మూడేళ్ల ముందు పాన్ ఇండియ ా స్థాయిలో భారీ అంచనాల మధ్య విడుదలై ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిన బాలీవుడ్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’. అదేమీ బ్యాడ్ మూవీ కాదు. అందులోని భారీతనం.. విజువల్ ఎఫెక్ట్స్.. ముఖ్య పాత్రలు, పెర్ఫామెన్సులు ఆకట్టుకుంటాయి. కానీ సినిమా మీద మరీ ఎక్కువ బడ్జెట్ పెట్టేయడంతో కాస్ట్ ఫెయిల్యూర్గా నిలిచింది. ధర్మ ప్రొడక్షన్స్ అధినేత కరణ్ జోహార్ ఏకంగా రూ.400 కోట్లు పెట్టి సినిమా తీస్తే.. దాదాపు వంద కోట్ల మేర నష్టం వచ్చినట్లు అప్పట్లో ట్రేడ్ పండిట్లు అంచనా వేశారు.
కానీ బడ్జెట్ లెక్కల్ని పక్కన పెట్టి చూస్తే.. బాక్సాఫీస్ దగ్గర ఉన్నంతలో ఆ సినిమా బాగానే ఆడింది. ‘బ్రహ్మాస్త్ర’ చివర్లో పార్ట్-2కు హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దర్శకుడు అయాన్ ముఖర్జీ ఈ చిత్రానికి ఇంకో రెండు సీక్వెల్స్ చేయాలనుకున్నాడు. కానీ పార్ట్-1 కాస్ట్ ఫెయిల్యూర్ కావడంతో తర్వాత సీక్వెల్ కబుర్లు వినిపించలేదు. నిర్మాత కరణ్ జోహార్కు కూడా సీక్వెల్ తీసే ఉద్దేశం లేదని స్పష్టమైంది.
కానీ ఇప్పుడు వేరే నిర్మాత.. బ్రహ్మాస్త్ర ఫ్రాంఛైజీని ముందుకు తీసుకెళ్లడానికి రెడీ అవుతున్నాడు. ఆయనే.. నమిత్ మల్హోత్రా. ‘రామాయణ’ రెండు భాగాల మీద ఏకంగా రూ.4 వేల కోట్ల బడ్జెట్ పెడుతున్న ప్రొడ్యూసర్ ఆయన. ఇది చాలా రిస్కీ ప్రాజెక్టు అని ట్రేడ్ అంచనా వేస్తున్నప్పటికీ.. నమిత్ మాత్రం బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ జరుగుతుందని.. పెట్టుబడి వెనక్కి రావడంతో పాటు లాభాలూ అందుకుంటానని ధీమాగా ఉన్నాడు. ఆయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో ‘బ్రహ్మాస్త్ర’ ఫ్రాంఛైజీలో తర్వాతి భాగాలను తనే ప్రొడ్యూస్ చేస్తానని చెప్పారు. ఇందుకోసం స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతోందని వెల్లడించారు.
‘బ్రహ్మాస్త్ర’లో హీరోగా నటించిన రణబీర్ కపూరే.. ‘రామాయణ’లో రాముడి పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ హీరోతో నమిత్కు మంచి అనుబంధం ఏర్పడిన నేపథ్యంలో తనతో ‘బ్రహ్మాస్త్ర-2’ చేయడానికి రెడీ అయినట్లున్నాడు నమిత్. రణబీర్ చేసిన శివ పాత్ర కేంద్రంగా ‘బ్రహ్మాస్త్ర’లో పార్ట్-1 నడిచింది. పార్ట్-2 శివ తండ్రి పాత్ర దేవ్ ఆధారంగా నడుస్తుంది. తండ్రి పాత్రలోనూ రణబీరే నటిస్తాడా.. లేక తన పాత్రను అలాగే కొనసాగిస్తూ, వేరే నటుడిని ఈ క్యారెక్టర్లో చూపిస్తారా అన్నది ఆసక్తికరం.
This post was last modified on April 17, 2026 6:09 am
కొన్ని సినిమాలు థియేటర్లలో ఆశించిన ఫలితాలు అందుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ సంపాదిస్తాయి. టీవీల్లో, ఆన్ లైన్లో గొప్ప ఆదరణ…
దేశవ్యాప్తంగా పార్లమెంటు నియోజకవర్గాలను పునర్విభించి .. మహిళలకు రిజర్వేషన్ కల్పించాలన్న కేంద్ర ప్రభుత్వం ఆశలు ప్రస్తుత సమావేశాల్లో నెరవేరేలా కనిపించడం…
తెలంగాణాలో ఎమ్మెల్యేలు, మంత్రులకు తమ కుమారుల ప్రేమ వ్యవహారాలు తలనొప్పిగా మారుతున్నాయి. నిన్నా మొన్నటి వరకు కేంద్ర మంత్రి బండి…
ఇంకా రాకా షూటింగ్ పూర్తి కాలేదు. మూడు నెలలకు పైనే వర్కింగ్ డేస్ అవసరమవుతాయని అంటున్నారు. అందుకే విడుదల తేదీ…
రాష్ట్రంలో వైద్యం ఖరీదైన వస్తువుగా మారిపోయింది. ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ పరీక్షలు, ఇతరత్రా ఖర్చుల పేరుతో ప్రైవేటు ఆసుపత్రులు రోగుల నుంచి…
కన్నడ సినిమాలో అతి పెద్ద స్టార్లలో ఒకడైన దర్శన్.. ఏ బాధలూ లేని జీవితాన్ని, బంగారం లాంటి జీవితాన్ని ఎలా…