పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది లాంటి కల్ట్ మూవీస్ తో ఒక ప్రత్యేక ముద్ర వేసిన దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ మధ్య డైరెక్షన్ కంటే ఎక్కువగా యాక్టింగ్ మీద ఫోకస్ చేస్తూ చెప్పుకోదగ్గ సినిమాలే చేస్తున్నాడు. మిత్రుల సహకారం ఉండటంతో అవకాశాలు బాగానే వస్తున్నాయి. అయితే ప్రేక్షకుల నుంచి కథానాయకుడిగా ఇంకా అంగీకారం దొరకలేదు. ఆ మధ్య వచ్చిన ఓం శాంతి శాంతి శాంతి దారుణంగా ఫెయిలవ్వడమే కాదు కనీస ఓపెనింగ్స్ కి నోచుకోలేదు.
మే ఒకటిన గాయపడ్డ సింహంగా మరోసారి సోలో హీరో అవతారం ఎత్తాడు తరుణ్ భాస్కర్. పెద్ది ఎలాగూ వాయిదా పడుతుందన్న ధీమాతో రిలీజ్ డేట్ లాక్ చేసుకోవడం బిజినెస్ పరంగా చాలా ప్లస్ అవుతోంది. థియేటర్ల అగ్రిమెంట్లు జరిగిపోతున్నాయి. అయిదు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగుతున్న ఈ సింహంకి ఓటిటి, డిజిటల్ రూపంలో పది కోట్ల దాకా ఆదాయం వచ్చినట్టు ఫిలిం నగర్ టాక్. ఇది నిజమైన పక్షంలో నిర్మాత సేఫ్ గా ఉండటంతో పాటు లాభాలు అందుకున్నట్టే.
నటనని ఇంత సీరియస్ గా తీసుకున్న తరుణ్ భాస్కర్ కు గాయపడ్డ సింహం రూపంలో గతంలో తగిలిన గాయాలకు మందు దొరకాలి. ఎందుకంటే సరైన బ్రేక్ దక్కితే మరిన్ని ఆఫర్లు వస్తాయి. ఈ సినిమాకు లక్కు కూడా కలిసి వస్తోంది. ముందు వెనుక చెప్పుకోదగ్గ పోటీ లేదు. సమంత మా ఇంటి బంగారం, సితార బ్యానర్ వీసాలు ట్రై చేశాయి కానీ సమయం సరిపోకపోవడంతో వస్తాయా రావా అనే సందిగ్ధత నెలకొంది. స్వయంభు సైతం పోస్ట్ ప్రొడక్షన్ ఇష్యూస్ వల్ల పెద్ది డేట్ తీసుకోలేకపోయింది.
ఇన్ని సానుకూలతల మధ్య గాయపడ్డ సింహం ఎలా పెర్ఫార్మ్ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ డార్క్ కామెడీ డ్రామాలో జెడి చక్రవర్తి ఒక ముఖ్య పాత్ర పోషించగా ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించింది. అంచనాల పరంగా మరీ ఎత్తులో లేదు కానీ ఒక క్రమపద్ధతిలో ప్రమోషన్లు చేయడం ద్వారా బజ్ పెంచే ప్లానింగ్ లో ఉన్నారు నిర్మాత పవన్ సాధినేని. తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేస్తున్న ఈ నగరానికి ఏమైంది 2 ప్రస్తుతం విదేశీ షూటింగ్ లో ఉంది.
This post was last modified on April 16, 2026 10:34 pm
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…
బారత ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ... వరుసబెట్టి మూడు పర్యాయాలు దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా దేశానికి అత్యధిక…