విజువల్ ఎఫెక్ట్స్, సూపర్ హీరోస్, విచిత్ర జంతువులు ఇవేవీ లేకుండా ఒక హాలీవుడ్ మూవీకి ఇండియాలో బజ్ రావడం ఒక్క మైఖేల్ విషయంలోనే జరిగిందని చెప్పాలి. సోషల్ మీడియాని గమనిస్తే ఈ సినిమా మీద ఎంత బజ్ ఉందో అర్థమవుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ సినీ ప్రియులు ప్రీమియర్లను దాదాపు హౌస్ ఫుల్ చేసేశారు. తెలుగు డబ్బింగ్ లేకుండా సింగల్ లాంగ్వేజ్ లో వచ్చిన ఇంగ్లీష్ చిత్రానికి ఈ స్థాయి స్పందన ట్రేడ్ ముందుగా అయితే ఊహించలేదు.
తీరా చూస్తే మైఖేల్ యునానిమస్ అనిపించుకోలేకపోయింది. డాన్సింగ్ ఐకాన్ జీవితాన్ని పూర్తిగా ఆవిష్కరించలేదని, 2028లో విడుదల కాబోయే రెండో భాగం కోసం ముఖ్యమైన ఘట్టాలను దాచి పెట్టారని ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. తండ్రి కఠిన మనస్తత్వాన్ని భరించలేక ఆయన బ్యాండ్ నుంచి బయటికి వచ్చిన మైఖేల్ పెద్ద స్థాయికి ఎలా చేరుకున్నాడనే పాయింట్ మీద దర్శకుడు ఆంటోనీ ఫుక్వా ఈ బయోపిక్ రూపొందించారు. ఎంజె మేనల్లుడు జాఫర్ జాక్సన్ జీవించేశాడు.
మైఖేల్ విషయంలో ప్రధానంగా వినిపించిన కంప్లయింట్ ఆయన జీవితంలోని చీకటి కోణాలు, వివాదాలను టచ్ చేయకపోవడమే. చాలా సేఫ్ గా, కేవలం పాజిటివ్ అంశాలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వడం క్రిటిక్స్ కి నచ్చలేదు. ఎమోషన్స్ ని సరిగా పండించలేకపోవడంతో సినిమాలో అధిక భాగం డాక్యుమెంటరీ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. వీరాభిమానులకు ఓకే కానీ కామన్ ఆడియన్స్ పెదవి విరిచే అవకాశాలు ఎక్కువగా ఇచ్చాడు మైఖేల్.
ఏపీ తెలంగాణ వరకు చూసుకుంటే మైఖేల్ ప్రభావం మల్టీప్లెక్సుల్లోనే కనిపిస్తోంది. ఒకవేళ తెలుగు డబ్ చేసి ఉంటే సింగల్ స్క్రీన్లకు ఫీడింగ్ దొరికేదేమో కానీ సోల్ పోకూడదన్న ఉద్దేశంతో నిర్మాతలు ఒరిజినల్ వెర్షన్ కు కట్టుబడటం ఒకరకంగా మైనస్ అనే చెప్పాలి. మైఖేల్ జాక్సన్ వ్యక్తిగత జీవితం లోతులోకి వెళ్ళకపోవడం ప్రతికూలంగా పని చేసింది. మనం మహానటిలో సావిత్రి గారి జీవితాన్ని ఉన్నది ఉన్నట్టు చూపించినట్టుగా మైఖేల్ లైఫ్ ని సదరు మేకర్స్ ఆవిష్కరించలేకపోయారు.
This post was last modified on April 25, 2026 4:45 pm
సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…
తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…
సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…
వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…
భారతదేశంలోనే వివాహం చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1…
వేణుంబాక విజయసాయిరెడ్డి… వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ అధినేత జగన్ కు నమ్మినబంటు. పార్టీలో జగన్ తర్వాత నంబర్…