వారణాసి విడుదలకు ఇంకా ఏడాది సమయం ఉన్నప్పటికీ ఈ సినిమా ఏదో ఒక రూపంలో పబ్లిసిటీ అయ్యేలా రాజమౌళి ప్లానింగ్ చేస్తూనే ఉన్నారు. తాజాగా మెక్సికోలో జరుగుతున్న సిసిఎక్స్పి ఈవెంట్ లో షూటింగ్, మేకింగ్ తాలూకు క్లిప్స్ ప్రదర్శించడంతో పాటు రాజమౌళి మాట్లాడిన వీడియోని చూపించారు. అంతే కాదు ఎస్ఎస్ కార్తికేయ ప్రత్యక్షంగా అక్కడ హాజరై ఈ వ్యవహారాలన్నీ చూసుకోవడమే కాక ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే బాధ్యత తీసుకున్నారు.
నిజానికీ టైంలో ఇది అవసరం లేదు. కానీ ఇంటర్నేషనల్ లెవెల్ లో వారణాసిని లైమ్ లైట్ లో పెట్టాలని చూస్తున్న రాజమౌళి ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. ఇప్పటిదాకా ఈ ప్యాన్ వరల్డ్ మూవీకి సంబంధించి ఒకే కంటెంట్ వచ్చింది. అది కూడా కాన్సెప్ట్ టీజర్. నిజంగా సినిమాలో ఉన్న విజువల్స్ కావవి. మహేష్ బాబు కనిపించే షాట్ తప్ప మిగిలినదంతా కథని ప్రపంచానికి పరిచయం చేయడం కోసం రా ఫుటేజ్ నుంచి కంటెంట్ కట్ చేశారు.
అసలు ఇంత అడ్వాన్స్ గా జక్కన్న ఎందుకు ఉన్నారనే ప్రశ్న మూవీ లవర్స్ లో తలెత్తుతోంది. ఇది అర్థం కావాలంటే కొంచెం లోతుగా వెళ్లాల్సి ఉంటుంది. చేతిలో 12 నెలల సమయం కూడా లేదు. ఆల్రెడీ ఏప్రిల్ అయిపోవస్తోంది. నిర్మాతలు వారణాసిని గ్లోబల్ లెవెల్ లో అంతర్జాతీయ సంస్థలతో టై అప్ చేసుకుని అన్ని దేశాల్లో ఒకేసారి రిలీజ్ చేయాలనే ప్లాన్ తో ఉన్నారు. సో విదేశీ మీడియా సంస్థలు దీని గురించి రెగ్యులర్ గా మాట్లాడాలి అంటే గ్లోబల్ వేదికల మీద క్రమం తప్పకుండా కనిపించాలి.
ఎంత మంది చూస్తున్నారు, ఎంత మంది వచ్చారు అనే దాని కన్నా ఎక్కడెక్కడ వారణాసి రీచ్ అయ్యింది, ఏ కంట్రీస్ లో దాని గురించి డిస్కషన్స్ జరుగుతున్నాయనేదే రాజమౌళికి ముఖ్యం. ఎందుకంటే రిలీజ్ డేట్ దగ్గర పడే సమయంలో ఇండియాలో పబ్లిసిటీ చేయడానికే ఒక రెండు నెలలు అవసరం. అలాంటప్పుడు యుఎస్, యుకె లాంటి ప్రధాన దేశాలు మినహా మహేష్ టీమ్ అన్నిచోట్లకు వెళ్ళలేదు. అందుకే ఇప్పటి నుంచే వారణాసిని ఇంత కాన్సన్ ట్రేటెడ్ గా ప్రచారం చేస్తున్నారు.
ఫాం హౌస్లో కేడీ- ఢిల్లీలో మోడీ.. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా.. తెలంగాణలో అభివృద్ధిని ఆపలేరు అని సీఎం రేవంత్…
ఈ నెల 25 నుంచి టీడీపీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇంటింటికీ.. పేరుతో ఓ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు…
రాజమౌళి, మహేష్ బాబుల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న వారణాసి సినిమాలో రామాయణం నేపథ్యంలో ఒక అరగంట యుద్ధ సన్నివేశాలు ఉంటాయని…
జూన్ 19 మా ఇంటి బంగారం విడుదలకు రెడీ అవుతోంది. శాకుంతలం, ఖుషి తర్వాత సమంతకు బాగా గ్యాప్ వచ్చేసింది.…
ఆ పాఠశాలలో సంప్రదాయ విద్యా విధానం లేదు.. సహచర విద్యార్థుల ద్వారానే పాఠాలు నేర్చుకుంటారు… ఈ ప్రత్యేకతలు ఉన్న పాఠశాలను…
తెలుగు సినిమాల్లో సాధారణంగా ఒక సినిమాలో ఐదారు పాటలు ఉంటాయి. కొన్ని చిత్రాల్లో ఒకట్రెండు తగ్గుతుంటాయి. కొన్నింట్లో పెరుగుతుంటాయి. థ్రిల్లర్…