సెలబ్రిటీలు ఏదైనా విషయం గురించి స్పందిస్తే చాలు దాన్ని చిలవలు పలవలు చేయడానికో టీమ్ సోషల్ మీడియాలో రెడీగా ఉంటుంది. తాజాగా డెకాయిట్ ప్రమోషన్లలో భాగంగా అడివి శేష్ న్యాచురల్ స్టార్ నానితో కలిసి ఒక వీడియో ఇంటర్వ్యూ చేశాడు. తాను నిర్మించిన హిట్ 2 హీరో, హిట్ 3లో క్యామియో చేసిన శేష్ అంటే నానికి ప్రత్యేకమైన బంధం ఉండటంలో ఆశ్చర్యం లేదు. అందుకే ప్యారడైజ్ లో బిజీగా ఉన్నప్పటికీ అడివి శేష్ కోసం సమయం కేటాయించాడు.
ఇందులో భాగంగా నాని అన్నమాటలు జనాలకు రకరకాల అర్థాల్లో వెళ్లిపోయాయి. డెకాయిట్ చూశాక ఒక ప్రేక్షకుడిగా తాను గౌరవింపబడ్డ ఫీలింగ్ కలిగిందని, ఈ మధ్య కొందరు మేకర్స్ ఆడియన్స్ ని తక్కువగా చూస్తూ మీకిదే ఎక్కువనే తరహాలో ప్రవర్తిస్తున్నారని చిన్న చురక వేశాడు. ఆయన అన్నది ఫలానా నిర్మాతనేనని కొందరు ట్వీట్లు చేయడం మొదలుపెట్టారు. అయితే అదే ప్రొడ్యూసర్ తో నాని ఒక కల్ట్ క్లాసిక్ చేసిన విషయాన్ని వాళ్ళు తేలిగ్గా మర్చిపోతున్నారు.
అంతే కాదు మేజర్, గూఢచారి కంటే డెకాయిట్ చాలా బాగుందని నాని పెద్ద స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఇది నిజమా కాదానేది పక్కనపెడితే స్నేహ ధర్మం, అందులోనూ సాటి హీరో ఎంతో కష్టపడి ఇంత పెద్ద సినిమా చేసినప్పుడు పొగడ్తల మీటర్ కాస్త పైనే ఉంటుంది. అంతెందుకు ఇది అందరూ చేసే పనే. బైకర్ మీద ఇంతకన్నా గొప్పగా వారం రోజులకు పైగానే ఎందరో పొగడ్తల వర్షం కురిపించారు. కానీ ఇంకా బ్రేక్ ఈవెన్ చేరుకోవడానికి కష్టపడుతోంది.
సో నాని అన్నాడని లేక అనలేదని డెకాయిట్ కలెక్షన్లు పెరగడం తరగడం ఉండదు. జనాలు చాలా తెలివైన వాళ్ళు. గుడ్డిగా థియేటర్లకు వెళ్లే పరిస్థితిలో లేరు. కాకపోతే అడివి శేష్ ఏర్పరుచుకున్న నమ్మకం డెకాయిట్ కొచ్చిన మిక్స్డ్ టాక్ తట్టుకునేలా చేసి మంచి ఓపెనింగ్స్ తెచ్చింది. థియేటర్ లెక్కల్లో సూపర్ హిట్ అవుతుందా లేదానేది ఇంకో అయిదారు రోజులు ఆగితే క్లారిటీ వస్తుంది. ఏది ఏమైనా నానిని కొందరు లక్ష్యంగా పెట్టుకోవడం మాత్రం ఊహించని వింత.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…