సినిమాలు రిలీజయ్యాక పైరసీ అవ్వడం.. ఆన్ లైన్లో లీక్ కావడం దశాబ్దాలుగా జరుగుతున్నదే. ఎంత ఆపాలని ప్రయత్నించినా.. ఈ విష సంస్కృతి ఆగడం లేదు. దీని వల్ల సినీ పరిశ్రమకు వందలు, వేల కోట్ల నష్టం వాటిల్లుతోంది. ఐతే ఇప్పుడు తమిళంలో ‘జననాయగన్’ సినిమా థియేటర్లలో మూవీ రిలీజ్ కావడానికి ముందే ఆన్ లైన్లో లీక్ అయిపోవడం పట్ల అందరూ షాకైపోతున్నారు.
ఫుల్ హెచ్డీ ప్రింటును ఎవరో ఆన్ లైన్లోకి వదిలేశారు. దాన్ని లక్షల మంది డౌన్ లోడ్ చేసుకుని చూసేయడం టీంను తీవ్ర మనోవేదనకు గురి చేసేదే. ఏకంగా రూ.400 కోట్ల ఖర్చుతో తీసిన సినిమాకు ఇలా కావడం ఎంతో బాధాకరం. చిత్ర బృందంలోని వారే ఈ దారుణానికి ఒడిగట్టారన్నది స్పష్టం. ఐతే ఇలా విడుదలకు ముందే సినిమా లీక్ అయిపోయిన ఉదంతం పూర్తిగా కొత్తేమీ కాదు.
గతంలో తెలుగులో పవన్ కళ్యాణ్ సినిమా ‘అత్తారింటికి దారేది’ ఇలాగే లీక్ అయింది. కానీ ఆ సినిమా సగం వరకే ఆన్ లైన్లోకి వచ్చింది. ఆలస్యం చేయకుండా చిత్ర బృందం సినిమాను థియేటర్లలో రిలీజ్ చేసేయడం, సినిమాకు బాక్సాఫీస్ దగ్గర అద్భుత ఫలితం రావడంతో పెద్దగా నష్టం వాటిల్లలేదు.
కానీ ‘జననాగయన్’ పరిస్థితి వేరు. పూర్తి సినిమా, హెచ్డీ ప్రింట్ ఆన్ లైన్లోకి వచ్చేసింది. పైగా ఈ సినిమా ఇప్పుడిప్పుడే థియేటర్లలో విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. కాబట్టి భారీ నష్టం వాటిల్లినట్లే. ఇలా రిలీజ్కు ముందు పూర్తి సినిమా ఆన్ లైన్లోకి వచ్చేయడం వల్ల నాశనం అయిన ఇంకో సినిమా తమిళంలో ఉంది. అదే.. జగ్గూభాయ్.
అది శరత్ కుమార్ హీరోగా సీనియర్ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. శరత్ సొంత సంస్థలో ఈ సినిమా తెరకెక్కింది. ఐతే ఈ సినిమా చిత్రీకరణ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్న సమయంలో.. ఆన్ లైన్లోకి వచ్చేసింది. ఎవరో యూనిట్ నుంచే అన్ ఫినిష్డ్ వెర్షన్ను ఆన్ లైన్లో లీక్ చేసేశారు.
దీంతో శరత్ కుమార్, ఆయన భార్య రాధిక కలిసి ప్రెస్ మీట్ పెట్టి బోరుమన్నారు. ఇద్దరూ కన్నీళ్లు పెట్టుకోగా.. రాధిక అయితే గట్టిగా ఏడ్చేశారు. నష్ట నివారణ కోసం తర్వాత చిత్ర బృందం క్లైమాక్స్ మార్చి షూట్ చేసి, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి రిలీజ్ చేసింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. థియేటర్లలో జనం పెద్దగా ఈ సినిమా చూడలేదు. ఈ చిత్రం వల్ల రాధిక, శరత్ భారీ నష్టాన్ని ఎదుర్కొన్నారు.
This post was last modified on April 11, 2026 4:03 pm
ఒకపక్క టాక్సిక్ పుణ్యమాని తెలుగు, కన్నడ మూవీ లవర్స్ సోషల్ మీడియా వేదికగా ఒకరిమీద మరొకరు కామెంట్లు, ట్రోల్స్ చేసుకోవడం…
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని, రెండు మూడు చిన్న సినిమాల అనుభవం ఉన్న హీరోను పెట్టి.. ఒక డెబ్యూ డైరెక్టర్ రూ.3-4…
అక్టోబర్ 2 నుంచి ఆదర్శ కుటుంబం ఏకె ఫార్టీ సెవెన్ తప్పుకున్నాక మళ్ళీ కొత్త డేట్ ప్రకటించలేదు. ఒకవేళ జైలర్…
ఏంటో జెన్ జీ ఆడియన్స్ మహా విచిత్రంగా ఉన్నారు. కొన్ని కొత్త సినిమాలను అస్సలు పట్టించుకోరు. కొన్ని రీ రిలీజులకేమో…
సినిమా నటులు ఎందరో రాజకీయ నాయకులయ్యారు. అయితే ప్రజల మనసులో బలమైన ముద్ర వేసిన వాళ్ళు మాత్రం కొందరే ఉంటారు.…
మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే సీ ఓటర్ చేసిన సర్వే తమిళనాడు టీవీకే, కాంగ్రెస్ కాపురం…