గత కొన్నేళ్లలో మలయాళ దర్శకులు బాగా డెవలప్ అయ్యారు. క్రైమ్, హారర్, సస్పెన్స్ ఈ మూడు అంశాలను తీసుకుని వాటికి పోలీస్ ఆఫీసర్ల బ్యాక్ డ్రాప్ జోడించి చాలా సినిమాలు తీశారు. వాటిలో అత్యధిక శాతం హిట్టయినవే. మనోళ్లు కూడా ఓటిటిలో డబ్బింగ్ రూపంలో చూసి ఆహా ఓహో అన్నవాళ్ళే. ఈ సిరీస్ లో ఒక కొత్త మూవీ వచ్చింది. దాని పేరు సంభవం అధ్యాయం ఒన్ను. నేరుగా హాట్ స్టార్ లో రిలీజైన ఈ మూవీకి సోషల్ మీడియాలో చాలా సపోర్ట్ దక్కుతోంది. ఎందుకో చూద్దాం.
అసలీ స్టోరీ పాయింటే క్రేజీగా ఉంటుంది. కేరళ ఆంధ్ర సరిహద్దులో ఉండే ఒక అటవీ ప్రాంతానికి ట్రాన్స్ ఫర్ మీద వెళ్తాడు ఆనంద్. దారిలో ఒక యాక్సిడెంట్ కనిపించి గాయపడిన మరో పోలీసును ఆసుపత్రిలో చేరుస్తాడు. డ్యూటీ చేరే సమయంలో అడవిలో జరిగిన ఒక దాడి గురించి తెలిసి మరో ఇద్దరు ఆఫీసర్లతో కలిసి అక్కడికి చేరుకుంటాడు. కానీ లోపలికి వెళ్లే కొద్దీ ముప్పై సంవత్సరాల వెనుకటి సంఘటనలు, మనుషులు ఎదురవుతారు. అసలు ట్విస్టులు మొదలవుతాయి.
కథని ఇక్కడ చిన్నగా చెప్పినప్పటికీ అసలు కంటెంట్ లో బోలెడు ట్విస్టులు పెట్టారు. టైం లూప్ కాన్సెప్ట్ కొత్తది కాకపోయినా దాన్ని ఒక అడవికి ముడిపెట్టి, కాకి తలతో ఉన్న మనిషి విగ్రహానికి హారర్ ఎలిమెంట్ జోడించి దర్శకుడు జీతూ సతీషన్ మంగళతు కొత్త అనుభూతి కలిగిస్తాడు. ముఖ్యంగా మొదటి అరగంట కాస్త ఓపిగ్గా చూడగలిగితే ఆ తర్వాత స్క్రీన్ ప్లే పరుగులు పెడుతుంది. ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే మలుపులను ఈజీగా గెస్ చేయలేనంత టిపికల్ గా ఉంటాయి.
తెలుగు ఆడియోతో పాటు అందుబాటులో ఉన్న సంభవం అధ్యాయం ఒన్ను ఈ జానర్ సినీ ప్రియులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. కాకపోతే మల్లువుడ్ స్టయిల్ స్లో నెరేషన్ ఇందులోనూ ఉంటుంది. ఆ తరహా కథనం అలవాటు లేకపోతే కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. ఇది మొదటి భాగమే. పార్ట్ 2కి ముఖ్యమైన లీడ్ ఇచ్చి ఆసక్తి పెంచారు. సినిమా చూశాక కలిగే సందేహం ఒకటే. ఇంత క్రేజీ ఐడియాలు మలయాళీ మేకర్స్ కి ఎలా వస్తాయో. ఇలాంటివి థియేటర్ కన్నా డిజిటల్ లోనే బాగా ఆడతాయి.
This post was last modified on April 16, 2026 12:22 pm
కూటమిలో భాగస్వామి అయిన జనసేన పార్టీ ఎమ్మెల్యే పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు బాగోలేని…
ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…
సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…
తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…
సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…
వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…