తెలుగు రాష్ట్రాల్లో చాలా సింగల్ స్క్రీన్లు ఈ వారం డార్లింగ్ పుణ్యమాని కాస్త ఊపిరి పీల్చుకున్నాయి. రీ రిలీజుల ట్రెండ్ తగ్గిపోతుందనుకుంటున్న టైంలో ఒక్కసారిగా మళ్ళీ ఊపందుకుంది. గత పది రోజుల నుంచి బాక్సాఫీస్ పరిస్థితి ఏ మాత్రం బాగాలేదు. లాస్ట్ వీక్ వచ్చిన తిమ్మరాజుపల్లి టీవీ, పాపం ప్రతాప్ నాలుగో రోజుకే సెలవు తీసుకోగా బ్యాడ్ బాయ్ కార్తీక్ దారుణంగా పోయింది. మొదటి రెండు సినిమాలు ఎంత ప్రమోషన్లు చేసినా లాభం లేకపోయింది.
తాజాగా వచ్చిన మలయాళ డబ్బింగ్ ‘వాలా 2’కి హైదరాబాద్ లాంటి నగరాలు మినహాయించి బయట ఏమంత ఆశాజనకంగా లేదు. రఘు కుంచె టైటిల్ రోల్ పోషించిన ‘గేదెల రాజు కాకినాడ తాలూకా’ అసలు వచ్చిందనే సంగతే జనాలకు రిజిస్టర్ కాలేదు. ఇంకో రెండు మూడు కొత్త రిలీజుల గురించి మాట్లాడుకోకపోవడమే ఉత్తమం. ఇంత డ్రై వాతావరణంలో హౌస్ ఫుల్స్ కనిపించాయంటే దానికి కారణం డార్లింగే. సంవత్సరాలుగా పెరిగిన వింటేజ్ ఫాలోయింగ్ దీనికి దోహదపడింది.
ఇదే జోరు వీకెండ్ దాకా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిస్టిబ్యూటర్ ఏకంగా తొమ్మిది కోట్లకు పైగా గ్రాస్ వచ్చిందని పోస్టర్లు వేసుకున్నారు కానీ భారీ మొత్తం వచ్చిన మాట వాస్తవమే కానీ అంత నెంబర్ కాదనేది పంపిణివర్గాల మాట. రీ రిలీజ్ వ్యవహారం కాబట్టి వసూళ్ల గురించి మరీ ఎక్కువ బుర్ర బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. అయితే డార్లింగ్ మూడో రోజు కూడా గంటల ప్రకారం బుక్ మై షోలో ట్రెండింగ్ కొనసాగించడం విశేషం,
కాసేపు డార్లింగ్ ముచ్చటని పక్కనపెడితే నిర్మాతలు ఈ పరిణామాలను సీరియస్ గా విశ్లేషించుకోవాలి. మినిమమ్ కంటెంట్ ఇవ్వడంలో వైఫల్యం చెందడం వల్లే కొత్త సినిమాలకు జనం కరువవుతున్నారు. ఇంట్లో తాపీగా చూడాల్సిన వాటికి టికెట్లు కొని మరీ పరుగులు పెడుతున్నారు. ఇంత మంచి వేసవి సీజన్ లో స్టార్ హీరోలు రాకపోవడం, వాయిదాల పర్వంలో మీడియం బడ్జెట్ మూవీస్ కూడా నలిగిపోవడం ఈ పరిస్థితికి కారణం. ఎప్పటికి మేలుకుంటారో చూడాలి.
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…
దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను ఎంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారో తెలిసిందే. ప్రతిసారీ అవార్డులు ప్రకటించినపుడు గ్రహీతల అర్ఙతల…
సౌత్ ఇండియాలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో తమన్ ఒకడు. తెలుగు వరకు చూస్తే కొన్నేళ్ల నుంచి అతనే నంబర్ వన్.…
స్టార్ హీరోలు లేని బాక్సాఫీస్ క్లాష్ మాములుగా అయితే అంత ఆసక్తికరంగా ఉండదు. కానీ జూలై మొదటి మూడో తేదీ…
దురంధర్ ది రివెంజ్ తర్వాత మళ్ళీ ఆ స్థాయి బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న బాలీవుడ్ బాక్సాఫీస్ కు…
అరవింద సమేత వీరరాఘవ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయిక కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.…