నాయకులు పద్ధతిగా వ్యవహరించాలని.. మర్యాదగా మెలగాలని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు పదే పదే ఎమ్మెల్యేలు, వారి అనుచరులకు కూడా చెబుతున్నారు. అయినప్పటికీ.. చాలా మంది నాయకులు తమకు తోచిన విధంగానే వ్యవహరిస్తున్నారు. తమకు నచ్చినట్టే చేస్తున్నారు. దీంతో అటు తాము వివాదాల్లో చిక్కుకోవడంతోపాటు.. ఇటు పార్టీని ప్రభుత్వాన్ని కూడా వివాదాల్లోకి లాగుతున్నారు. ఇటీవల శ్రీశైలం ఎమ్మెల్యే రాజశేఖర్.. టోల్ గేట్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. దీనిపై స్పందించిన చంద్రబాబు వివాదాల జోలికి వెళ్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు.
అయితే.. ఆయన మాట విన్నారో లేదో.. తెలియదు కానీ.. తాజాగా ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కల్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అనుచరులు హైవేపై వీరంగం వేశారు. హైవే టోల్ గేట్ సిబ్బందిపై దాడి చేసి.. విచక్షణా రహితంగా కొట్టారు. నియోజకవర్గం పరిధిలోని వాల్మీకిపురం మండలం గండబోయినపల్లె టోల్ ప్లాజా వద్ద రుసుము కోసం సిబ్బంది కారును ఆపారు. అయితే.. ఎమ్మెల్యే అనుచరులు వెంటనే కారు దిగి.. మహిళ సిబ్బంది, మేనేజర్ రవి పై దాడికి పాల్పడ్డారు.
మహిళలు అని చూడకుండా మహిళా సిబ్బంది జుట్టు పట్టుకొని కొట్టుకుంటూ వెళ్లారు. మరొకరు బండ బూతులు తిడుతూ.. కాలితో తంతూ.. సిబ్బందిపై వీరత్వం ప్రదర్శించారు. “ మేము అధికారంలో ఉండే ఎమ్మెల్యే బండి ని ఆపుతారా“ అంటూ దూషణల పర్వం కొనసాగించారు. అక్కడ పనిచేసే శ్రీలత, మేనేజర్ రవిపై దాడికి పాల్పడ్డారు. రవిని తీవ్రంగా కొట్టడమే కాకుండా బెదిరింపులకు పాల్పడ్డారు. అనంతరం అతని కాలర్ పట్టుకుని లాక్కుంటూ తీసుకువెళ్లి కార్ లో ఎక్కించుకున్నారు. దీంతో ఇతర సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. కాగా.. ఈ ఘటన శనివారం ఉదయం జరిగినట్టు రికార్డు పరంగా తెలుస్తోంది.
అనేక వివాదాలు..
అమిలినేని సురేంద్రబాబు గత ఎన్నికల్లో తొలిసారి విజయం దక్కించుకున్నారు. అయితే.. ఆయన చుట్టూ అనేక వివాదాలు తిరుగుతున్నాయి. నియోజకవర్గంలో భూ మాఫియాను పెంచి పోషిస్తున్నారని.. ఇదే నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నేత ఇటీవల పార్టీకి బహిరంగ లేఖ రాయడం చర్చనీయాంశం అయింది. ప్రజలకు సన్నిహితంగా ఉండాలని పార్టీ అధినేత చెబుతున్నారు. కానీ, సురేంద్ర బాబు మాత్రం తన వ్యాపారాలు.. రియల్ ఎస్టేట్ బిజినెస్లో తీరిక లేకుండా ఉన్నారన్న విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం జరిగిన ఘటన సమయంలో ఆయన కారులో కూర్చుని వీక్షించినట్టు సిబ్బంది తెలిపారు.
రీ-నీట్ 2026 పరీక్ష నిర్వహణ మరోసారి వివాదాలకు కేంద్రబిందువైంది. గతంలో నీట్ పరీక్షలో అవకతవకలు వెలుగుచూడటంతో రీ-ఎగ్జామ్ నిర్వహించినప్పటికీ, ఈసారి…
ఇవాళ తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పుట్టినరోజు. సీఎం అయ్యాక ఫస్ట్ బర్త్ డే కావడంతో అభిమానుల…
తమిళ సినిమాలో దశాబ్దాల పాటు ఆధిపత్యం చలాయించిన సూపర్ స్టార్లు రజినీకాంత్. కమల్ హాసన్ వ్యక్తిగతంగా మంచి మిత్రులన్న సంగతి…
ఏపీలో ఇప్పుడు కాపు సామాజిక వర్గం కేంద్రంగా రసవత్తర రాజకీయం నడుస్తోంది. నిన్నటికి నిన్న వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు…
మా ఇంటి బంగారం కథ ముందుగా సాయిపల్లవి దగ్గరికి వెళ్లిన సంగతి సమంత స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పాక బయటికి వచ్చింది.…
స్టార్ అన్న గుర్తింపు తెచ్చుకోలేకపోయి ఉండొచ్చు కానీ.. తమిళ, తెలుగు భాషల్లో సీనియర్ నటుడు ఆనంద్కు మంచి గుర్తింపే ఉంది.…