జాతిరత్నాలు సినిమాతో కథానాయికగా చాలా మంచి పేరు సంపాదించింది హైదరాబాద్ అమ్మాయి ఫరియా అబ్దుల్లా. లోకల్ హీరోయిన్లకు పెద్దగా ప్రాధాన్యం దక్కని తెలుగు సినిమల్లో ఫరియా తన ప్రత్యేకతను చాటుకునే ప్రయత్నం చేస్తోంది. థియేటర్ ఆర్టిస్ట్ అయిన ఆమె.. ఆ తర్వాతు ఇప్పటిదాకా రెండంకెల సంఖ్యలో సినిమాలు చేసింది. ఈ శుక్రవారం రాబోయే రెండు చిత్రాల్లోనూ ఆమెది కీలక పాత్ర.
గాయపడ్డ సింహం సినిమాలో ఓ కీలక పాత్ర చేసిన ఆమె.. జెట్లీ మూవీలో కథానాయిక పాత్రకు గాత్రదానం చేసింది. మే ఫస్ట్ వీకెండ్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న ఫరియా.. మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో తన కుటుంబం గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది ఫరియా. ఫరియా అబ్దుల్లా అనే పేరు వినగానే ఆమె ముస్లిం అని అర్థమవుతుంది.
కానీ ఫరియా తండ్రి పుట్టుకతో ముస్లిం కాదట. ఆయన హిందూ కుటుంబంలోనే పుట్టారట. కానీ 30 ఏళ్ల వయసులో ఇస్లాం మతం ఆయన దృష్టిని ఆకర్షించిందని.. అందులోని ప్రశాంతత, పద్ధతులు, దైవచింతన.. ఇతర అంశాలు నచ్చి ఇస్లాం మతాన్ని స్వీకరించారట ఫరియా తండ్రి. ఇంకో విశేషం ఏంటంటే.. ఫరియా తల్లి సైతం ఇలాగే మతం మారిందట.
కానీ ఫరియా తండ్రికి ఆమె రివర్సట. స్వతహాగా ఆమె ముస్లిం కాగా.. హిందూ మతం నచ్చి అందులోకి మారిందట. ఆమెకు హిందూ మతంలోని పద్ధతులు, ఆచారాలు, దైవచింతన, ధ్యానం లాంటివి ఎంతో నచ్చి ఇటువైపు వచ్చినట్లు ఫరియా వెల్లడించింది. తమ కుటుంబంలో మతాల మధ్య తేడా ఉండదని.. అన్ని మతాలనూ గౌరవిస్తారని, ప్రేమిస్తారని.. ప్రతి మతంలో ఉన్న మంచినే తీసుకుంటారని ఫరియా చెప్పింది.
మతాల్లోని మంచిని స్వీకరించి, మానవత్వంతో బతకడమే మంచిదనే విషయాన్ని తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నట్లు ఫరియా తెలిపింది. ఒకరితో ప్రేమలో పడి పెళ్లి చేసుకునే క్రమంలో కంఫర్ట్ కోసం భాగస్వామి మతం మారడం చూస్తుంటాం కానీ.. ఇలా పరస్పరం ఒకరి మతంలోకి ఒకరు మారడం మాత్రం అరుదైన విషయమే.
This post was last modified on April 28, 2026 9:35 pm
ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…
సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…
తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…
సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…
వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…
భారతదేశంలోనే వివాహం చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1…