Movie News

కిరణ్ అబ్బవరం‌ను మెచ్చుకోవాల్సిందే

ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి హీరోగా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించాడు కిరణ్ అబ్బవరం. తన సినిమాల రైటింగ్, మేకింగ్‌లోనూ ఎంతో ఇన్వాల్వ్ అయ్యే కిరణ్.. తనకంటూ ఒక స్థాయి తెచ్చుకోవడం వెనుక తన కష్టం చాలానే ఉంది. ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు వచ్చిన నేపథ్యంలో అతనిప్పుడు నిర్మాతగా మారి బయటి వాళ్లతో సినిమా కూడా చేశాడు. అదే.. తిమ్మరాజుపల్లి టీవీ. 

ఇందులో దర్శకుడు, హీరో దగ్గర్నుంచి ప్రతి ఒక్కరూ కొత్త వాళ్లే కావడం విశేషం. ఆర్టిస్టులు, టెక్నీషియన్లు కలిపి ఏకంగా 50 మంది కొత్త వాళ్లను కిరణ్ ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు. ఈ చిత్ర కథానాయకుడు సాయితేజ్‌ బ్యాగ్రౌండ్ తెలిస్తే కిరణ్‌ను మెచ్చుకోకుండా ఉండలేం. అతను కిరణ్ నటించిన కొన్ని చిత్రాలకు కెమెరా అసిస్టెంట్‌గా పని చేశాడు. తనకు నటన మీద ఆసక్తి ఉన్న విషయం తెలుసుకుని, తన ప్రతిభను గుర్తించి ‘తిమ్మరాజుపల్లి టీవీ’ చిత్రంతో హీరోను చేశాడు.

ఇంకా ఎంతోమంది కొత్త వాళ్లకు ఈ సినిమాతో అవకాశం ఇస్తున్నాడు కిరణ్. అంతే కాదు.. ఇందులోని నటీనటులు, టెక్నీషియన్ల కుటుంబ సభ్యులను పిలిచి ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని బిగ్ స్క్రీన్ మీద స్పెషల్ షో కూడా ఏర్పాటు చేయిస్తున్నాడు కిరణ్. ఈ విషయంలో ఇండస్ట్రీ వర్గాలు కిరణ్‌ను అభినందిస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా కిరణ్ మీద ప్రశంసలు కురుస్తున్నాయి. 

కొత్త దర్శకుడు మునిరాజు రూపొందించిన ఈ చిత్రం ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీని ప్రోమోలు ప్రేక్షకుల దృష్టిని బాగానే ఆకర్షించాయి. 80, 90 దశకాల్లో కొత్తగా పల్లెటూళ్లలోకి టీవీలు వచ్చినప్పటి పరిస్థితులను సరదాగా చూపించే ప్రయత్నమే ‘తిమ్మరాజుపల్లి టీవీ’. మరి కిరణ్ కొత్త వాళ్లతో చేసిన ఈ ప్రయత్నం ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.

Kumar

Recent Posts

కొత్త ‘ఈవిల్ డెడ్’ అంత భయపెట్టిందా

హాలీవుడ్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా హారర్ జానర్ పరిచయం చేసిన కల్ట్ సిరీస్ గా 'ఈవిల్ డెడ్' సినిమాకున్న ఆదరణ…

31 minutes ago

తండ్రి కొడుకులకు కలిసొచ్చిన పల్లెటూరు

కొన్ని కాకతాళీయంగా జరిగినట్టు అనిపించినా దాని వెనుక తెలుసుకోవాల్సిన బాక్సాఫీస్ సత్యాలు చాలా ఉంటాయి. అలాంటిదే ఇది. ఇండస్ట్రీకి వచ్చి…

1 hour ago

ఎన్టీఆర్ అభిమానులకు ఆందోళన అక్కర్లేదు

నిన్న ధనుష్ తమిళ్ మురుగన్ టీజర్ వచ్చాక మొదట ఆందోళన చెందింది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. ఎందుకంటే త్రివిక్రమ్ సినిమాలోనూ…

2 hours ago

పల్లి పల్లి మంత్రి లోకేష్

పల్లి పల్లి లోకేశ్... ఇదేం పేరండి బాబూ అని జుట్టు పీక్కుంటున్నారా? అంత అవసరం ఏమీ లేదు. ఇదేమీ రాజకీయ ప్రత్యర్థులో,…

2 hours ago

ఫోక్సో కేసు పెట్టారని ఆరుగురిని చంపి.. ఆపై ఏం చేశాడంటే..

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో ఆదివారం తెల్లవారుజామున దారుణ ఘటన చోటుచేసుకుంది. తనపై నమోదైన పోక్సో కేసుకు ప్రతీకారంగా…

2 hours ago

మళ్ళీ మౌనవ్రతం చేస్తున్న స్లమ్ డాగ్

పూరి జగన్నాథ్ సినిమా అంటే ప్రేక్షకుల్లో అదో రకమైన స్పెషల్ క్రేజ్ ఉండేది. స్టార్ హీరోతో చేసినా, కొత్తవాళ్లతో తీసినా…

3 hours ago