నాయకులు పద్ధతిగా వ్యవహరించాలని.. మర్యాదగా మెలగాలని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు పదే పదే ఎమ్మెల్యేలు, వారి అనుచరులకు కూడా చెబుతున్నారు. అయినప్పటికీ.. చాలా మంది నాయకులు తమకు తోచిన విధంగానే వ్యవహరిస్తున్నారు. తమకు నచ్చినట్టే చేస్తున్నారు. దీంతో అటు తాము వివాదాల్లో చిక్కుకోవడంతోపాటు.. ఇటు పార్టీని ప్రభుత్వాన్ని కూడా వివాదాల్లోకి లాగుతున్నారు. ఇటీవల శ్రీశైలం ఎమ్మెల్యే రాజశేఖర్.. టోల్ గేట్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. దీనిపై స్పందించిన చంద్రబాబు వివాదాల జోలికి వెళ్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు.
అయితే.. ఆయన మాట విన్నారో లేదో.. తెలియదు కానీ.. తాజాగా ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కల్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అనుచరులు హైవేపై వీరంగం వేశారు. హైవే టోల్ గేట్ సిబ్బందిపై దాడి చేసి.. విచక్షణా రహితంగా కొట్టారు. నియోజకవర్గం పరిధిలోని వాల్మీకిపురం మండలం గండబోయినపల్లె టోల్ ప్లాజా వద్ద రుసుము కోసం సిబ్బంది కారును ఆపారు. అయితే.. ఎమ్మెల్యే అనుచరులు వెంటనే కారు దిగి.. మహిళ సిబ్బంది, మేనేజర్ రవి పై దాడికి పాల్పడ్డారు.
మహిళలు అని చూడకుండా మహిళా సిబ్బంది జుట్టు పట్టుకొని కొట్టుకుంటూ వెళ్లారు. మరొకరు బండ బూతులు తిడుతూ.. కాలితో తంతూ.. సిబ్బందిపై వీరత్వం ప్రదర్శించారు. “ మేము అధికారంలో ఉండే ఎమ్మెల్యే బండి ని ఆపుతారా“ అంటూ దూషణల పర్వం కొనసాగించారు. అక్కడ పనిచేసే శ్రీలత, మేనేజర్ రవిపై దాడికి పాల్పడ్డారు. రవిని తీవ్రంగా కొట్టడమే కాకుండా బెదిరింపులకు పాల్పడ్డారు. అనంతరం అతని కాలర్ పట్టుకుని లాక్కుంటూ తీసుకువెళ్లి కార్ లో ఎక్కించుకున్నారు. దీంతో ఇతర సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. కాగా.. ఈ ఘటన శనివారం ఉదయం జరిగినట్టు రికార్డు పరంగా తెలుస్తోంది.
అనేక వివాదాలు..
అమిలినేని సురేంద్రబాబు గత ఎన్నికల్లో తొలిసారి విజయం దక్కించుకున్నారు. అయితే.. ఆయన చుట్టూ అనేక వివాదాలు తిరుగుతున్నాయి. నియోజకవర్గంలో భూ మాఫియాను పెంచి పోషిస్తున్నారని.. ఇదే నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నేత ఇటీవల పార్టీకి బహిరంగ లేఖ రాయడం చర్చనీయాంశం అయింది. ప్రజలకు సన్నిహితంగా ఉండాలని పార్టీ అధినేత చెబుతున్నారు. కానీ, సురేంద్ర బాబు మాత్రం తన వ్యాపారాలు.. రియల్ ఎస్టేట్ బిజినెస్లో తీరిక లేకుండా ఉన్నారన్న విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం జరిగిన ఘటన సమయంలో ఆయన కారులో కూర్చుని వీక్షించినట్టు సిబ్బంది తెలిపారు.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…