Movie News

హీరో ఊర మాస్.. హీరోయిన్ పక్కా క్లాస్

కెరీర్లో చాలా ఏళ్ల పాటు పక్కింటి అబ్బాయి పాత్రలే చేస్తూ వచ్చిన నేచురల్ స్టార్ నాని.. కొన్నేళ్ల ముందు ‘దసరా’ సినిమాతో ప్రేక్షకులకు పెద్ద షాకే ఇచ్చాడు. అతను అలాంటి ఊర మాస్ అవతారంలోకి మారడం అదే తొలిసారి. ముందు ఆ లుక్ చూసి జనం భయపడ్డారు. కానీ సినిమా చూసినపుడు అలవాటు పడ్డారు. ఆ చిత్రానికి మంచి విజయాన్ని కూడా కట్టబెట్టారు.

ఆ సినిమా ఇచ్చిన భరోసాతో దాని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రూపొందిస్తున్న కొత్త చిత్రంలో మరింత షాకింగ్ అవతారంలోకి మారాడు నాని. ‘ది ప్యారడైజ్’లో నాని లుక్ గురించి ఎంత చర్చ జరిగిందో తెలిసిందే. టాలీవుడ్ చరిత్రలోనే అత్యంత షాకింగ్ హీరో లుక్స్‌లో ఇదొకటి. ఈ సినిమాకు సంబంధించిన అన్ని ప్రోమోల్లోనూ నాని ఊర మాస్‌గా కనిపిస్తున్నాడు. కానీ ఈ చిత్రంలో నానికి జోడీగా నటిస్తున్న కాయదు లోహర్ మాత్రం పక్కా క్లాస్‌గా కనిపించబోతోంది. ఆమె లుక్‌ను తాజాగా సోషల్ మీడియాలో లాంచ్ చేసింది చిత్ర బృందం.

వింటేజ్ విదేశీ అమ్మాయిల్లాగా కాయదు డిఫరెంట్ అవతారంలో కనిపించబోతోంది. అంత ఊర మాస్‌గా ఉన్న నాని పక్కన.. ఇంత క్లాస్‌గా కనిపించే హీరోయిన్ ఏంటి అనిపించేలా ఉంది తన లుక్. గతంలో తమిళ కల్ట్ మూవీ ‘ఆడుగళం’లో హీరో ధనుష్ ఇలాగే చాలా మాస్‌గా కనిపిస్తే.. తన పక్కన తాప్సి పూర్తి భిన్నమైన అవతారంలో కనిపించింది. అలాంటి కాంట్రాస్ట్ లుక్స్‌లోనే నాని, కాయదులను చూపించబోతున్నాడు శ్రీకాంత్ ఓదెల.

ఈ చిత్రంలో కాయదు కథానాయిక అని ఇప్పటిదాకా అధికారికంగా ప్రకటించలేదు. నేరుగా తన పుట్టిన రోజు నాడు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్‌తోనే ఆమె హీరోయిన్ అనే విషయం అఫీషియల్‌గా వెల్లడైంది. ఈ చిత్రంలో లెజెండరీ నటుడు మోహన్ బాబు విలన్ పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. మార్చి చివరి వారంలో రావాల్సిన ‘ది ప్యారడైజ్’ ఆగస్టు 21కి వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. ‘దసరా’ చిత్రాన్ని నిర్మించిన సుధాకర్ చెరుకూరినే ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

Kumar

Recent Posts

పవన్ పేరు ఎందుకు మారింది?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…

4 hours ago

ఏపీ పాఠ‌శాల‌ల్లో చాగంటి పాఠ్యాంశాలు..!

ఏపీ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప్ర‌ముఖ ప్ర‌వ‌చ క‌ర్త చాగంటి కోటేశ్వ‌ర‌రావు ప్ర‌సంగాల‌ను పాఠ్యాంశాలుగా ప్ర‌వేశ పెడుతున్నట్టు ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి…

5 hours ago

జ‌న‌’సేన’ జాగ్ర‌త్త ప‌డాలా?

ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం…

7 hours ago

మీనాక్షి ఇష్యూ కాంగ్రెస్ ను ‘హర్ట్’ చేసింది!

ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ…

9 hours ago

మోదీ రికార్డును బద్దలుకొట్టడం కష్టమే!

భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం…

9 hours ago

పవన్ నోట మరోమారు ‘తెలంగాణ’ మాట

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోమారు తెలంగాణ అంశం మీద నోరు విప్పారు. భారత దేశంలో…

10 hours ago