ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి హీరోగా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించాడు కిరణ్ అబ్బవరం. తన సినిమాల రైటింగ్, మేకింగ్లోనూ ఎంతో ఇన్వాల్వ్ అయ్యే కిరణ్.. తనకంటూ ఒక స్థాయి తెచ్చుకోవడం వెనుక తన కష్టం చాలానే ఉంది. ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు వచ్చిన నేపథ్యంలో అతనిప్పుడు నిర్మాతగా మారి బయటి వాళ్లతో సినిమా కూడా చేశాడు. అదే.. తిమ్మరాజుపల్లి టీవీ.
ఇందులో దర్శకుడు, హీరో దగ్గర్నుంచి ప్రతి ఒక్కరూ కొత్త వాళ్లే కావడం విశేషం. ఆర్టిస్టులు, టెక్నీషియన్లు కలిపి ఏకంగా 50 మంది కొత్త వాళ్లను కిరణ్ ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు. ఈ చిత్ర కథానాయకుడు సాయితేజ్ బ్యాగ్రౌండ్ తెలిస్తే కిరణ్ను మెచ్చుకోకుండా ఉండలేం. అతను కిరణ్ నటించిన కొన్ని చిత్రాలకు కెమెరా అసిస్టెంట్గా పని చేశాడు. తనకు నటన మీద ఆసక్తి ఉన్న విషయం తెలుసుకుని, తన ప్రతిభను గుర్తించి ‘తిమ్మరాజుపల్లి టీవీ’ చిత్రంతో హీరోను చేశాడు.
ఇంకా ఎంతోమంది కొత్త వాళ్లకు ఈ సినిమాతో అవకాశం ఇస్తున్నాడు కిరణ్. అంతే కాదు.. ఇందులోని నటీనటులు, టెక్నీషియన్ల కుటుంబ సభ్యులను పిలిచి ప్రసాద్ మల్టీప్లెక్స్లోని బిగ్ స్క్రీన్ మీద స్పెషల్ షో కూడా ఏర్పాటు చేయిస్తున్నాడు కిరణ్. ఈ విషయంలో ఇండస్ట్రీ వర్గాలు కిరణ్ను అభినందిస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా కిరణ్ మీద ప్రశంసలు కురుస్తున్నాయి.
కొత్త దర్శకుడు మునిరాజు రూపొందించిన ఈ చిత్రం ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీని ప్రోమోలు ప్రేక్షకుల దృష్టిని బాగానే ఆకర్షించాయి. 80, 90 దశకాల్లో కొత్తగా పల్లెటూళ్లలోకి టీవీలు వచ్చినప్పటి పరిస్థితులను సరదాగా చూపించే ప్రయత్నమే ‘తిమ్మరాజుపల్లి టీవీ’. మరి కిరణ్ కొత్త వాళ్లతో చేసిన ఈ ప్రయత్నం ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.
This post was last modified on April 15, 2026 7:16 pm
వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని అన్ని విధాలా దోచుకున్న జగన్.. పేదలకు పట్టెడన్నం కూడా పెట్టలేక పోయారని సీఎం చంద్రబాబు విమర్శించారు.…
ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ నాయకులు అదే అక్కసు ప్రదర్శిస్తున్నారు. రాజధానిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. జగన్ ప్రతిపాదించిన…
కనుమూరి రఘురామకృష్ణరాజు... ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. లోక్ సభ సభ్యుడిగా, ఆ తర్వాత శాసనసభ్యుడిగా ఎన్నికైన రాజు..…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోసం తన సీటును త్యాగం చేసిన ఎస్వీఎస్ఎన్ వర్మకు ఎట్టకేలకు ఫలితం…
వైసీపీ అధినేత జగన్ ఎప్పుడు బయటకు వచ్చినా భారీ ఎత్తున జన సమీకరణ ఉంటుంది. ఆయన వెనక యువత ఎక్కువగా…
తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటివరకు లేని వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని సృష్టించారు. దీనికి ప్రస్తుత మంత్రి నారా…