తెలుగు రాష్ట్రాల్లో చాలా సింగల్ స్క్రీన్లు ఈ వారం డార్లింగ్ పుణ్యమాని కాస్త ఊపిరి పీల్చుకున్నాయి. రీ రిలీజుల ట్రెండ్ తగ్గిపోతుందనుకుంటున్న టైంలో ఒక్కసారిగా మళ్ళీ ఊపందుకుంది. గత పది రోజుల నుంచి బాక్సాఫీస్ పరిస్థితి ఏ మాత్రం బాగాలేదు. లాస్ట్ వీక్ వచ్చిన తిమ్మరాజుపల్లి టీవీ, పాపం ప్రతాప్ నాలుగో రోజుకే సెలవు తీసుకోగా బ్యాడ్ బాయ్ కార్తీక్ దారుణంగా పోయింది. మొదటి రెండు సినిమాలు ఎంత ప్రమోషన్లు చేసినా లాభం లేకపోయింది.
తాజాగా వచ్చిన మలయాళ డబ్బింగ్ ‘వాలా 2’కి హైదరాబాద్ లాంటి నగరాలు మినహాయించి బయట ఏమంత ఆశాజనకంగా లేదు. రఘు కుంచె టైటిల్ రోల్ పోషించిన ‘గేదెల రాజు కాకినాడ తాలూకా’ అసలు వచ్చిందనే సంగతే జనాలకు రిజిస్టర్ కాలేదు. ఇంకో రెండు మూడు కొత్త రిలీజుల గురించి మాట్లాడుకోకపోవడమే ఉత్తమం. ఇంత డ్రై వాతావరణంలో హౌస్ ఫుల్స్ కనిపించాయంటే దానికి కారణం డార్లింగే. సంవత్సరాలుగా పెరిగిన వింటేజ్ ఫాలోయింగ్ దీనికి దోహదపడింది.
ఇదే జోరు వీకెండ్ దాకా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిస్టిబ్యూటర్ ఏకంగా తొమ్మిది కోట్లకు పైగా గ్రాస్ వచ్చిందని పోస్టర్లు వేసుకున్నారు కానీ భారీ మొత్తం వచ్చిన మాట వాస్తవమే కానీ అంత నెంబర్ కాదనేది పంపిణివర్గాల మాట. రీ రిలీజ్ వ్యవహారం కాబట్టి వసూళ్ల గురించి మరీ ఎక్కువ బుర్ర బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. అయితే డార్లింగ్ మూడో రోజు కూడా గంటల ప్రకారం బుక్ మై షోలో ట్రెండింగ్ కొనసాగించడం విశేషం,
కాసేపు డార్లింగ్ ముచ్చటని పక్కనపెడితే నిర్మాతలు ఈ పరిణామాలను సీరియస్ గా విశ్లేషించుకోవాలి. మినిమమ్ కంటెంట్ ఇవ్వడంలో వైఫల్యం చెందడం వల్లే కొత్త సినిమాలకు జనం కరువవుతున్నారు. ఇంట్లో తాపీగా చూడాల్సిన వాటికి టికెట్లు కొని మరీ పరుగులు పెడుతున్నారు. ఇంత మంచి వేసవి సీజన్ లో స్టార్ హీరోలు రాకపోవడం, వాయిదాల పర్వంలో మీడియం బడ్జెట్ మూవీస్ కూడా నలిగిపోవడం ఈ పరిస్థితికి కారణం. ఎప్పటికి మేలుకుంటారో చూడాలి.
This post was last modified on April 25, 2026 4:50 pm
సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…
తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…
సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…
వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…
భారతదేశంలోనే వివాహం చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1…
వేణుంబాక విజయసాయిరెడ్డి… వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ అధినేత జగన్ కు నమ్మినబంటు. పార్టీలో జగన్ తర్వాత నంబర్…