గత కొన్నేళ్లలో మలయాళ దర్శకులు బాగా డెవలప్ అయ్యారు. క్రైమ్, హారర్, సస్పెన్స్ ఈ మూడు అంశాలను తీసుకుని వాటికి పోలీస్ ఆఫీసర్ల బ్యాక్ డ్రాప్ జోడించి చాలా సినిమాలు తీశారు. వాటిలో అత్యధిక శాతం హిట్టయినవే. మనోళ్లు కూడా ఓటిటిలో డబ్బింగ్ రూపంలో చూసి ఆహా ఓహో అన్నవాళ్ళే. ఈ సిరీస్ లో ఒక కొత్త మూవీ వచ్చింది. దాని పేరు సంభవం అధ్యాయం ఒన్ను. నేరుగా హాట్ స్టార్ లో రిలీజైన ఈ మూవీకి సోషల్ మీడియాలో చాలా సపోర్ట్ దక్కుతోంది. ఎందుకో చూద్దాం.
అసలీ స్టోరీ పాయింటే క్రేజీగా ఉంటుంది. కేరళ ఆంధ్ర సరిహద్దులో ఉండే ఒక అటవీ ప్రాంతానికి ట్రాన్స్ ఫర్ మీద వెళ్తాడు ఆనంద్. దారిలో ఒక యాక్సిడెంట్ కనిపించి గాయపడిన మరో పోలీసును ఆసుపత్రిలో చేరుస్తాడు. డ్యూటీ చేరే సమయంలో అడవిలో జరిగిన ఒక దాడి గురించి తెలిసి మరో ఇద్దరు ఆఫీసర్లతో కలిసి అక్కడికి చేరుకుంటాడు. కానీ లోపలికి వెళ్లే కొద్దీ ముప్పై సంవత్సరాల వెనుకటి సంఘటనలు, మనుషులు ఎదురవుతారు. అసలు ట్విస్టులు మొదలవుతాయి.
కథని ఇక్కడ చిన్నగా చెప్పినప్పటికీ అసలు కంటెంట్ లో బోలెడు ట్విస్టులు పెట్టారు. టైం లూప్ కాన్సెప్ట్ కొత్తది కాకపోయినా దాన్ని ఒక అడవికి ముడిపెట్టి, కాకి తలతో ఉన్న మనిషి విగ్రహానికి హారర్ ఎలిమెంట్ జోడించి దర్శకుడు జీతూ సతీషన్ మంగళతు కొత్త అనుభూతి కలిగిస్తాడు. ముఖ్యంగా మొదటి అరగంట కాస్త ఓపిగ్గా చూడగలిగితే ఆ తర్వాత స్క్రీన్ ప్లే పరుగులు పెడుతుంది. ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే మలుపులను ఈజీగా గెస్ చేయలేనంత టిపికల్ గా ఉంటాయి.
తెలుగు ఆడియోతో పాటు అందుబాటులో ఉన్న సంభవం అధ్యాయం ఒన్ను ఈ జానర్ సినీ ప్రియులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. కాకపోతే మల్లువుడ్ స్టయిల్ స్లో నెరేషన్ ఇందులోనూ ఉంటుంది. ఆ తరహా కథనం అలవాటు లేకపోతే కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. ఇది మొదటి భాగమే. పార్ట్ 2కి ముఖ్యమైన లీడ్ ఇచ్చి ఆసక్తి పెంచారు. సినిమా చూశాక కలిగే సందేహం ఒకటే. ఇంత క్రేజీ ఐడియాలు మలయాళీ మేకర్స్ కి ఎలా వస్తాయో. ఇలాంటివి థియేటర్ కన్నా డిజిటల్ లోనే బాగా ఆడతాయి.
తమ భాషను, తమ సంస్కృతిని, తమ సామిత్యాన్ని గౌరవించుకోవడంలో మిగతా వాళ్లతో పోలిస్తే తెలుగు వాళ్లది ఎప్పుడూ వెనుకబాటే అన్న…
ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబుకు కేంద్రంలోని పెద్దలు బిగ్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్డీయే కూటమిని మరింత బలోపేతం…
తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్.. ఇటీవల వరుసగా వివాదాల్లో చిక్కుకుంటోంది. వరలక్ష్మి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘సరస్వతి’ సినిమాకు…
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తన వ్యూహాన్ని దాదాపు తేల్చేశారు. రాజకీయంగా తనకు ఉన్న లక్ష్యాన్ని కూడా వివరించారు. దేశాన్ని…
ఇప్పుడంతా అప్ డేటెడ్ వెర్షన్లే వినిపిస్తున్నాయి. వ్యవహారికంతో పాటుగా పాలిటిక్స్ లోనూ నయా తరం వచ్చేసింది. ఆ ఫలితమే జన్…
మెగా డీఎస్సీ పరీక్షలు జరిగి దాదాపు ఏడాది అవుతోంది. సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరి ఆరు నెలలు దాటిపోయింది.…