ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించి, ప్రతి ఇంట్లోనూ అభిమానులను సంపాదించుకున్న నటుడు అల్లరి నరేష్. తన తొలి చిత్రం ‘అల్లరి’ సర్ప్రైజ్ హిట్ అయి, తన ఇంటి పేరుగా మారిపోయింది. తర్వాత ఎన్నో కామెడీ సినిమాలతో అతను అలరించాడు. ఒక దశాబ్దం పాటు నరేష్కు ఎదురే లేకపోయింది.
నరేష్ సినిమాలంటే కడుపుబ్బ నవ్వుకోవచ్చని అన్ని వర్గాల ప్రేక్షకులూ థియేటర్లకు వెళ్లేవాళ్లు. తన ఫ్లాప్ సినిమాలు కూడా డబ్బులు తెచ్చిపెట్టేవి. నిర్మాతల పాలిట కల్ప తరువులా ఉండేవాడు నరేష్. తనతో సినిమా తీస్తే మినిమం గ్యారెంటీ అన్నట్లుండేది.
కానీ ఒక దశ దాటాక తన కామెడీ సినిమాలు జనాలకు మొహం మొత్తేయడం మొదలుపెట్టింది. దీంతో వరుస ఫ్లాపులు ఎదురై కామెడీనే వదిలేయాల్సిన పరిస్థితి తలెత్తింది. కొన్నేళ్ల ముందు రూటు మార్చి ‘నాంది’ రూపంలో పూర్తి సీరియస్ మూవీ చేశాడు నరేష్. అది మంచి ఫలితాన్నందుకుంది కానీ.. తర్వాత చేసిన ఈ తరహా సినిమాలేవీ ఫలితాన్నివ్వలేదు. ఉగ్రం, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, ఆ ఒక్కటీ అడక్కు, 12 ఏ రైల్వే కాలనీ.. ఇలా ప్రతి సినిమా ఫ్లాపే అయింది.
దీంతో ఇప్పుడు ఏం చేయాలో పాలుపోని స్థితికి చేరుకున్నాడు అల్లరోడు. తన చివరి సినిమా ‘ఆల్కహాల్’ విడుదలకే నోచుకోకుండా పక్కన పడిపోయింది. దాని సంగతేమో తేల్చకుండా నరేష్ కొత్త సినిమాను మొదలుపెట్టాడు. ఆ చిత్రమే.. కనకదుర్గ. ఈసారి సక్సెస్ కోసం నరేష్ ఇంకో రూట్లోకి వెళ్తున్నాడు. టైటిల్కు తగ్గట్లే ఇది భక్తి రస చిత్రమట.
నరేష్ నుంచి ఇలాంటి సినిమాను అస్సలు ఊహించలేం.
కానీ ఇప్పుడు దేవుడు వెర్సస్ దుష్టశక్తి అంటే జనం ఊగిపోతున్నారని ఈ రూట్లోకి వెళ్తున్నట్లుంది. ఈ చిత్రానికి సీనియర్ రైటర్ బీవీఎస్ రవి కథ అందించడం విశేషం. చిత్ర నిర్మాతల్లో కూడా ఆయనొకరు. సత్యదేవ్తో ‘47 డేస్’ అనే సినిమా, నరేష్ అగస్త్యతో ‘వికటకవి’ అనే వెబ్ సిరీస్ తీసిన ప్రదీప్ మద్దాలి ఈ చిత్రానికి దర్శకుడు. కాజల్ చౌదరి అనే కొత్తమ్మాయి కథానాయికగా నటిస్తోంది. మరి ఈ ప్రయత్నమైనా అల్లరి నరేష్కు విజయాన్నిస్తుందేమో చూడాలి.
This post was last modified on April 8, 2026 4:02 pm
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…
విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన చెన్నై లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో…
ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…