గాడ్ ఆఫ్ వార్.. ఏడాది కిందట్నుంచి టాలీవుడ్లో విపరీతంగా చర్చనీయాంశం అవుతున్న ప్రాజెక్టు. ఇప్పటిదాకా ఎక్కువగా ఫ్యామిలీ, మాస్, యాక్షన్ ఎంటర్టైనర్లే తీస్తూ వచ్చిన అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. తొలిసారిగా పాన్ ఇండియా స్థాయిలో చేయాలనుకున్న ఈవెంట్ ఫిలిం ఇది. ముందు అల్లు అర్జున్ హీరోగా ఈ సినిమా చేయాలనుకున్నాడు మాటల మాంత్రికుడు. కానీ ఎందుకో ఇద్దరికీ ఈ ప్రాజెక్టు విషయంలో సమన్వయం కుదరలేదు.
తర్వాత జూనియర్ ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది. తారక్ కూడా ఈ సినిమా పట్ల ఆసక్తితో ఉన్నట్లే కనిపించాడు. కానీ మళ్లీ జూనియర్ వెనక్కి తగ్గాడని, బన్నీతోనే త్రివిక్రమ్ సినిమా చేయబోతున్నాడని ఒక దశలో ప్రచారం జరిగింది. కానీ అదీ నిజం కాదని తేలింది. చివరికి తారకే ఈ సినిమాలో లీడ్ రోల్ చేస్తాడన్నట్లుగా మాట్లాడుకున్నారు సోషల్ మీడియా జనాలు. ఇటు తారక్, అటు త్రివిక్రమ్ ఫ్యాన్స్.. ఈ కాంబినేషన్కు ఫిక్స్ అయిపోయి ఉన్నారు.
ఐతే ఈ ప్రాజెక్టు ఉంటుందా లేదా అన్నది ఇంకో నెల రోజుల్లో తేలిపోనుంది. మే 20న తారక్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాను అనౌన్స్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఆ రోజు ఎలాగూ తారక్ ప్రెజెంట్ మూవీ ‘డ్రాగన్’ నుంచి అప్డేట్ ఉంటుంది. గత పుట్టిన రోజుకు అభిమానులను మురిపించలేకపోయిన దర్శకుడు ప్రశాంత్ నీల్.. ఈసారి గ్లింప్స్ రెడీ చేస్తున్నట్లు సమాచారం.
దీంతో పాటుగా తారక్ అభిమానులకు డబుల్ ధమాకా ఆనందాన్నిస్తూ ‘గాడ్ ఆఫ్ వార్’ను ప్రకటిస్తారని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. ఒకవేళ ఆ రోజు ఈ సినిమాను ప్రకటించారు అంటే.. త్రివిక్రమ్ ఈ సినిమా చేస్తున్నట్లు. లేదంటే మొత్తంగా ఆ ప్రాజెక్టును పక్కన పెడుతున్నట్లు భావించాలి.
ఇప్పటిదాకా ఇండియన్ సినిమాలో ఎక్కువగా టచ్ చేయని సుబ్రహ్మణ్యస్వామి కథను భారీ స్థాయిలో చెప్పాలన్నది త్రివిక్రమ్ ఆలోచన. ఈ సినిమా అంటూ ఉంటే.. ఆయనకు దాదాపు హోం బేనర్ అనదగ్గ హారిక అండ్ హాసిని క్రియేషన్సే దీన్ని నిర్మిస్తుంది.
తమ భాషను, తమ సంస్కృతిని, తమ సామిత్యాన్ని గౌరవించుకోవడంలో మిగతా వాళ్లతో పోలిస్తే తెలుగు వాళ్లది ఎప్పుడూ వెనుకబాటే అన్న…
ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబుకు కేంద్రంలోని పెద్దలు బిగ్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్డీయే కూటమిని మరింత బలోపేతం…
తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్.. ఇటీవల వరుసగా వివాదాల్లో చిక్కుకుంటోంది. వరలక్ష్మి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘సరస్వతి’ సినిమాకు…
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తన వ్యూహాన్ని దాదాపు తేల్చేశారు. రాజకీయంగా తనకు ఉన్న లక్ష్యాన్ని కూడా వివరించారు. దేశాన్ని…
ఇప్పుడంతా అప్ డేటెడ్ వెర్షన్లే వినిపిస్తున్నాయి. వ్యవహారికంతో పాటుగా పాలిటిక్స్ లోనూ నయా తరం వచ్చేసింది. ఆ ఫలితమే జన్…
మెగా డీఎస్సీ పరీక్షలు జరిగి దాదాపు ఏడాది అవుతోంది. సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరి ఆరు నెలలు దాటిపోయింది.…