ఒక భారీ చిత్రం విడుదలకు చాలా రోజుల ముందే హెచ్డీ ప్రింట్ లీక్ అయిపోవడం గత కొద్ది కాలంలో తొలిసారిగా ‘జననాయగన్’ విషయంలోనే జరిగి ఉండొచ్చు. సినిమా రిలీజ్ రోజు హై క్వాలిటీ పైరసీ ప్రింట్లు బయటికి రావడం చూశాం కానీ.. అసలు విడుదల ఎప్పుడో కూడా తెలియని చిత్రానికి ఇలా జరగడం మాత్రం అనూహ్యం.
దీన్ని బట్టి యూనిట్కు చెందిన వాళ్లే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని అందరూ భావించారు. మరి నిందితులు ఎవరై ఉంటారు అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి అయిదుగురు అనుమానితులను ఇంతకుముందు అరెస్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. వారిలో నిందితులు ఎవరన్న దానిపై పోలీసులు ఒక అంచనాకు వచ్చినట్లు సమాచారం. ‘జననాయగన్’ లీక్ వెనుక ముగ్గురు వ్యక్తులు కీలక పాత్ర పోషించినట్లు వెల్లడైంది. ఆ ముగ్గురినీ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఒక ఫ్రీలాన్స్ అసిస్టెంట్ ఎడిటర్ ‘జననాయగన్’ లీక్ వెనుక సూత్రధారి అని తమిళనాడు సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించారు. ఐతే అతనేమీ ఈ సినిమాకు పని చేయలేదట. ఎడిటింగ్ విభాగంలోని వారితో ఉన్న పరిచయాల ద్వారా ఈ సినిమా ఎడిటింగ్ జరిగే చోటుకు వెళ్లి రహస్యంగా డేటాను చోరీ చేశాడట ఆ వ్యక్తి.
కొంచెం కొంచెంగా డేటా తీసుకుని.. దాన్ని క్లబ్ చేసి మొత్తం సినిమాను ఆన్ లైన్లో లీక్ చేసేశాడట. ఇందులో ఇంకో ఇద్దరు నిందితుల ప్రమేయం కూడా ఉందని పోలీసులు తేల్చారు.
లీక్ విషయంలో విజయ్ అభిమానులు తీవ్ర ఆగ్రహంతో ఉండడం, రాజకీయంగా కూడా ‘జననాయగన్’ అంశం చర్చనీయాంశంగా మారడం..
ఈ నేపథ్యంలో నిందితుల వివరాలను బయటపెడితే వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందనే ఉద్దేశంతో పోలీసులు డీటైల్స్ బయటికి రాకుండా చూస్తున్నట్లు తెలుస్తోంది. ముగ్గురు నిందితులను కోర్టులో ప్రవేశపెట్టగా.. వారికి జడ్జి రిమాండ్ విధించారు. విచారణలో మరిన్ని వివరాలు బయటికి వస్తాయని భావిస్తున్నారు.
This post was last modified on April 16, 2026 6:38 pm
వైఎస్సార్సీపీలో గతంలో పనిచేసిన కీలక నేత, ఇప్పుడు చక్రం తిప్పుతున్న మరో నేత మధ్య నెలకొన్న విభేదాలు క్రమంగా బహిరంగ…
ఇంకో నాలుగు రోజుల్లో రోమాంచకం విడుదల కానుంది. సుమంత్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగ…
ఎప్పుడో ముప్పై ఏళ్ళ క్రితమే హై టెక్ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు ఇప్పటికీ అదే రూట్ లో పరిపాలన…
వైసీపీ నేత బొత్స సత్యనారాయణ, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.…
చాపకింద నీరులా జనసేన విస్తరిస్తుంది. అధికారం కోసం అర్రులు చాచకుండా ఒక ప్రణాళిక ప్రకారం పునాదులు వేసుకుంటూ వస్తుంది. ఆంధ్రప్రదేశ్…
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గాన్ని రెండు దశాబ్దాలకుపైగా తన కనుసన్నలతో శాసించిన మాజీ ఎమ్మెల్యే కొడాలి శ్రీవేంకటేశ్వరరావు..…