛాయస్ కోసం వెతికితే తనలా ఫిజిక్, కష్టపడే తత్వం ఎవరిలో కనిపించకపోవడం వల్లే నేనే హీరోగా చేశానని అన్నారు. నాలా నటించే వాళ్ళు కూడా దొరకలేదు అన్నారు. సరే అందులో కొంత లాజిక్ ఉన్నా పూర్తిగా ఏకీభవించలేని పాయింట్స్ కొన్ని ఉన్నాయి.
హీరోలకు డూప్ వాడటం అనేది ఇప్పటిది కాదు. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ జమానా నుంచి మహేష్ బాబు దాకా అందరూ చేసేదే. కాకపోతే సీన్ డిమాండ్ చేస్తే దాన్ని వద్దని మరీ రిస్క్ తీసుకునే వాళ్ళు కూడా టాలీవుడ్ లో చాలా మంది ఉన్నారు. గూండా ట్రైన్ ఎపిసోడ్ కోసం చిరంజీవి ఎంత రిస్క్ చేశారో ఇప్పటికీ కథలుగా చెబుతారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహెష్ బాబు వీళ్ళందరూ కూడా సందర్భానుసారం డూప్స్ అవసరం లేకుండా కష్టపడిన వాళ్లే.
కాకపోతే ప్రతిసారి డూప్స్ లేకుండా చేయలేరు. ముందైతే దర్శక నిర్మాతలే వద్దంటారు. వందల కోట్ల పెట్టుబడులతో సినిమా తీస్తున్నప్పుడు హీరో ప్రాణాలను రిస్క్ చేయలేరు. డూపులు ప్రొఫెషనల్ గా ట్రైనింగ్ తీసుకుని ఉంటారు కాబట్టి వాళ్ల ప్రాణాలకు ప్రమాదం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ హీరోలు అంత అలవోకగా చేయలేరు కాబట్టి సహాయం అవసరం అవుతుంది. అన్ని చోట్ల టామ్ క్రూజ్ లు ఉండరు కదా. అడ్జస్ట్ అవ్వాల్సిందే.
This post was last modified on April 28, 2026 7:49 pm
ఆర్ఎక్స్ 100 మూవీతో టాలీవుడ్లోకి మెరుపులా దూసుకొచ్చింది ఉత్తరాది అమ్మాయి పాయల్ రాజ్పుత్. ఆ సినిమానే కాదు.. అందులో పాయల్…
ఇంకో మూడు రోజుల్లో రెండు కొత్త తెలుగు స్ట్రెయిట్ సినిమాలు రిలీజవుతున్నాయి. బాక్సాఫీస్ దగ్గర సందడి లేక టికెట్ కౌంటర్లు…
ఫాంటసీ, విజువల్ ఎఫెక్ట్స్, వరల్డ్ బిల్డింగ్ లాంటివి లేకుండా ఒక స్పై డ్రామాతో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టొచ్చని నిరూపించిన…
అక్కినేని నాగార్జున ఆల్రెడీ షూటింగ్ లో ఉన్న తన వందో సినిమా కోసం పెద్ద కసరత్తే చేస్తున్నారు. తమిళ దర్శకుడు…
అదేదో నిన్నా మొన్నా చూసినట్టు ఉంది మహేష్ బాబు అభిమానులకు. సరిగ్గా ఇరవై సంవత్సరాల క్రితం ఏప్రిల్ 28 బాక్సాఫీస్…
ఏపీకి చంద్రబాబు సీఎంగా ఉండడం.. ఇక్కడి ప్రజలు చేసుకున్న అదృష్టమని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కొనియాడారు.…