సెలబ్రిటీలు ఏదైనా విషయం గురించి స్పందిస్తే చాలు దాన్ని చిలవలు పలవలు చేయడానికో టీమ్ సోషల్ మీడియాలో రెడీగా ఉంటుంది. తాజాగా డెకాయిట్ ప్రమోషన్లలో భాగంగా అడివి శేష్ న్యాచురల్ స్టార్ నానితో కలిసి ఒక వీడియో ఇంటర్వ్యూ చేశాడు. తాను నిర్మించిన హిట్ 2 హీరో, హిట్ 3లో క్యామియో చేసిన శేష్ అంటే నానికి ప్రత్యేకమైన బంధం ఉండటంలో ఆశ్చర్యం లేదు. అందుకే ప్యారడైజ్ లో బిజీగా ఉన్నప్పటికీ అడివి శేష్ కోసం సమయం కేటాయించాడు.
ఇందులో భాగంగా నాని అన్నమాటలు జనాలకు రకరకాల అర్థాల్లో వెళ్లిపోయాయి. డెకాయిట్ చూశాక ఒక ప్రేక్షకుడిగా తాను గౌరవింపబడ్డ ఫీలింగ్ కలిగిందని, ఈ మధ్య కొందరు మేకర్స్ ఆడియన్స్ ని తక్కువగా చూస్తూ మీకిదే ఎక్కువనే తరహాలో ప్రవర్తిస్తున్నారని చిన్న చురక వేశాడు. ఆయన అన్నది ఫలానా నిర్మాతనేనని కొందరు ట్వీట్లు చేయడం మొదలుపెట్టారు. అయితే అదే ప్రొడ్యూసర్ తో నాని ఒక కల్ట్ క్లాసిక్ చేసిన విషయాన్ని వాళ్ళు తేలిగ్గా మర్చిపోతున్నారు.
అంతే కాదు మేజర్, గూఢచారి కంటే డెకాయిట్ చాలా బాగుందని నాని పెద్ద స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఇది నిజమా కాదానేది పక్కనపెడితే స్నేహ ధర్మం, అందులోనూ సాటి హీరో ఎంతో కష్టపడి ఇంత పెద్ద సినిమా చేసినప్పుడు పొగడ్తల మీటర్ కాస్త పైనే ఉంటుంది. అంతెందుకు ఇది అందరూ చేసే పనే. బైకర్ మీద ఇంతకన్నా గొప్పగా వారం రోజులకు పైగానే ఎందరో పొగడ్తల వర్షం కురిపించారు. కానీ ఇంకా బ్రేక్ ఈవెన్ చేరుకోవడానికి కష్టపడుతోంది.
సో నాని అన్నాడని లేక అనలేదని డెకాయిట్ కలెక్షన్లు పెరగడం తరగడం ఉండదు. జనాలు చాలా తెలివైన వాళ్ళు. గుడ్డిగా థియేటర్లకు వెళ్లే పరిస్థితిలో లేరు. కాకపోతే అడివి శేష్ ఏర్పరుచుకున్న నమ్మకం డెకాయిట్ కొచ్చిన మిక్స్డ్ టాక్ తట్టుకునేలా చేసి మంచి ఓపెనింగ్స్ తెచ్చింది. థియేటర్ లెక్కల్లో సూపర్ హిట్ అవుతుందా లేదానేది ఇంకో అయిదారు రోజులు ఆగితే క్లారిటీ వస్తుంది. ఏది ఏమైనా నానిని కొందరు లక్ష్యంగా పెట్టుకోవడం మాత్రం ఊహించని వింత.
This post was last modified on April 14, 2026 6:31 am
‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…
ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…